Mamnoor airport : తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్ జిల్లా మామునూర్ విమానాశ్రయం (Mamnoor airport) కోసం భూసేకరణ సర్వే (land acquisition survey) చేపట్టడంపై స్థానిక రైతులు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఈ విమానాశ్రయానికి కేంద్రం అనుమతి ఇచ్చిన కొన్ని రోజులకే రాష్ట్ర ప్రభుత్వం సర్వే ప్రారంభించింది. దీంతో భూములు కోల్పోతున్న రైతులు (farmers) ఈ రోజు ఆందోళనకు దిగారు. నక్కాలపల్లి రోడ్డుపై నిరసనను ప్రదర్శించారు. తమకు కేంద్ర ప్రభుత్వం న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారే అవకాశం ఉందని భావించిన పోలీసులు అక్కడ గట్టి బందోబస్తును ఏర్పాటు చేశారు.
రైతుల నిరసన ఎందుకు ?
మామునూర్ ప్రాంతంలో ఒక ఎకరం భూమి కనీసం రూ. 4 కోట్ల నుంచి 5 కోట్ల వరకు విలువ చేస్తుందని, ప్రభుత్వం తగిన పరిహారం అందించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. పరిహారం విషయంలో ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు అధికారిక ప్రకటన రాకపోవడంతో నిరసనకు దిగారు.
Mamnoor airport : కేంద్ర ప్రకటనతో భూసేకరణ వేగవంతం
మామునూరు విమానాశ్రయానికి 175 ఎకరాల భూమి అవసరం ఉంటుందని అధికారులు ప్రణాళికలు రూపొందించారు. ఈ మేరకు సేకరించేందుకు ప్రభుత్వం కరసత్తు చేస్తోంది. ఇప్పటికే 690 ఎకరాలు గతంలో ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (AAI)కి కేటాయింపులు జరిగాయి. కానీ, కొత్త రన్వేలు, టెర్మినల్స్ నిర్మాణం వంటి పెరుగుతున్న మౌలిక సదుపాయాల దృష్ట్యా అదనంగా 280 ఎకరాల భూమి అవసరం ఏర్పడింది. ఈ విమానాశ్రయం పనునులను చేపట్టేందుకు AAI సిద్ధంగా ఉందని, రాష్ట్ర ప్రభుత్వం భూ సేకరణ పూర్తి చేసి అప్పగిస్తే రెండున్నరేళ్లల్లో పూర్తి చేస్తామని కేంద్ర పౌరవిమానయాన మంత్రి కె. రామ్మోహన్ నాయుడు (Union Civil Aviation Minister K Rammohan Naidu) రెండు రోజుల క్రితం ప్రకటించారు. దీంతో భూ సేకరణను ప్రభుత్వం వేగవంతం చేసింది. ఈ క్రమంలో తమకు న్యాయం చేయాలని స్థానిక రైతులు ఆందోళనలను ఉధృతం చేశారు.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..