MLA Maganti Gopinath Passes Away | తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో విషాదం నెలకొంది. హైదరాబాద్ జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ కన్నుమూశారు. దీర్ఘకాలంగా మూత్రపిండాల సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయన.. గత గురువారం గుండెపోటుకు గురయ్యారు. చికిత్స నిమిత్తం గచ్చిబౌలిలోని ఏఐజీ హాస్పిటల్ కు తరలించగా గత మూడు రోజులుగా చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో గోపీనాథ్ ఆదివారం జూన్న ఉదయం కన్నుమూశారు. చికిత్సకు ఆయన శరీరం ఏ మాత్రం స్పందించకపోవడంతో ఆసుపత్రిలోనే ఆయన తుదిశ్వాస విడిచారు. ఆయన మరణ వార్త బీఆర్ఎస్ శ్రేణుల్లో, నియోజకవర్గ ప్రజల్లో తీవ్ర విషాదాన్ని నింపింది.
మాగంటి గోపీనాథ్ (Maganti Gopinath) రాజకీయ ప్రస్థానం
1963న జూన్ 2 జన్మించిన మాగంటి గోపీనాథ్.. రాష్ట్ర రాజకీయాల్లో తనదైన ముద్ర వేశారు. ఆయన మొదట తెలుగుదేశం పార్టీతో రాజకీయాల్లోకి ప్రవేశించారు. ఉస్మానియా యూనివర్సిటీలో బీఏ పూర్తి చేసిన మాగంటి గోపీనాథ్ ఎన్టీఆర్ పిలుపుతో 1983లో రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. తెలుగు యువత అధ్యక్షుడిగా, హైదరాబాద్ టీడీపీ అధ్యక్షుడిగా సమర్థవంతంగా బాధ్యతలు నిర్వర్తించారు. 2014లో తొలిసారిగా టీడీపీ తరపున జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఆ తర్వాత టీఆర్ఎస్ (బీఆర్ఎస్) పార్టీలో చేరారు. జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఆయన ఇప్పటివరకు మూడుసార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించి ప్రజలకు దగ్గరయ్యారు. 2014 టీడీపీ నుంచి , 2018, 2023లో జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్ తరపున వరుసగా గెలుపొందారు. ఆయన హైదరాబాద్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడిగా కూడా బాధ్యతలు నిర్వర్తించారు.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.