Kavach Research Institute : రైల్వే (Railways)లో విప్లవాత్మక మార్పులు చోటుచేసుకుంటున్నాయి. హైదరాబాద్లోని బేగంపేట రైల్వే స్టేషన్ (Begumpet Railway Station)లో త్వరలోనే ‘కవచ్’ పరిశోధనా సంస్థ (Kavach Research Institute) ఏర్పాటు కానుంది. కవచ్ అనేది భారతీయ రైల్వేలు అభివృద్ధి చేసిన ఆటోమేటిక్ ట్రైన్ ప్రొటెక్షన్ సిస్టం. ఇది రైళ్ల మధ్య ప్రమాదాలను నివారించేందుకు, అత్యవసర బ్రేకింగ్ అమలు చేయడానికి, వేగ పరిమితిని నియంత్రించడానికి సహాయపడుతుంది. భారతీయ రైల్వేలు రైళ్ల భద్రతను మెరుగుపరిచేందుకు ఈ టెక్నాలజీని 2024-25 ఆర్థిక సంవత్సరంలో పెద్దఎత్తున అమలు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ సాంకేతికత వల్ల రైళ్ల మధ్య ఢీకొనడం వంటి ప్రమాదాలు తగ్గుతాయని అధికారులు భావిస్తున్నారు.
Kavach Research Institute : ప్రయాణికుల భద్రతకు భరోసా
తెలంగాణ రాష్ట్రం ‘కవచ్’ (Kavach) అమలులో ముందంజలో ఉంది. దక్షిణ మధ్య రైల్వే జోన్లో ఇప్పటికే 25 శాతం రైల్వే మార్గం కవచ్ పరిధిలోకి వచ్చింది. రాబోయే సంవత్సరాల్లో మరింత విస్తరించాలనే ఉద్దేశంతో సికింద్రాబాద్లో ప్రత్యేక పరిశోధనా సంస్థను ఏర్పాటు చేస్తున్నారు. తద్వారా భవిష్యత్తులో భారతీయ రైల్వేలు మరింత సురక్షితమైన ప్రయాణ అనుభవాన్ని అందించనున్నాయి. రైల్వే నెట్వర్క్ మొత్తాన్ని కవచ్ పరిధిలోకి తీసుకురావడం వల్ల ప్రయాణికుల భద్రత పెరుగడంతో పాటు రైలు నిర్వహణలోనూ సమర్థత పెరుగుతుంది.
మహిళా సాధికారతకు పెద్ద పీట
ఇక రైల్వే రంగంలో మహిళా సాధికారత (women’s empowerment)కు పెద్దపీట వేస్తూ బేగంపేట రైల్వే స్టేషన్ను పూర్తిగా మహిళలే నిర్వహించేలా ప్రణాళికలు రూపొందించారు. స్టేషన్ మేనేజర్ నుంచి టికెట్ చెకింగ్ సిబ్బంది వరకు మొత్తం ఉద్యోగులందరూ మహిళలే ఉంటారు. దీనిపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. పురుషాధిక్యత గల రంగాల్లో మహిళలు పెద్ద ఎత్తున ప్రవేశించడం ద్వారా లింగ సమతుల్యత సాధించడంలో ఇది కీలక అడుగు అని పలువురు అభిప్రాయ పడుతున్నారు. ప్రయాణికుల భద్రతను పెంచడం, ఆధునిక సదుపాయాలను అందించేందుకు ‘అమృత్ భారత్’ పథకం (Amrit Bharat) కింద బేగంపేట స్టేషన్ (Begumpet Railway Station)ను ఆధునికీకరిస్తున్నారు. స్టేషన్లో మరమ్మతులు, విస్తరణ పనులు జరుగుతుండగా, ప్రయాణికుల సౌకర్యాలను మెరుగుపరిచేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. వెయిటింగ్ హాల్స్ విస్తరించడంతో పాటు మరింత విశాలమైన ప్రదేశాన్ని ఏర్పాటు చేయనున్నారు. అంతేకాకుండా, స్టేషన్ భద్రతను పెంచేందుకు సీసీటీవీ పర్యవేక్షణ, ప్రత్యేక భద్రతా విభాగాన్ని ఏర్పాటు చేయనున్నారు.
అత్యుత్తమ సేవలకు ప్రణాళికలు
ఈ రెండు ప్రాజెక్టుల వల్ల హైదరాబాద్ రైల్వే రంగంలో ప్రధాన కేంద్రంగా మారబోతోంది. రైళ్ల భద్రతను పెంచేందుకు కవచ్ పరిశోధనా సంస్థ (Kavach Research Institute) ఏర్పాటు చేయడం, మహిళలకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ బేగంపేట స్టేషన్ను పూర్తిగా మహిళా సిబ్బంది నిర్వహించేలా చేయడం, స్టేషన్లను ఆధునికీకరించడం వంటి చర్యలు ప్రయాణికులకు ఎంతో ప్రయోజనకరంగా మారబోతున్నాయి. రాబోయే రోజుల్లో భారతీయ రైల్వేలు మరింత ఆధునికంగా మారి ప్రయాణికులకు అత్యుత్తమ అనుభవాన్ని అందించేందుకు ఈ ప్రణాళికలు ఎంతగానో సహాయపడతాయి.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..







