Miss World 2025 : హైదరాబాద్ లో నిర్వహిస్తున్న ప్రపంచ సుందరి పోటీలకు వివిధ దేశాల నుంచి వచ్చిన సుందరీమణులు శుక్రవారం సాయంత్రం మహబూబ్ నగర్ జిల్లాలోని చారిత్రాత్మక పిల్లల మర్రి పర్యాటక కేంద్రాన్ని సందర్శించారు. సుందరీమణులుకు జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి,ఎస్ పి.డి.జానకి లు ఘనంగా స్వాగతం పలికారు.

16 వ శతాబ్దానికి చెందిన రాజ రాజేశ్వర దేవాలయాన్ని మిస్ వరల్డ్ 2025 (Miss World 2025 ) పోటీదారులు సందర్శించారు. ఫోటోలు దిగారు.పురావస్తు ప్రదర్శన శాల ను సందర్శించారు. అక్కడ చారిత్రాత్మక శిల్పాలు, ఉమ్మడి జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి సేకరించిన పురాతన కళాఖండాలు, వాటి విశిష్టతలు, తెలుసుకున్నారు.

మ్యూజియం వద్ద రాష్ట్ర ఎక్సైజ్ పర్యాటక ,సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు,శాసన సభ్యులు, జిల్లా కలెక్టర్, ఎస్పిలతో ఫోటోలు దిగారు. అనంతరం పిల్లలమర్రి మహా వృక్షం సందర్శించారు.

Miss World 2025 : దాదాపు మూడున్నర ఎకరాల్లో విస్తరించి ఎన్నో మానులు కానీ మొదటి మాను ఎక్కడో ఇప్పటికీ తెలుసుకోలేక పోయిన 700 సంవత్సరాల వయస్సు కలిగిన మహా మర్రి వృక్ష ప్రకృతి అందాలను చూసి సుందరీమణులు తన్మయంతో మైమరచిపోయారు.

అడుగడుగున తెలంగాణ సాంప్రదాయ సాంస్కృతిక కార్యక్రమాలు బోనాలు, లంబాడ నృత్యం, రంగు రంగుల రంగవల్లి, భారతీయ సాంస్కృతిక ప్రదర్శనలు తిలకించిన సుందరీమణులు తన్మయంతో పులకించిపోయారు. తెలంగాణ బతుకమ్మ పాటలకు అందాల బొమ్మలు ఆడి పాడి ఆనందించారు.

ఈ సందర్భంగా మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను ప్రపంచ సుందరీమణుల ద్వారా ప్రపంచానికి చాటి చెప్పాలని పిలుపునిచ్చారు.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.