Sarkar Live

Parliament Winter Session | బీజేపీ వ‌ర్సెస్ కాంగ్రెస్‌.. పార్ల‌మెంట్‌లో మాటల మంటలు..

Parliament Winter Session : పార్ల‌మెంట్ శీతాకాల సమావేశంలో ఉభ‌య స‌భ‌లు వాడీవేడిగా సాగుతున్నాయి. రాజ్యసభలో విపక్షాలు ఉపరాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్ఖర్‌పై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టిన నేపథ్యంలో రాజ్యసభ రెండు రోజుల రాజ్యాంగ చర్చను నిర్వహిస్తోంది. భారత రాజ్యాంగం

Parliament Winter Session

Parliament Winter Session : పార్ల‌మెంట్ శీతాకాల సమావేశంలో ఉభ‌య స‌భ‌లు వాడీవేడిగా సాగుతున్నాయి. రాజ్యసభలో విపక్షాలు ఉపరాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్ఖర్‌పై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టిన నేపథ్యంలో రాజ్యసభ రెండు రోజుల రాజ్యాంగ చర్చను నిర్వహిస్తోంది. భారత రాజ్యాంగం ఆమోదానికి 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా జరిగిన ఈ చర్చకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నాయకత్వం వహిస్తున్నారు.

పార్లమెంట్లో వాడీవేడి చ‌ర్చ‌

శుక్రవారం, శనివారం రెండు రోజుల‌పాటు లోక్‌సభ (Lok sabha)లో రాజ్యాంగంపై చర్చ జరిగింది. సోమ‌వారం కూడా వాడివేడిగా సాగింది. లోక్‌సభలో కాంగ్రెస్ ఎంపీ ప్రియాంకా గాంధీ త‌న‌ ప్రసంగంలో రాజ్యాంగాన్ని రక్షణ కవచంగా అభివ‌ర్ణించారు. రాజ్యాంగంపై వీర్ సావర్కర్ విమర్శలను ఉదహరిస్తూ రాహుల్ గాంధీ (Rahul Gandhi) మాట్లాడారు. దీనిపై ప్రధాని నరేంద్ర మోదీ ప్ర‌తిస్పందిస్తూ నెహ్రూ-గాంధీ కుటుంబంపై తీవ్ర విమర్శలు చేశారు. వారు రాజ్యాంగ్యాన్ని దెబ్బతీయడంలో ఎన్న‌టికీ వెనుకాడ‌లేద‌ని విమ‌ర్శించారు. దీనిపై విపక్ష నేత మల్లికార్జున ఖర్గే మాట్లాడుతూ ప్ర‌ముఖ దివంగ‌త‌ కవి అహ్మద్ ఫరాజ్ కవితను ఆల‌పించారు. మ‌త్ ఖ‌తల్ కరో ఆవాజో కా (గ‌ళాల‌ను హతమార్చకండి) అనే పంక్తిని చ‌దివారు. రాజ్యసభలో తన ప్రసంగంలో ఖర్గే మాట్లాడుతూ బీజేపీ ఉద్దేశాలను త‌ప్పుబ‌ట్టారు. ఆ పార్టీ రాజ్యాంగానికి అనుకూలమా? అనే సందేహాన్ని వ్యక్తం చేశారు. మౌలిక సమస్యలను పరిష్కరించడంలో బీజేపీ ఆసక్తి చూపడం లేదని విమర్శించారు.

మ‌హిళా వ్య‌తిరేకి కాంగ్రెస్ : నిర్మ‌లా సీతారామ‌న్

ఇదే స‌భ‌లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ (Nirmala Seetharaman) మాట్లాడుతూ కాంగ్రెస్ మహిళా వ్యతిరేకి అని విమ‌ర్శించారు. మహిళా రిజర్వేషన్ బిల్లును ఆమోదించకుండా అడ్డుకుంటోంద‌ని మండిప‌డ్డారు. తాను అబ‌ద్ధాలాడ‌తాన‌ని కాంగ్రెస్ ఎంపీ జైరాం రమేష్ ఆరోపించడంపై నిర్మ‌ల ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. దీనిపై జ‌య‌రాం ర‌మేష్ క్ష‌మాప‌ణ చెప్పాల‌ని డిమాండ్ చేశారు. నన్ను అబద్ధం చెప్పారనడం కాంగ్రెస్ రక్తంలోనే ఉంది అని ఆమె విమర్శించారు.  కాంగ్రెస్ చేసిన రాజ్యాంగ ప్రస్తావిక మార్పులు చట్టబద్ధమైనవి కావని నిర్మలా సీతారామ‌న్ విమ‌ర్శించారు.

మ‌ల్లికార్జున ఖ‌రే హాట్ కామెంట్స్‌

రాజ్య‌స‌భ‌లో విప‌క్ష నేత మ‌ల్లికార్జున ఖ‌ర్గే (MalliKharjuna Kharge), నిర్మ‌లా సీతారామ‌న్ మ‌ధ్య తీవ్ర వాగ్యుద్ధం జ‌రిగింది. రాజ్యాంగంపై కాంగ్రెస్‌కు ఉన్న చిత్త‌శుద్ధిని ఆమె ప్ర‌శ్నించారు. గ‌తంలో అధికారంలో ఉన్న‌ప్పుడు రాజ్యాంగాన్ని ఏ విధంగా అవ‌మాన ప‌ర్చిందో కాంగ్రెస్ ఆత్మ విమ‌ర్శ చేసుకోవాల‌ని హితవు ప‌లికారు. దీనిపై ఖ‌ర్గే ప్ర‌తిస్పందిస్తూ రాజ్యాంగ స్ఫూర్తికి భంగం క‌లిగించే వారు కూడా త‌మ‌కు దాని గురించి బోధించ‌డం విడ్డూర‌మ‌ని వ్యాఖ్యానించారు. బీజేపీ ప్ర‌భుత్వం విద్వేషాల గురించే త‌ప్ప మ‌రేం మాట్లాడ‌ద‌ని విమ‌ర్శించారు.


తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం  సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి.  అలాగే మా  ఫేస్ బుక్, వాట్సప్ చానల్ఎక్స్(ట్విట్టర్)  ను  ఫాలో అవండి.  మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..

1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

More Posts

Web Stories

error: Content is protected !!
Rajma | ఇలాంటి సమస్యలున్నవారు రాజ్మా తినడం ప్రమాదమే! Nirgundi | వావిలి మొక్కలు దివ్యమైన ఔషధ గుణాలు.. Tulsi Leaves : ఉదయాన్నే తులసి ఆకులు తింటే ఏమవుతుంది?