Sarkar Live

Operation Kagar : ద‌ద్ద‌రిల్లుతున్న దండకారణ్యం

Operation Kagar : తెలంగాణ -ఛత్తీస్‌గఢ్ (Telangana, Chhattisgarh) రాష్ట్రాల సరిహద్దుల్లో విస్తరించి ఉన్న దట్టమైన దండకారణ్యం ప్రస్తుతం భీకరమైన పోరాట క్షేత్రంగా మారింది. వేల సంఖ్యలో భద్రతా దళాలు కర్రెగుట్టల చుట్టూ బలమైన వలయాన్ని ఏర్పాటు చేశాయి. ఈ భారీ

Chhattisgarh

Operation Kagar : తెలంగాణ -ఛత్తీస్‌గఢ్ (Telangana, Chhattisgarh) రాష్ట్రాల సరిహద్దుల్లో విస్తరించి ఉన్న దట్టమైన దండకారణ్యం ప్రస్తుతం భీకరమైన పోరాట క్షేత్రంగా మారింది. వేల సంఖ్యలో భద్రతా దళాలు కర్రెగుట్టల చుట్టూ బలమైన వలయాన్ని ఏర్పాటు చేశాయి. ఈ భారీ స్థాయి ఆపరేషన్‌లో భారత వాయుసేన కూడా తనవంతు సహాయం అందిస్తోంది. ‘కగార్’ (Operation Kagar) అనే పేరుతో కొనసాగుతున్న ఈ సైనిక చర్య ఇప్పుడు తుది దశకు చేరుకుంటున్నట్లు తెలుస్తోంది.

Operation Kagar : ముగింపు దశకు చేరుకుంటుందా?

సెర్చింగ్ ఆపరేషన్‌ను తక్షణమే నిలిపివేయాలని మావోయిస్టు పార్టీకి చెందిన ముఖ్య నాయకులు ఇటీవల భారత ప్రభుత్వానికి ఒక విజ్ఞప్తి చేస్తూ లేఖ రాశారు. అయితే.. కేంద్ర ప్రభుత్వం వారి అభ్యర్థనను పూర్తిగా తిరస్కరించింద‌ని తెలిసింది. ఈ నేప‌థ్యంలోనే గురువారం ఉదయం మావోయిస్టులకు, భద్రతా దళాలకు మధ్య తీవ్రమైన ఎదురు కాల్పులు చోటు చేసుకున్నాయని తెలుస్తోంది. కేంద్ర ప్రభుత్వం 2026 మార్చి 31 నాటికి మావోయిస్టుల ఉనికిని పూర్తిగా తుడిచిపెట్టాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ లక్ష్య సాధనలో భాగంగానే దండకారణ్యంలో ‘కగార్’ ఆపరేషన్ (Operation Kagar) పేరుతో తుది పోరాటం కొనసాగుతోంది.

పది వేల మంది జవాన్లతో కూంబింగ్

కొద్ది రోజుల క్రితం మావోయిస్టు (Maoist) పార్టీ ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం నుంచి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఒక ప్రత్యేక లేఖను పంపింది. ‘కగార్’ ఆపరేషన్ (Operation Kagar)ను వెంటనే నిలిపివేయాలని, భద్రతా దళాలను వారి నిర్దేశిత క్యాంపులకే పరిమితం చేయాలని, తాత్కాలికంగా ఒక నెల రోజుల పాటు సెర్చింగ్ ఆపరేషన్‌ను పూర్తిగా నిలిపివేయాలని స్పష్టంగా కోరారు. అయినప్పటికీ కేంద్ర ప్రభుత్వం వారి విజ్ఞప్తిని ఏ మాత్రం పట్టించుకోలేదు. దీనికి విరుద్ధంగా, కొద్ది రోజుల క్రితం జార్ఖండ్ రాష్ట్రంలోని బొకారో జిల్లాలో జరిగిన ఒక ఎదురుకాల్పుల ఘటనలో కేంద్ర కమిటీకి చెందిన ముఖ్య సభ్యుడు వివేక్‌తో పాటు మరో ఎనిమిది మంది మావోయిస్టులు మరణించారు. ఈ సంఘటన జరిగిన వెంటనే, కేంద్ర ప్రభుత్వం మరింత అప్రమత్తమైంది. తెలంగాణ -ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల సరిహద్దుల్లో అత్యున్నత స్థాయి భద్రతా హెచ్చరిక (రెడ్ అలర్ట్) ప్రకటించింది. మావోయిస్టులకు సురక్షితమైన స్థావరంగా మారిన కర్రెగుట్టల ప్రాంతంలో వేలాది మంది భద్రతా దళాలను మోహరించింది. సుమారు పది వేల మందికి పైగా శిక్షణ పొందిన జవాన్లు ఈ ఆపరేషన్‌లో పాల్గొంటున్నట్లు తెలుస్తోంది. సీఆర్పీఎఫ్, కోబ్రా, స్పెషల్ టాస్క్ ఫోర్స్, డీఆర్‌జీ, బస్తర్ ఫైటర్స్ వంటి ప్రత్యేక దళాలు కర్రెగుట్టల ప్రతి అంగుళాన్ని క్షుణ్ణంగా జల్లెడ పడుతున్నాయి.

