ED notices : తెలంగాణలో ఓ మనీ లాండరింగ్ కేసు (Money Laundering Case) కలకలం రేపుతోంది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ (Enforcement Directorate (ED) చేపట్టిన విచారణ అనేక మలుపులు తిరుతోంది. సినీ ప్రముఖుల మెడకు సైతం చుట్టుకుంటోంది. హైదరాబాద్ కేంద్రంగా ఉన్న సాయి సూర్య డెవలపర్స్ (Sai Surya Developers), సురానా గ్రూప్ (Surana Group) సంస్థల కార్యాలయాలపై ఇటీవల సోదాలు చేపట్టిన ఈడీ.. టాలీవుడ్ సూపర్స్టార్ మహేశ్ బాబు (Tollywood superstar Mahesh Babu)కు నోటీసులు (ED notices) జారీ చేయడం హాట్ టాపిక్గా మారింది.
ED notices కేసు ఏమిటి?
ఈ రెండు రియల్ ఎస్టేట్ సంస్థలపై తెలంగాణ పోలీసుల (Telangana Police)కు వచ్చిన పలు ఫిర్యాదుల ఆధారంగా ఈడీ మనీ లాండరింగ్ కేసు (Money Laundering Case) నమోదు చేసింది. విచారణను ప్రారంభించి ముమ్మరంగా కొనసాగిస్తోంది. సాయి సూర్య డెవలపర్స్ అధినేత కె. సతీశ్ చంద్ర గుప్తా, సురానా గ్రూప్ డైరెక్టర్ నరేంద్ర సురానాపై అక్రమ వ్యాపారాలు (real estate) నిర్వహించినట్టు ఆరోపణలు ఉన్నాయి. ఫేక్ లేఅవుట్లలో ప్లాట్లు అమ్మడం, ఒక్క ప్లాట్ను పలువురికి కట్టబెట్టడం, నకిలీ రిజిస్ట్రేషన్ హామీలు ఇవ్వడం లాంటి పలు మోసాలు చేసినట్టు అధికార వర్గాలు వెల్లడించాయి. ఈ కేసులో ED విచారణ చేపట్టింది. ఈ వ్యవహారంలో సుమారు రూ.100 కోట్ల అక్రమ లావాదేవీలు (illegal transactions) జరిగినట్టు గుర్తించింది. ఈ డబ్బును పలు మార్గాల ద్వారా ఇతరులకు బదిలీ చేశారని, అందులో భాగంగా సినిమా ప్రముఖులకు ప్రమోషన్ పేరిట ఇచ్చారని ఈడీ అధికారులు అనుమానిస్తున్నారు.
Money Laundering Case : మహేశ్ బాబుకు ఏం సంబంధం ?
ఈ నేపథ్యంలో సూపర్స్టార్ మహేశ్ బాబు (Tollywood superstar Mahesh Babu) పేరు ముందుకొచ్చింది. సాయి సూర్య డెవలపర్స్ (Sai Surya Developers) సంస్థకు ఆయన బ్రాండ్ అంబాసిడర్గా ప్రచారం చేశారు. సంస్థ ప్రాజెక్టుల ప్రకటనల్లో పాల్గొన్న (promoting) ఆయనకు కంపెనీ నుంచి రూ.5.9 కోట్లు అందినట్టు ప్రాథమిక ఆధారాలు లభించాయి. అందులో రూ.3.4 కోట్లు చెక్కుల ద్వారా, మిగతా రూ.2.5 కోట్లు నగదు రూపంలో అందినట్టు (transactions) భావిస్తున్నారు. ఇప్పటి వరకు అందిన సమాచారం ప్రకారం మహేశ్ బాబు ఈ మోసంలో నేరుగా ప్రమేయం లేనప్పటికీ ప్రమోషన్ కోసం ఆయన తీసుకున్న డబ్బుల విషయంలో విచారణ అవసరమైందని ఈడీ భావిస్తోంది. ఈ నేపథ్యంలో ఆయన్ను విచారణకు పిలవాలన్న ఉద్దేశంతో అధికారిక నోటీసులు పంపినట్టు తెలుస్తోంది.
మరికొందరు సెలబ్రిటీలు కూడా?
ఇటీవల ED సాయి సూర్య డెవలపర్స్, సురానా గ్రూప్ ఆఫీసులపై సోదాలు నిర్వహించిన ఈడీ.. పలు కీలక పత్రాలు, లావాదేవీల (transactions) రికార్డులను స్వాధీనం చేసుకుందని తెలిసింది. ఈ సోదాల్లో మొత్తం రూ.100 కోట్ల మోసం జరిగినట్టు అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రముఖులు ప్రమోషన్ల పేరుతో ఈ సంస్థల నుంచి డబ్బులు తీసుకున్నందుకు మరికొంత మంది సెలబ్రిటీల పేర్లు కూడా ఈడీ దృష్టికి వచ్చినట్టు తెలుస్తోంది. ఈ లావాదేవీలపై కూడా త్వరలో విచారణ చేపట్టే అవకాశముంది. ఈ కేసు విచారణ దశలో ఉన్న నేపథ్యంలో మహేశ్బాబు నుంచి ఈడీ వివరణ కోరే అవకాశం ఉంది. అయితే.. దీనిపై ఆయన ఇంతవరకు స్పందించలేదు.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.