BRS MLC Kavitha | బిఆర్ఎస్ పార్టీలో విబేధాలు కొనసాగుతున్న వేళ సంచలన ఆరోపణలు చేసి రాజకీయంగా తీవ్ర కలకలం రేపిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తాజాగా కీలక ప్రకటన చేశారు. పార్టీ నుంచి తాను బయటకు వస్తున్నట్లు ఒక తెలుగు పత్రికలో వచ్చిన వార్తలను ఆమె తీవ్రంగా ఖండించారు, అవి నిరాధారమైనవని కొట్టిపారేశారు.
తనను సంప్రదించకుండానే ఇలాంటి ఊహాజనిత వార్తలు ప్రచురించడం పట్ల ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha ) అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈమేరకు కల్వకుంటల కవిత Xలో ఒకపోస్టు చేశారు. మూడు రోజుల వ్యవధిలో ఒక స్థానిక పత్రిక వాస్తవ విరుద్ధమైన కథనాలను ప్రచురించిందని కవిత విమర్శించారు. “నా గురించి ఈ వార్తను నన్ను సంప్రదించకుండా ప్రచురించడాన్ని జర్నలిజం లేదా శాడిజం అని పిలవాలా?” అని ఆమె నకిలీ వార్తలపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఆ పోస్టులో సదరు వార్తల క్లిప్పింగ్లను కూడా షేర్ చేశారు.
కనీసం నన్ను సంప్రదించకుండా ఈ వార్త రాసిన పత్రికది జర్నలిజమా?? శాడిజమా ? pic.twitter.com/kUESVnMDTF
— Kavitha Kalvakuntla (@RaoKavitha) May 28, 2025
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.