Telangana ACB Raids | రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండలంలోని ఇన్ములనర్వ గ్రామ పంచాయతీ (Panchayat Secretary) కార్యదర్శి సురేందర్ (Surendar)పై అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారులు కేసు నమోదు చేశారు. ఓ నిర్మాణంపై ఇచ్చిన నోటీసును పట్టించుకోకుండా ఉండేందుకు ఫిర్యాదుదారుడి నుంచి రూ.లక్ష డిమాండ్ చేశాడు. ఈ క్రమంలో రూ.50 వేలు లంచం తీసుకున్నారని ఆయనపై ఆరోపణలు వచ్చాయి. దీంతో ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకునే యత్నించగా నిందితుడు సురేందర్ పరారయ్యాడు.
శుక్రవారం సాయంత్రం శంషాబాద్లోని ఇండియానా హోటల్ సమీపంలో ఫిర్యాదుదారుడి నుంచి రూ.50 వేల మొత్తాన్ని సురేందర్ స్వీకరించి తన ఎస్యూవీ కారులో సంఘటనా స్థలం నుంచి చందానగర్ లోని తన అపార్ట్మెంట్ వెళ్లాడు. తన కారు తన ఇంటి వద్ద నిలిపి తన బావమరిది కారు తీసుకొని అతనికి లంచం డబ్బులు ఇచ్చి అక్కడి నుంచి పారిపోయాడు. అయితే, ఏసీబీ అధికారులు కారును, లంచం తాలుకు నగదు మొత్తాన్ని స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం పరారీలో ఉన్న సురేందర్ కోసం గాలిస్తున్నట్లు ఏసీబీ అధికారులు వెల్లడించారు.
లంచం అడిగితే ACB కి ఇలా ఫిర్యాదు చేయండి..
వరైనా ప్రభుత్వ అధికారి లేదా సిబ్బంది లంచం అడిగితే ప్రజలు తెలంగాణ #అవినీతినిరోధకశాఖ వారి “టోల్ ఫ్రీ నెంబర్ 1064 కు డయల్ చేయాలని ఏసీబీ అధికారులు కోరారు. అంతే కాకుండా వివిధ సామజిక మధ్యమాలయిన “వాట్సాప్ ( 9440446106) ఫేస్ బుక్ (Telangana ACB), ఎక్స్ (@TelanganaACB) మరియు వెబ్ సైట్ ( https://acb.telangana.gov.in ) ద్వారా కూడా సంప్రదించవచ్చని తెలిపారు.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.