Mahabubnagar : మహబూబ్ నగర్ జిల్లా సర్కిల్-1లో నీటిపారుదల శాఖ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (AEE)గా పనిచేస్తున్న మహ్మద్ ఫయాజ్, మహబూబ్ నగర్ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ ఎదురుగా ఉన్న బేకరీలో ఫిర్యాదుదారుడి నుంచి రూ.3,000 లంచం తీసుకుంటుండగా అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు.
ఎల్ఆర్ఎస్ (LRS) అధికారిక సైట్లో జాయింట్ ఇన్స్పెక్షన్ రిపోర్ట్, ప్లాట్ NOCని అప్లోడ్ చేయడానికి ఏఈఈ మహ్మద్ ఫయాజ్ లంచం డిమాండ్ చేశాడు. ఈ క్రమంలో బాధితుడు ఏసీబీని ఆశ్రయించడంతో అధికారులు రంగంలోకి దిగి పక్కా ప్లాన్ తో ఫయాజ్ లంచం తీసుకుంటుండగా అదుపులోకి తీసుకున్నారు. అతడి వద్ద నుంచి రూ.3,000 లంచం మొత్తాన్ని స్వాధీనం చేసుకున్నారు.
గితే ACB కి ఇలా ఫిర్యాదు చేయండి..
వరైనా ప్రభుత్వ అధికారి లేదా సిబ్బంది లంచం అడిగితే ప్రజలు తెలంగాణ #అవినీతినిరోధకశాఖ వారి “టోల్ ఫ్రీ నెంబర్ 1064 కు డయల్ చేయాలని ఏసీబీ అధికారులు కోరారు. అంతే కాకుండా వివిధ సామజిక మధ్యమాలయిన “వాట్సాప్ ( 9440446106) ఫేస్ బుక్ (Telangana ACB), ఎక్స్ (@TelanganaACB) మరియు వెబ్ సైట్ ( https://acb.telangana.gov.in ) ద్వారా కూడా సంప్రదించవచ్చని తెలిపారు.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.