Nalgonda : నల్లగొండ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జిల్లా మత్స్య శాఖ అధికారిణి లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డారు (ACB trap) . ఫిషరీస్ కో ఆపరేటివ్ సొసైటీలో కొత్త సభ్యుల పేర్ల నమోదుకు అవకాశం కల్పించాలని కోరగా, అందుకు మత్స్యశాఖ అధికారిణి చరిత రెడ్డి లంచం డిమాండ్ చేశారు. గురువారం బాధితుడి నుంచి రూ. 20 వేలు లంచం తీసుకుంటుండగా ఆమెను ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ఆమెను కోర్టులో హాజరు పరిచి రిమాండ్కు తరలించారు.
లంచం అడిగితే ACB కి ఇలా ఫిర్యాదు చేయండి..
వరైనా ప్రభుత్వ అధికారి లేదా సిబ్బంది లంచం అడిగితే ప్రజలు తెలంగాణ #అవినీతినిరోధకశాఖ వారి “టోల్ ఫ్రీ నెంబర్ 1064 కు డయల్ చేయాలని ఏసీబీ అధికారులు కోరారు. అంతే కాకుండా వివిధ సామజిక మధ్యమాలయిన “వాట్సాప్ ( 9440446106) ఫేస్ బుక్ (Telangana ACB), ఎక్స్ (@TelanganaACB) మరియు వెబ్ సైట్ ( https://acb.telangana.gov.in ) ద్వారా కూడా సంప్రదించవచ్చని తెలిపారు.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.
 
								 
															








 
				 
				 
				 
                                                                     
                                                                     
                                                                    