Indian Railways News | హైదరాబాద్కు రెండు హైస్పీడ్ రైళ్లు ( High-speed trains) త్వరలోనే అందుబాటులోకి రానున్నాయి. హైదరాబాద్- బెంగళూరు, హైదరాబాద్-చెన్నై మధ్య ఇవి నడవనున్నాయి. విమానానికి (flight) సమానంగా వీటి వేగం ఉండనుంది. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఈ హైస్పీడ్ రైలు కారిడార్ ( High-speed rail corridor) ప్రాజెక్ట్ విజయవంతమైతే హైదరాబాద్-బెంగళూరుకు కేవలం 2 గంటలు, హైదరాబాద్-చెన్నైకు 2 గంటల 20 నిమిషాల్లో ప్రయాణాన్ని పూర్తి చేసుకోవచ్చు. జపాన్ షికాన్సెన్ బుల్లెట్ ట్రైన్ టెక్నాలజీ ఆధారంగా ఈ హైస్పీడ్ రైళ్లను రూపొందిస్తున్నారు.
రిస్క్ లేని High-speed trains ప్రయాణం
ప్రస్తుతం హైదరాబాద్ నుంచి బెంగళూరు (Hyderabad to Bengaluru), హైదరాబాద్ నుంచి చెన్నై
రైలు ప్రయాణానికి 10-15 గంటల సమయం పడుతుంది. కానీ ఈ ప్రతిపాదిత హైస్పీడ్ రైళ్ల ద్వారా ప్రయాణ సమయం గణనీయంగా తగ్గుతుంది. విమాన ప్రయాణానికి సమానంగా సమయం పడుతుంది. హైదరాబాద్ నుంచి బెంగళూరు విమాన ప్రయాణ సమయం 1 గంట 15 నిమిషాలైతే ఎయిర్పోర్టుకు చేరుకోవడానికి, సెక్యూరిటీ చెకింగ్, బోర్డింగ్ తదితర పనులు పూర్తి చేసుకోవడానికి మరో 2-3 గంటలు అదనంగా తీసుకోవాల్సి వస్తుంది. అదే ఈ హైస్పీడ్ రైలు ప్రారంభమైతే కేవలం 2 గంటల్లో చేరుకోవచ్చు.
పర్యావరణ హిత ప్రయాణం
ఈ హైస్పీడ్ రైళ్లు 320 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తాయి. దీంతో సమయం ఆదా అవుతుంది. ఎయిర్పోర్ట్ చెకింగ్, క్యాబ్ వెయిటింగ్ వంటి ఇబ్బందులు ఉండవు. విమాన ప్రయాణంతో పోలిస్తే తక్కువ కార్బన్ ఉద్గారాలు ఉంటాయి కాబట్టి ఈ రైలు ప్రయాణం ఆరోగ్యానికి సురక్షితం.
High-speed trains.. ఇతర ప్రయోజనాలు
ఈ హై-స్పీడ్ రైలు ప్రారంభమైతే హైదరాబాద్, బెంగళూరు, చైన్నై నగరాల మధ్య వ్యాపార కార్యకలాపాలు మరింత వేగంగా సాగుతాయి. వేగవంతమైన కనెక్టివిటీ వల్ల పర్యాటక ప్రదేశాలకు ఎక్కువ మంది టూరిస్టులు చేరుకునే అవకాశం ఉంటుంది. హై-స్పీడ్ రైలు నిర్మాణంతో కొత్తగా 10,000 మందికి పైగా ఉద్యోగ అవకాశాలు లభించే అవకాశం ఉంది.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..