Hyderabad Metro Fare Revision : మెట్రో రైలులో ప్రయాణించే ప్రయాణికులకు ఎల్ అండ్ టీ (L&T) సంస్థ షాకిచ్చింది.ఫేర్ ఫిక్సేషన్ కమిటీ (FFC) సిఫార్సులను అనుసరించి హైదరాబాద్ మెట్రో రైలు (Metro Rail) సవరించిన ఛార్జీలను మే 17, 2025 నుండి అమల్లోకి తీసుకొస్తోంది. మెట్రో రైల్వేస్ (ఆపరేషన్ & నిర్వహణ) చట్టం, 2002లోని సెక్షన్ 34 కింద ఏర్పడిన ఈ కమిటీ జనవరి 25, 2023న తన నివేదికను సమర్పించింది. తాజాగా సవరించిన ఛార్జీ (Fare Revision)లను సంస్థ ఆర్థిక స్థిరత్వాన్ని సమతుల్యం చేయడానికి అమలు చేస్తున్నారు. కొత్త ఛార్జీలు ఈ క్రింది విధంగా ఉన్నాయి.
Hyderabad Metro : తక్కువ దూరాలకు చార్జీలు
2 కి.మీ వరకు దూరాలకు ఛార్జీ రూ.12
2 కి.మీ నుంచి ఎక్కువ, 4 కి.మీ వరకు రూ.18;
4 కి.మీ నుంచి 6 కి.మీ వరకు ఛార్జీ రూ.30
6 కి.మీ నుంచి 9 కి.మీ వరకు,ఛార్జీ రూ.40
9 కి.మీ కంటే ఎక్కువ 12 కి.మీ వరకు ఛార్జీ రూ.50
ఎక్కువ దూరాలకు ధరలు ఇలా..
12 కి.మీ నుంచి 15 కి.మీ వరకు ఛార్జీ రూ.55
15 కి.మీ నుంచి 18 కి.మీ వరకు, ఛార్జీ రూ.60
18 కి.మీ నుంచి 21 కి.మీ వరకు, ఛార్జీ రూ.66
21 కి.మీ నుంచి 24 కి.మీ వరకు, ఛార్జీ రూ.70
24 కి.మీ కంటే ఎక్కువ దూరాలకు, ఛార్జీ రూ.75
కొత్త ఛార్జీల గురించి మరిన్ని వివరాల కోసం ప్రయాణికులు www.ltmetro.com అధికారిక వెబ్సైట్ను సందర్శించాలి.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.