India pakistan tensions : జమ్మూకశ్మీర్ లోని పెహల్గామ్ ఉగ్రదాడి అంశాన్ని ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి (UN Security Council) సమావేశంలో ప్రస్తావించారు. పాకిస్థాన్ చేస్తున్న వాదనలను కొట్టివేస్తూ భద్రతా మండలి సభ్యులు కొన్ని ప్రశ్నలు సంధించారు. పెహల్గామ్ లో జరిగిన పాశవిక దాడి వెనుక లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్థ హస్తం ఉందా లేదా అని ప్రశ్నించారు. ఈ అంశంపై యూఎన్ భద్రతా మండలి సభ్యదేశాలు పాకిస్థాన్ను గట్టిగా నిలదీశాయి. పెహల్గామ్లో జరిగిన ఉగ్రవాద ఘటనను అన్ని దేశాలు తీవ్రంగా ఖండించాయి. ఆ ఘటన పట్ల బాధ్యత వహించాల్సిన అవసరం ఉందని యూఎన్ తేల్చి చెప్పింది.
మతం పేరిట పర్యాటకులను లక్ష్యంగా చేసుకోవడాన్ని భద్రతా మండలి సభ్యులు (UN Security Council) తీవ్రంగా ఖండించారు. పాకిస్థాన్ చేపడుతున్న క్షిపణి పరీక్షలు కూడా సమావేశంలో ప్రస్తావించారు. క్షీపణి పరీక్షలను యూఎస్ సభ్య దేశాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. ఇలాంటి సమసయంలో అణ్వాయుధ క్షిపణి పరీక్షలు చేయడంలో మీ ఉద్దేశం ఏమిటని పాక్ ను ప్రశ్నించారు. రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలను ఎందుకు పెంచుతున్నట్లు పాకిస్థాన్ను నిలదీశారు. పెహల్గామ్ దాడి ఘటనలో తమను నిందిస్తున్నట్లు పాకిస్థాన్ చేస్తున్న వాదలను యూఎన్ సభ్య దేశాలు కొట్టిపారేశాయి. భారతదేశంతో సమస్యను ద్వైపాక్షికంగా పరిష్కరించుకోవాలని పలుదేశాలు సూచించాయి.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.