Sarkar Live

KCR | కాళేశ్వరం కమిషన్ ముందు కేసీఆర్

‘నిజం బయటపడుతుందన్న మాజీ ముఖ్యమంత్రి Kaleshwaram Commission | తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, భారత రాష్ట్ర సమితి (BRS) అధ్య‌క్షుడు కల్వ‌కుంట్ల చంద్రశేఖర్ రావు (KCR) మంగళవారం ఉదయం హైదరాబాద్‌లోని BRK భవన్‌లో PC ఘోష్ కమిషన్ ముందు హాజరయ్యారు.2014 నుంచి

KCR

‘నిజం బయటపడుతుందన్న మాజీ ముఖ్యమంత్రి

Kaleshwaram Commission | తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, భారత రాష్ట్ర సమితి (BRS) అధ్య‌క్షుడు కల్వ‌కుంట్ల చంద్రశేఖర్ రావు (KCR) మంగళవారం ఉదయం హైదరాబాద్‌లోని BRK భవన్‌లో PC ఘోష్ కమిషన్ ముందు హాజరయ్యారు.
2014 నుంచి 2023 వరకు రాష్ట్రంలో అధికారంలో ఉన్న BRS ప్రభుత్వానికి కేసీఆర్ మానస పుత్రిక‌గా, కిరీట రత్నంగా పరిగణించబడే కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ (KLIP) నిర్మాణంలో అవకతవకలపై వ‌చ్చిన ఆరోప‌ణ‌ల‌పై ఈ ప్యానెల్ దర్యాప్తు చేస్తోంది.

బీఆర్‌కే భవన్ వ‌ద్ద పెద్ద సంఖ్య‌లో కార్య‌క‌ర్త‌లు హాజ‌ర‌య్యారు. ఈసంద‌ర్భంగా బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడుతూ, “కాళేశ్వరం ప్రాజెక్టులో దాదాపు 100 భాగాలు ఉన్నాయి. ప్రాజెక్టులోని రెండు బ్యారేజీల వద్ద ప్రమాదం జరిగింది. త్వ‌ర‌లో నిజం బయటపడుతుంది. తెలంగాణ ప్రజలు సరైన సమయంలో ఈ వేధింపులకు తగిన గుణ‌పాఠం చెబ‌తారు. ఇది కాంగ్రెస్, బీజేపీ చేసిన దుష్ప్రచారం మాత్రమే” అని అన్నారు. 100 జన్మల తర్వాత కూడా, “ఒక రేవంత్ రెడ్డి భారీ కాళేశ్వరం ప్రాజెక్టును ఊహించి అమలు చేయగల కేసీఆర్ స్థాయిని చేరుకోలేడు” అని కేటీఆర్‌ అన్నారు.

మహారాష్ట్ర సరిహద్దు మీదుగా తెలంగాణలోని జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో గోదావరి నదిపై ఉన్న కాళేశ్వ‌రం లిఫ్ట్ ఇరిగేష‌న్ ప్రాజెక్ట్ ( KLIP) ఉత్తర తెలంగాణలో నీటిపారుదల, పారిశ్రామిక, గృహ అవసరాలకు నీటిని సరఫరా చేస్తోంది. ఈ ప్రాజెక్టుకు అవసరమైన భారీ మొత్తంలో నీరు – 195 TMC – మేడిగడ్డ బ్యారేజీ నుండి రావాల్సి ఉంది. శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్ట్ నుంచి 20 TMCలు వ‌స్తాయి. మరో 25 TMCలు భూగర్భజలాలు తోడ‌వుతాయి. కాళేశ్వరం ప్రాజెక్టు పనులు జూన్ 2019లో ప్రారంభమైయి అక్టోబర్ 21, 2023న పూర్త‌యంది. మేడిగడ్డ బ్యారేజీలోని 7వ బ్లాక్‌లోని 20వ స్తంభం కుంగిపోవ‌డంతో కాంగ్రెస్,బీజేపీ విమ‌ర్శ‌లు గుప్పించింది. ఈ సంఘటన తర్వాత క‌ళేశ్వ‌రం కమిషన్‌ను ఏర్పాటు చేశారు. ఆ సంఘటన జరిగినపుడు కేసీఆర్ తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉన్నారు.

