ACB Raids | ఏసీబీ అధికారులు రోజురోజుకు దాడులను ముమ్మరం చేస్తున్నా అవినీతి అధికారులు పట్టుబడుతూనే ఉన్నారు. అయితే లంచగొండులను కట్టడి చేయాల్సిన పోలీసులే లంచం తీసుకుంటూ దొరికిపోవడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. తాజాగా భూ వివాదంలో స్టేషన్ బెయిల్ ఇచ్చేందుకు రూ. 20 వేలు లంచం తీసుకుంటూ నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి ఎస్సై ఏసీబీ అధికారులకు బుధవారం దొరికిపాయారు.
నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి (Kalwakurthi) పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహిస్తున్న సెకండ్ ఎస్సై రామచందర్ (Ramchandar) లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. కల్వకుర్తి మండలం గుండూరు గ్రామానికి చెందిన వెంకటయ్య భూ వివాదంలో స్టేషన్ బెయిల్ ఇవ్వడానికి రూ.20 వేలు డిమాండ్ చేశారు. అయతే చివరికి రూ.10000 లకు ఒప్పందం కుదుర్చుకున్నాడు. దీంతో బాధితుడు ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేయడంతో వారు రంగంలోకి దిగారు. అధికారులు చెప్పినట్లుగా ఒప్పందం ప్రకారం రూ.10 వేల నగదును ఎస్సైకి ఇచ్చేందుకు రెడీ అయ్యాడు. ఈ క్రమంలో వెంకటయ్య నుంచి ఎస్సై రాంచందర్ రూ.10 వేలు లంచం (Bribe) తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు.
లంచం కోసం వేధిస్తే ఇలా ఫిర్యాదు చేయండి
ఎవరైనా ప్రభుత్వ అధికారి లేదా సిబ్బంది లంచం (Bribe) అడిగితే ప్రజలు తెలంగాణ #అవినీతినిరోధకశాఖ వారి “టోల్ ఫ్రీ నెంబర్ 1064 కు డయల్ చేయాలని ఏసీబీ అధికారులు కోరారు. అంతే కాకుండా వివిధ సామజిక మధ్యమాలయిన “వాట్సాప్ ( 9440446106) ఫేస్ బుక్ (Telangana ACB), ఎక్స్ (@TelanganaACB) మరియు వెబ్ సైట్ ( https://acb.telangana.gov.in ) ద్వారా కూడా సంప్రదించవచ్చని తెలిపారు.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.