KCR | తెలంగాణ తల్లి విగ్రహంలో మార్పులు చేయడం కాంగ్రెస్ ప్రభుత్వం మూర్ఖత్వమని.. ఇవి ప్రభుత్వాలు చేయాల్సిన పనులు ఇవేనా? అని బీఆర్ఎస్ అధినేత, కల్వకుంట్ల చంద్రశేఖరరావు ప్రశ్నించారు. తెలంగాణ అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో.. సభలో అనుసరించాల్సిన వ్యూహంపై ఆదివారం ఆయన ఎర్రవెల్లిలోని వ్యవసాయ క్షేత్రంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ.. ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చడంపై కేసీఆర్ ఫైర్ అయ్యారు. ప్రభుత్వాలు మార్పులు చేసుకుంటూ పోతే ఎలా? అని ప్రవ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం సమస్యల పరిష్కారంపై దృష్టి సారించాలని సూచించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు శాసనసభ సమావేశాలకు హాజరుకావాలని చెప్పారు. అంశాలవారీగా ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీయాలని చెప్పారు.
రైతుబంధు ప్రయోజనాలు ప్రజలకు వివరించాలని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు మాజీ సీఎం కేసీఆర్ సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం అన్నిరంగాల్లో విఫలమైందని విమర్శించారు. గురుకులాలు, విద్యారంగంలో వైఫల్యాలు ఎండగట్టాలన్నారు. మూసీ, హైడ్రా(Hydra) విషయంలో ప్రభుత్వ వైఖరిని ఎండగట్టాలని.. నిర్బంధ పాలన గురించి అసెంబ్లీ సమావేశాల్లో ప్రస్తావించాలని చెప్పారు. కాంగ్రెస్ మేనిఫెస్టో ఆధారంగా వైఫల్యాలను ఎత్తి చూపాలని పేర్కొన్నారు. ఫిబ్రవరి బహిరంగ సభలో సర్కార్ వైఖరిని ఎండగతామని అన్నారు. ఫిబ్రవరి తర్వాత పార్టీలో అన్ని కమిటీ ఏర్పాటు చేస్తామని ఈసందర్భంగా కేసీఆర్ (K.Chndrashekhar Rao) ప్రకటిచారు. కమిటీల ఏర్పాటు తర్వాత సభ్యత్వ నమోదు ఉంటుందని చెప్పారు.
2 Comments
[…] అభివర్ణించారు. పార్లమెంటు శీతాకాల సమావేశం ప్రారంభానికి ముందు ఆయన మీడియాతో […]
[…] కాంగ్రెస్ మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ కూడా ప్రభుత్వ చర్యను సమర్థించారు, గత బిఆర్ఎస్ ప్రభుత్వం అధికారిక డిజైన్ను ఆమోదించడంలో విఫలమైందని వాదించారు. కొత్త కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర గీతం, తెలంగాణ తల్లి డిజైన్ను అధికారికంగా ఆమోదించిందని, ప్రజల ఆకాంక్షల మేరకు తెలంగాణ సంక్షిప్త పేరును టీఎస్ నుంచి టీజీగా మార్చిందని వారు చెప్పారు. […]