విచార‌ణ జరిగింది ఇలా..

అక్టోబర్ 2023లో జరిగిన ప్రమాదం తర్వాత, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (NDSA) బృందం కుంగిపోయిన స్తంభాన్ని పరిశీలించి, ప్రాజెక్టును అమలు చేస్తున్న L&T కంపెనీతో సమావేశాన్ని నిర్వహించింది. ఫిబ్రవరి 13, 2024న, కాంగ్రెస్ నేతృత్వంలోని తెలంగాణ ప్రభుత్వం ప్రాజెక్ట్ యొక్క “మూడు బ్యారేజీల రూపకల్పన నిర్మాణంపై క్షుణ్ణంగా తనిఖీ” నిర్వహించాలని NDSAని కోరింది. తదుపరి నెలలో తనిఖీలు, అధ్యయనం కోసం NDSA మూడు బ్యారేజీలను సందర్శించింది. ఈ సంవత్సరం ఏప్రిల్ 29న, రాష్ట్ర ప్రభుత్వం NDSA “సరైన భౌగోళిక-సాంకేతిక దర్యాప్తులు లేకపోవడం, డిజైన్ లోపాలు, నిర్మాణ లోపాలు, మోడలింగ్ అధ్యయనాల వైఫల్యం, నిర్మాణాత్మక ఇబ్బందులకు గురికావడం, బలమైన నాణ్యత నియంత్రణ లేకపోవడం, ఆపరేషన్, నిర్వహణ వైఫల్యాలు, ఆనకట్ట భద్రతా అంశాలను విస్మరించడం జరిగింది” అని ప్రకటించింది. “కమిటీ నివేదిక మూడు బ్యారేజీలలో నిర్మాణ లోపాల‌ను హైలైట్ చేసింది” అని ప్రభుత్వం తెలిపింది. “మేడిగడ్డ బ్యారేజీ”, “బ్లాక్-7లోని స్తంభాల పగుళ్లు వచ్చాయని నివేదిక పేర్కొంది. అన్నారం, సుందిల్ల అనే మరో రెండు బ్యారేజీలు కూడా “ఇలాంటి సీపేజ్ లేదా పైపింగ్ స‌మ‌స్య‌లు వెలుగుచూశాయ‌ని తెలిపింది.

బీఆర్‌కే భ‌వన్ వ‌ద్ద భారీ బందోబ‌స్తు..

ముఖ్య‌మంత్రి కేసీఆర్ విచారణ నేపథ్యంలో బీఆర్‌కే భవన్‌ను పోలీసులు అష్ట‌ దిగ్బంధనం చేశారు. ఎక్కడికక్కడ బారికేడ్లను ఏర్పాటు చేసి బీఆర్ఎస్ కార్యకర్తలను అడ్డుకుంటున్నారు. బీఆర్‌కే భ‌వ‌న్‌కు వొచ్చే మూడు మార్గాలను పూర్తిగా మూసివేశారు. బీఆర్‌కే భ‌వ‌న్‌తో పాటు ఆ ప‌రిస‌ర ప్రాంతాల్లో పోలీసులు భారీగా మోహ‌రించారు. కాగా కేసీఆర్‌కు మద్దతుగా రాష్ట్ర నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో కార్యకర్తలు తరలివచ్చారు.


తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం  సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి.  అలాగే మా  ఫేస్ బుక్,వాట్సప్ చానల్ఎక్స్(ట్విట్టర్)  ను  ఫాలో అవండి.  మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

More Posts

error: Content is protected !!