వాయుసేన వ్యూహాత్మక సహకారం

ఈ ఆపరేషన్ ప్రాముఖ్యతను గుర్తించిన భారత వాయుసేన కూడా తనవంతు సహకారాన్ని అందిస్తోంది. తెలంగాణ -ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాలను కలుపుతూ ఉన్న దట్టమైన అటవీ ప్రాంతం, ఎత్తైన కొండలతో విస్తరించి ఉన్న సుమారు 53 కిలోమీటర్ల మేర కర్రెగుట్టలు మావోయిస్టులకు ఒక బలమైన స్థావరంగా మారాయి. మావోయిస్టు పార్టీకి చెందిన అత్యంత ముఖ్యమైన నాయకులు, వారి నమ్మకమైన అనుచరులందరూ ఈ ప్రాంతాన్నే తమ ప్రధాన కార్యకలాపాల కేంద్రంగా చేసుకుని తలదాచుకుంటున్నారని పోలీసు వర్గాలకు ఖచ్చితమైన సమాచారం అందింది.

అగ్ర నాయకులే ప్రధాన లక్ష్యం

చాలా కాలంగా సరైన సమయం కోసం ఎదురుచూస్తున్న కేంద్ర ప్రభుత్వం, మావోయిస్టు పార్టీకి చెందిన కీలక నాయకులందరూ (Maoist leaders) ఈ ప్రాంతంలోనే ఉన్నారనే విశ్వసనీయ సమాచారం అందడంతో వెంటనే స్పందించింది. భారీ సంఖ్యలో భద్రతా బలగాలను ఆ ప్రాంతానికి తరలించి విస్తృతమైన సెర్చింగ్ ఆపరేషన్‌ను ప్రారంభించింది. బడే చొక్కా రావు అలియాస్ దామోదర్, మాస్టర్ మైండ్ హిడ్మా పాటు మరికొంతమంది ముఖ్య నాయకులు ఈ ప్రాంతంలోనే ఉన్నారని పోలీసులు గట్టిగా నమ్ముతున్నారు. దీంతో కర్రెగుట్టలకు ఉన్న అన్ని రహదారులను ఒకేసారి చుట్టుముట్టారు. మావోయిస్టులు ఏ మాత్రం తప్పించుకునే అవకాశం లేకుండా వాయుసేన సహాయంతో ఈ ఆపరేషన్‌ను మరింత వేగవంతం చేశారు.

సరిహద్దుల్లో భీకర ఎదురు కాల్పులు

మావోయిస్టు పార్టీకి చెందిన అగ్ర నాయకులే లక్ష్యంగా గత మూడు రోజులుగా తెలంగాణ-ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లో విస్తృతంగా కూంబింగ్ నిర్వహిస్తున్న భద్రతా దళాలు ఈ ఆపరేషన్‌లో (Telangana Maoist search operation) పైచేయి సాధించినట్లు తెలుస్తోంది. గురువారం ఉదయం మావోయిస్టులకు, భద్రతా దళాలకు మధ్య భీకరమైన ఎదురు కాల్పులు జరిగాయని విశ్వసనీయ సమాచారం. ఇందులో సుమారు ఐదుగురు మావోయిస్టులు మరణించారని పోలీసులు భావిస్తున్నారు. అయితే, కర్రెగుట్టల చుట్టూ భద్రతా బలగాలు పెద్ద సంఖ్యలో మోహరించి ఉండటంతో అక్కడ కొంత గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ఈ ఎదురు కాల్పుల్లో మావోయిస్టులు నిజంగా మరణించారా లేదా అనే విషయాన్ని అధికారికంగా ధ్రువీకరించాల్సి ఉంది.


తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం  సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి.  అలాగే మా  ఫేస్ బుక్,వాట్సప్ చానల్ఎక్స్(ట్విట్టర్)  ను  ఫాలో అవండి.  మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

More Posts

error: Content is protected !!