Medigadda Incident | జయశంకర్ భూపాలపల్లి (Bhupalpally) జిల్లాలో శనివారం రాత్రి వేళ తీవ్ర విషాదకర ఘటన చోటుచేసుకుంది. మహదేవపూర్ మండలం అంబటిపల్లి సమీపంలో మేడిగడ్డ బ్యారేజీ (Medigadda Barrage) వద్ద గోదావరి నదిలో ఆరుగురు యువకులు గల్లంతయ్యారు. గోదావరిలో శుక్రవారం సాయంత్రం స్నానానికని వెళ్లిన ఆరుగురు యువకులు తిరిగి బయటకు రాలేదు. మొత్తం 10 మంది వెళ్లగా అందులో ఆరుగురు గల్లంతయ్యారు. ఘటనపై మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు (Minister Sridhar Babu) తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. వెంటనే సహయక చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.
కాగా నదిలో గల్లంతయినవారిలో అంబటిపల్లికి చెందిన నలుగు యువకులు, కొర్లకుంటకు చెందిన ఇద్దరు యువకులు ఉన్నట్లు సమాచారం. మహాదేవపుర్ ఎస్ఐ పవన్ కుమార్ సంఘటన స్థలానికి చేరుకొని యువకుల కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు.
గల్లంతైన యువకులు ఎవరు?
స్నానానికి వెళ్లిన యువకుల్లో నాలుగు మంది అంబటిపల్లి గ్రామానికి, మరో ఇద్దరు మహముత్తారం మండలంలోని కొర్లకుంటకు చెందినవారు. గల్లంతైన యువకుల వివరాలు ఈ విధంగా ఉన్నాయి:
- మధుసూదన్ (18) – అంబటిపల్లి
- శివ మనోజ్ (15) – అంబటిపల్లి
- రక్షిత్ (13) – అంబటిపల్లి
- సాగర్ (16) – అంబటిపల్లి
- పండు (18) – కొర్లకుంట
- రాహుల్ (19) – స్తంభంపల్లి
సంఘటన స్థలాన్ని మహాదేవపుర్ ఎస్ఐ పవన్ కుమార్ చేరుకొని గల్లంతమైన యువకుల ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. గజ ఈతగాళ్ల సాయంతో యువకుల కోసం నదిలో గాలిస్తున్నారు. వేసవి ఎండలు తీవ్రమైన నేపథ్యంలో నదిలో స్నానం చేస్తుండగా ప్రమాదం జరిగి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. కాగా ఈ ఘటన గురించి తెలుసుకున్న మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు దిగ్భ్రాంతికి గురయ్యారు. అధికారులు యువకుల ఆచూకీ కొనుగొనేందుకు రెస్క్యూ టీం తో గాలించాలని ఆదేశించారు.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.