Heatwave in Telangana : తెలంగాణలో పలు జిల్లాల్లో ఈదరుగాలులతో కూడిన వర్షాలతో వాతావరణం కాస్త చల్లబడగా ప్రజలు ఎండల నుంచి ఉపశమనం పొందారు. అయితే ఇకపై వేసవి తీవ్ర ప్రతాపం (Heatwave) చూపించనుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. రానున్న 3 రోజులపాటు తీవ్రమైన వడగాల్పులు, ఉక్కపోత ఉంటుందని హైదరాబాద్ వాతావరణశాఖ(Hyderabad Meteorological Department) అధికారులు వెల్లడించారు. ముఖ్యంగా ఉత్తర తెలంగాణలో వడగాల్పుల ప్రభావం ఎక్కువ ఉండే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్ జిల్లాల్లో తీవ్రమైన ఉక్కపోత, ఎండలు, వడగాల్పులు (Heatwave ) వీస్తాయిని తెలిపారు. ఈ నేపథ్యంలో ఆయా జిల్లాలకు అధికారులు రెడ్ అలర్ట్ (Red Alert) జారీ చేశారు. పగటి సమయంలో ప్రజలు బయటకు రావొద్దని సూచించారు.
ఇక హైదరాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి, వికారాబాద్, యాదాద్రి భువనగిరి జిల్లాలకు తప్ప మిగిలిన అన్ని జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్స్ జారీ చేశారు. రాత్రిపూట కూడా వాతావరణం ఉష్ణోగ్రతలు ఎక్కవగా ఉండే అవకాశం ఉందని తెలిపారు. రాష్ట్రంలో అనేక చోట్ల పగటి ఉష్ణోగ్రతలు 44 డిగ్రీలకు పైగా నమోదయ్యే చాన్స్ ఉందని వెల్లడించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అయితే ఎల్లుండి మాత్రం రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.