Sarkar Live

Poisonous Conspiracy | స్కూల్ పిల్ల‌లపై విష ప్ర‌యోగం..

Poisonous Conspiracy : ఆదిలాబాద్ జిల్లా (Adilabad district) ఇచ్చోడ మండలం ధరంపూరి (Dharampuri) గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల (government primary school)లో దారుణం చోటుచేసుకుంది. చిన్నారుల ప్రాణాలు తీసుకొనే కుట్ర (Poisonous Conspiracy) జ‌రిగింది. దాదాపు 30 మంది

Poisonous Conspiracy

Poisonous Conspiracy : ఆదిలాబాద్ జిల్లా (Adilabad district) ఇచ్చోడ మండలం ధరంపూరి (Dharampuri) గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల (government primary school)లో దారుణం చోటుచేసుకుంది. చిన్నారుల ప్రాణాలు తీసుకొనే కుట్ర (Poisonous Conspiracy) జ‌రిగింది. దాదాపు 30 మంది విద్యార్థుల (Thirty children) ప్రాణాలు తీసేలా పథకం రచించిన కొందరు దుర్మార్గులు పాఠశాల నీటి ట్యాంకు (drinking water tank)లో పురుగుల మందు (pesticide) కలిపారు. అంతే కాకుండా.. మధ్యాహ్న భోజనం వండే పాత్రలపైనా ఆ విషపదార్థాన్ని చల్లి పెట్టారు. విద్యార్థులకు ఏమీ తెలియకుండా వారి భోజనంలోనే విషం ఇచ్చే ప్రయత్నం చేసిన ఈ కుట్ర పాఠశాల సిబ్బంది అప్రమత్తత వల్ల భ‌గ్న‌మైంది. వంట పాత్రలను శుభ్రం చేస్తుండగా నీళ్లలో నుంచి వాసన రావడం, నురగలు రావడం గమనించి వెంటనే పైఅధికారులకు సమాచారం అందించారు.

సెల‌వుల్లో దారుణం

శని, ఆది, సోమవారాల్లో వరుసగా మూడు రోజుల పాటు పాఠశాలకు సెలవులు రావడంతో పాఠశాల మొత్తం తాళం వేసి ఉంచారు. ఆ సమయంలోనే కొందరు దొండ‌గులు స్కూల్ ఆవరణలోకి చొరబడి ఈ ఘోరమైన కుట్రను అమలు చేశారు. వారు నీటి ట్యాంక్ (drinking water tank)లోనే కాకుండా వంటగదిలో ఉండే పాత్రల్లోనూ విష పదార్థాలను చల్లి పెట్టడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. సెలవుల తర్వాత మంగళవారం స్కూల్ తిరిగి ప్రారంభమయ్యే రోజున మధ్యాహ్న భోజన తయారీకి వంట మ‌నుషులు పాత్రలు కడుగుతుండగా వాటిలోనుంచి వచ్చిన నురగలు, దుర్వాసన వల్ల అనుమానం వ‌చ్చింది. ఇది సాధారణమేమీ కాదని అర్థం చేసుకున్నారు. వెంటనే స్కూల్ టీచర్లకు ఈ విషయాన్ని తెలియజేయడంతో వారు వెంటనే స్పందించి పాఠశాల ఆవరణను తిలకించారు.

Poisonous Conspiracy : నీళ్ల‌ల్లో పురుగుల మందు

తర్వాత‌ స్కూల్ నీటి ట్యాంకు (drinking water tank)ను పరిశీలించగా అందులోనూ పురుగుల మందు (pesticide) కలిపినట్లు స్పష్టంగా గుర్తించారు. వెంట‌నే విద్యార్థులు ఆ నీరు తాగకుండా, మధ్యాహ్న భోజనం తినకుండా చర్యలు తీసుకున్నారు. పోలీసులకు సమాచారం అందించడంతో వారు ఘటనా స్థలానికి చేరుకుని పురుగుల మందు ఉన్న డబ్బాలను స్వాధీనం చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటన తెలియగానే విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనకు లోనయ్యారు. తమ పిల్లలు ఆ నీళ్లు తాగి ఉంటే, భోజనం చేసి ఉంటే ఏం జరిగేదో ఊహించలేమ‌ని వాపోయారు. తాము పిల్లలను స్కూల్‌కు చదువు చెప్పించాలనే పంపితే, అక్కడే ప్రాణాలకు ముప్పు రావడం దారుణమని విచారం వ్యక్తం చేశారు.

గ్రామ‌స్థుల ఆందోళ‌న‌

విషయాన్ని (Poisonous Conspiracy) తెలుసుకున్న గ్రామస్థులు స్కూల్ వద్దకు చేరుకుని ఆందోళనకు దిగారు. అమాయక చిన్నారులపై ఇంత దారుణంగా కుట్ర చేయడం వెనక ఎవరు ఉన్నారు? వారి ఉద్దేశం ఏమిటి? ఎందుకు ఇలా చేశారు? అనే ప్రశ్నలు స్థానికంగా కలకలం రేపుతున్నాయి. దీనిపై వెంటనే చర్యలు తీసుకోవాలని, బాధ్యుల్ని పట్టుకుని కఠినంగా శిక్షించాలని గ్రామస్థులు డిమాండ్ చేస్తున్నారు. ఇది చిన్నారులపై చేయబడిన హత్యాయత్నంగా చూడాలని, ప్రభుత్వం తక్షణంగా స్పందించి వారి భద్రతకు తగిన ఏర్పాట్లు చేయాలని వారు కోరుతున్నారు.

పిల్ల‌ల‌కు భ‌ద్ర‌త క‌ల్పించాల‌ని డిమాండ్

ఈ ఘటన క‌ల‌క‌లం రేపింది. పాఠశాలలు పిల్లల భవిష్యత్తుకు మార్గదర్శకాలు కావాలి కానీ, ప్రాణాలపై ప్రమాదంగా మారకూడద‌ని అనే అభిప్రాయాలు వ్య‌క్త‌మవుతున్నాయి. ఇలాంటి దారుణ ఘటనలు పునరావృతం కాకుండా పాఠశాలల్లో భద్రతను మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంద‌ని ప‌లువురు డిమాండ్ చేస్తున్నారు. ముఖ్యంగా రాత్రివేళ పాఠశాలల భద్రత కోసం నైట్ వాచ్‌మ‌న్ లేదా సీసీటీవీలు ఏర్పాటు చేయడం తప్పనిసరి అంటున్నారు.


తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం  సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి.  అలాగే మా  ఫేస్ బుక్,వాట్సప్ చానల్ఎక్స్(ట్విట్టర్)  ను  ఫాలో అవండి.  మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

More Posts

error: Content is protected !!