Sarkar Live

GHMC | రూ.15వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఏఈ

ACB Raids in GHMC | రాష్ట్రంలో ఏసీబీ అధికారుల దాడులు కొన‌సాగుతూనే ఉన్నాయి. బాధితుల నుంచి ఫిర్యాదు అంద‌గానే త‌క్ష‌ణ‌మే అధికారులు రంగంలోకి దిగి ప‌క్కా ప్లాన్ తో అవినీతి అధికారుల‌ను రెడ్ హ్యాండెడ్ గా ప‌ట్టుకుంటున్నారు. తాజాగా అంబర్

ACB Raids

ACB Raids in GHMC | రాష్ట్రంలో ఏసీబీ అధికారుల దాడులు కొన‌సాగుతూనే ఉన్నాయి. బాధితుల నుంచి ఫిర్యాదు అంద‌గానే త‌క్ష‌ణ‌మే అధికారులు రంగంలోకి దిగి ప‌క్కా ప్లాన్ తో అవినీతి అధికారుల‌ను రెడ్ హ్యాండెడ్ గా ప‌ట్టుకుంటున్నారు. తాజాగా అంబర్ పేట జీహెచ్ఎంసీ (GHMC ) లో ఏఈ మనీషా.. కాంట్రాక్టర్ నుంచి లంచం తీసుకుంటూ ఏసీబీ వ‌ల‌కు చిక్కింది. బిల్లుల మంజూరుకు లంచం డిమాండ్ చేయడంతో ఇప్పటికే 5 వేల రూపాయలు ఇచ్చిన స‌ద‌రు కాంట్రాక్టర్. ఒప్పందం ప్రకారం మరో రూ.15 వేలు ఇవ్వాలని డిమాండ్ చేయటంతో విసిగిపోయాడు. దీంతో బాధితుడు ఏసీబీని ఆశ్రయించ‌డంతో అధికారులు రంగంలోకి దిగారు.

బాధితుని ఫిర్యాదుతో నిఘా ఉంచి జీహెచ్ఎంసీ కార్యాలయంపై ఏసీబీ అధికారులు సోదాలు చేశారు సరిగ్గా లంచం తీసుకుంటున్న సమయంలో ఏఈ మనీషాను పట్టుకున్నారు. ఆమెపై కేసు నమోదు చేసి విచార‌ణ చేప‌డుతున్నారు.

ఇలా ఫిర్యాదు చేయండి

ఎవరైనా ప్రభుత్వ అధికారి లేదా సిబ్బంది లంచం అడిగితే ప్రజలు తెలంగాణ అవినీతినిరోధకశాఖ వారి “టోల్ ఫ్రీ నెంబర్ 1064 కు డయల్ చేయాలని ఏసీబీ అధికారులు కోరారు. అంతే కాకుండా వివిధ సామజిక మధ్యమాలయిన “వాట్సాప్ ( 9440446106) ఫేస్ బుక్ (Telangana ACB), ఎక్స్ (@TelanganaACB) మరియు వెబ్ సైట్ ( https://acb.telangana.gov.in ) ద్వారా కూడా సంప్రదించవచ్చని తెలిపారు.


తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం  సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి.  అలాగే మా  ఫేస్ బుక్,వాట్సప్ చానల్ఎక్స్(ట్విట్టర్)  ను  ఫాలో అవండి.  మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

More Posts

Web Stories

error: Content is protected !!
Rajma | ఇలాంటి సమస్యలున్నవారు రాజ్మా తినడం ప్రమాదమే! Nirgundi | వావిలి మొక్కలు దివ్యమైన ఔషధ గుణాలు.. Tulsi Leaves : ఉదయాన్నే తులసి ఆకులు తింటే ఏమవుతుంది?