హైదరాబాద్లో పంచాయతీరాజ్ ఇంజినీర్ ఇన్ చీఫ్ కనకరత్నం ఏసీబీ (ACB ) వలకు చిక్కారు. డీఈని బదిలీ చేసేందుకు కనకరత్నం రూ. 50వేలు డిమాండ్ చేశారు. సరిగ్గా ఆ లంచం డబ్బులు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పక్కా ప్లాన్ తో ఆయనను రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఈ క్రమంలోనే ఎర్రమంజిల్లోని పంచాయతీరాజ్ కార్యాలయంలో ఏసీబీ సోదాలు నిర్వహిస్తోంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ACB కి ఇలా ఫిర్యాదు చేయవచ్చు..
వరైనా ప్రభుత్వ అధికారి లేదా సిబ్బంది లంచం అడిగితే ప్రజలు తెలంగాణ #అవినీతినిరోధకశాఖ వారి “టోల్ ఫ్రీ నెంబర్ 1064 కు డయల్ చేయాలని ఏసీబీ అధికారులు కోరారు. అంతే కాకుండా వివిధ సామజిక మధ్యమాలయిన “వాట్సాప్ ( 9440446106) ఫేస్ బుక్ (Telangana ACB), ఎక్స్ (@TelanganaACB) మరియు వెబ్ సైట్ ( https://acb.telangana.gov.in ) ద్వారా కూడా సంప్రదించవచ్చని తెలిపారు.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.