నాలుగు సెకండ్లపాటు కంపించిన భూమి
ఆంధ్రప్రదేశ్ ప్రకాశం జిల్లా ముండ్లమూరు మండలాల పరిధిలో భూమి స్వల్పంగా కంపించింది. దీంతో ప్రజలు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఆదివారం అర్ధరాత్రి 12.47 గంటల సమయంలో ఈ భూప్రకంపనలు (Earthquake) చోటుచేసుకున్నాయి. ఒక్కసారిగా భూమి కంపించడంతో ఇండ్ల నుంచి ప్రజలు పరుగులు పెడుతూ రోడ్లపైకి వొచ్చారు. ఈ భూ ప్రకంపనలు సుమారు నాలుగు సెకండ్ల పాటు కొనసాగినట్లు స్థానికులు వెల్లడించారు. గత మే నెల 6న కూడా ప్రకాశం జిల్లాలో ఇదే మాదిరిగా భూకంపం సంభవించిందని తెలిపారు. పొదిలిలో ఉదయం 9.54 గంటల సమయంలో భూమి కంపించడంతో ఆ ప్రాంతం ప్రజలు తీవ్ర భయాందోళనకు లోనయ్యారు. ఆ సమయంలో కూడా సుమారు ఐదు సెకండ్లపాటు ప్రకంపనలు కొనసాగినట్లు నివేదికలు తెలిపాయి. కొత్తూరు పరిధిలోని రాజు హాస్పిటల్ వీధి, ఇస్లాంపేట, బ్యాంక్ కాలనీ తదితర ప్రాంతాల్లో స్పష్టంగా ప్రకంపనలు గుర్తించారు.
తెలంగాణలోనూ భూకంపం (Earthquake)
ఇదిలా ఉండగా అంతకుముందు రోజు సాయంత్రం తెలంగాణలోని పలు ప్రాంతాల్లో భూప్రకంపనలు (Earthquake) చోటు చేసుకున్న విషయం తెలిసిందే.. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో భూమి 3.8 తీవ్రతతో కంపించింది. గంగాధర, చొప్పదండిలోని పలు ఇండ్లు. , వాణిజ్య భవనాల్లోని వస్తువులు కిందపడిపోయాయి. దీంతో ప్రజలు భయంకంపితులయ్యారు. ఇక నిర్మల్ జిల్లాలో ఖానాపూర్, కడెం, జన్నారం, లక్సెట్టిపేట ప్రాంతాల్లోనూ భూప్రకంపనలు నమోదయినట్లు తెలుస్తోంది. కాగా వరుసగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇటువంటి ప్రకంపనలు చోటుచేసుకోవడం ప్రజల్లో భయాందోళన కలిగిస్తోంది.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.