MLC Oath : నూతనంగా ఎన్నికైన ఎమ్మెల్సీలు (MLCs) తెలంగాణ రాష్ట్ర శాసన మండలి (Telangana Legislative Council)లో ఈ రోజు ప్రమాణ స్వీకారం (Oath Taking) చేశారు. శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందరెడ్డి (Legislative Council Chairman Gutta Sukhender Reddy) ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. పట్టభద్రులు, ఉపాధ్యాయులు, ఎమ్మెల్యే కోటా నుంచి ఎన్నికైన సభ్యులు ప్రమాణం చేశారు. జాతీయ గీతాలాపనతో ప్రారంభమైన ఈ కార్యక్రమంలో చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఒక్కొక్కరిని వేదికపైకి పిలిచి ప్రమాణం చేయించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మంత్రులు ఉత్తమ్ కుమార్రెడ్డి, శ్రీధర్ బాబు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్, ఎంపీ రఘునందన్ రావు, మాజీ మంత్రి జానారెడ్డి తదితరులు హాజరయ్యారు.
గెలిచింది ఎవరెవరంటే..
ఎమ్మెల్యే కోటా నుంచి కాంగ్రెస్ (Congress) తరపున విజయశాంతి, అద్దంకి దయాకర్, శంకర్ నాయక్, సీపీఐ (CPI) తరపున నెల్లికంటి సత్యం గెలిచారు. బీఆర్ఎస్ (BRS) నుంచి దాసోజు శ్రవణ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కరీంనగర్ పట్టభద్రులు, టీచర్ కోటాలో బీజేపీ (BJP) తరపున అంజిరెడ్డి, మల్క కొమురయ్య విజయం సాధించారు. ఖమ్మం టీచర్ కోటాలో శ్రీపాల్రెడ్డి (PRTU) గెలిచారు.
MLC Oath : ప్రమాణం చేసిన ఎమ్మెల్సీలు వీరే..
- శ్రీపాల్రెడ్డి (ఖమ్మం టీచర్ కోటా – పీఆర్టీయూ)
- శంకర్ నాయక్ (ఎమ్మెల్యే కోటా – కాంగ్రెస్)
- నెల్లికంటి సత్యం (ఎమ్మెల్యే కోటా – సీపీఐ)
- మల్క కొమురయ్య (కరీంనగర్ టీచర్ కోటా – బీజేపీ)
- అంజి రెడ్డి (కరీంనగర్ పట్టభద్ర కోటా – బీజేపీ)
రాష్ట్ర రాజకీయాల్లో కొత్త జోష్
ఈసారి జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలు రాష్ట్ర రాజకీయాల్లో కొత్త జోష్ తీసుకురావడమే కాకుండా బహుళ పార్టీల బలం, ప్రజల వైఖరిని సూచించేలా మారాయి. బీజేపీకి పట్టభద్రుల, టీచర్ల కోటాలో వచ్చిన విజయాలు ఆ పార్టీకి నూతనుత్తేజం ఇచ్చాయి. అదే విధంగా కాంగ్రెస్కు ఎమ్మెల్యే కోటా గెలుపు ఒక మైలురాయిగా నిలిచింది.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.








