Ghatkesar Railway Bridge : మాజీ మంత్రి చామకూర మల్లారెడ్డి చొరవతో ఘట్కేసర్ రైల్వే బ్రిడ్జి పనులకు నిధులను రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసింది. అర్ధాంతరంగా నిలిచిపోయి పనులు పెండింగ్ లో పడిపోవడంతో మల్లా రెడ్డి సూచన మేరకు ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క రూ.50లక్షలను మంజూరు చేశారు. దీంతో ఘట్కేసర్ జేఏసీ, మున్సిపల్ బీఆర్ఎస్ నాయకులు హర్షం వ్యక్తం చేశారు.
పెండింగ్లో ఉన్న ఘట్ కేసర్ ( Ghatkesar ) రైల్వే బ్రిడ్జి పనులను పూర్తి చేసేందుకు సహకరించాలని ఘట్కేసర్ మున్సిపల్ బీఆర్ఎస్ అధ్యక్షుడు బండారి శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో పలువురు నాయకులు మాజీ మంత్రి మల్లారెడ్డినికి కలిసి వినతిపత్రం అందజేశారు. దీంతో డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్కను మల్లారెడ్డి కలిసి సమస్యను వివరించారు. దీనికి భట్టి విక్రమార్క సానుకూలంగా స్పందించారు. రూ.50 లక్షలను మంజూరు చేస్తూ ఆదేశాలు జారీ చేశారు.
బ్రిడ్జి నిర్మాణానికి నిధులు మంజూరు చేయడం పట్ల భట్టి విక్రమార్క, మల్లారెడ్డికి ఘట్కేసర్ జేఏసీ చైర్మన్ మారం లక్ష్మారెడ్డి, సభ్యులు, మున్సిపల్ బీఆర్ఎస్ అధ్యక్షుడు బండారు శ్రీనివాస్ గౌడ్ తోపాటు పలువురు కౌన్సిలర్లు ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా బండారి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. మాజీ మంత్రి మల్లారెడ్డి చొరవతోనే రైల్వే బ్రిడ్జ్ నిర్మాణం 80 శాతం పూర్తి అయిందని తెలిపారు. తన సొంత నిధులను కూడా బ్రిడ్జి నిర్మాణానికి కేటాయించడం ఆయన గొప్పతనానికి నిదర్శనం అని అన్నారు. బ్రిడ్జి నిర్మాణం పూర్తయ్యే వరకు సహకారిస్తానని జేఏసీ, బీఆర్ఎస్ నాయకులు ఆశాభావం వ్యక్తం చేశారు.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..








