The RajaSaab Teaser 2025 | రెబల్ స్టార్ ప్రభాస్ (Rebal Star prabhas), మారుతి(Maruthi) కాంబోలో వస్తున్న తెరకెక్కుతున్న మూవీ రాజాసాబ్(RajaSaab). చాలా రోజుల నుండి రెబల్ స్టార్ ఫ్యాన్స్ ఈ మూవీ నుండి ఓ అప్డేట్ కోసం ఎదురు చూస్తున్నారు. అప్పుడెప్పుడో టైటిల్ , ప్రభాస్ లుక్ ను రివిల్ చేస్తూ ఫ్యాన్స్ కి అప్డేట్ ఇచ్చింది మూవీ టీం. అప్పటినుండి మళ్లీ ఈ మూవీ నుండి ఏ అప్డేట్ రాలేదు.
ఫాన్స్ కాస్త నిరాశగా ఉన్న టైమ్ లో వారిలో జోష్ నింపేలా అదిరిపోయే టీజర్ ని రిలీజ్ చేసింది. టీజర్ చూసిన ఫ్యాన్స్ వింటేజ్ ప్రభాస్ ఈజ్ బ్యాక్ అని సంబరపడిపోతున్నారు. హై ఎక్స్పెక్టేషన్స్ తో తెరకెక్కుతున్న మూవీ టీజర్ ను ఓ రేంజ్ లో కట్ చేయడంతో మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. చాలా సంవత్సరాల తర్వాత స్టైలిష్ డార్లింగ్ ను చూపెట్టడంలో మారుతి సక్సెస్ అయ్యాడని చెప్పొచ్చు.
వింటేజ్ లుక్ లో ప్రభాస్…
మిర్చి మూవీ తర్వాత ప్రభాస్ ఇంత స్టైలిష్ లుక్ లో, కామెడీ పండిస్తూ సరదా క్యారెక్టర్ లో కనిపించలేదు. డార్లింగ్ ప్రభాస్ ని మిస్సవుతున్న ఫాన్స్ కి ఈ టీజర్ (RajaSaab ) ఫుల్ మీల్స్ అని చెప్పొచ్చు. ప్రభాస్ ని ఇలా చూపించిన మారుతీపై ప్రశంసలు కురిపిస్తున్నారు. టీజర్ చూస్తే ఈ మూవీ హర్రర్ కామెడీ థ్రిల్లర్ గా రాబోతున్నట్టు, ఒక పాత మహల్ లో జరిగే స్టోరీగా అర్థమవుతుంది.
వీఎఫ్ ఎక్స్ వర్క్ బాగుంది. ఇంతకుముందు రిలీజ్ చేసిన వీడియో లో దానిపైనే విమర్శలు వచ్చినా దానిపై మూవీ టీం వర్క్ చేసి గ్రాండ్ గా చూపెట్టారు. హర్రర్ కామెడీ థ్రిల్లర్ ను ