Kodada | కోదాడ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదం(Road Accident) లో ఒక ఎస్సై, కానిస్టేబుల్ ప్రాణాలు కోల్పోయారు. గుర్తుతెలియని వాహనాన్ని వెనుక నుంచి కారు ఢీకొనడంతో అందులో ప్రయాణిస్తున్న ఎస్సై, కానిస్టేబుల్ మృతి చెందారు (Crime News). ఈ ఘటన కోదాడ పట్టణ పరిధిలోని జాతీయ రహదారిపై దుర్గాపురం వద్ద గురువారం తెల్లవారుజామున చోటు చేసుకుంది.
స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆంధ్రప్రదేశ్ లోని కోనసీమ జిల్లా (Konaseema District) ఆలమూరు స్టేషన్లో విధులు నిర్వర్తిస్తున్న ఎస్సై అశోక్, కానిస్టేబుల్ వీరస్వామి ఓ పని నిమిత్తం హైదరాబాద్ బయలుదేరారు. మార్గంమధ్యలో వీరు ప్రయాణిస్తున్న కారు కోదాడ పరిధిలో గుర్తుతెలియని వాహనాన్ని వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఎస్సై, కానిస్టేబుల్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలో మరో ఇద్దరికి తీవ్రగాయాలు కావడంతో స్థానికులు కోదాడ ప్రభుత్వ హాస్పిటల్కు తరలించి చికిత్స అందిస్తున్నారు.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.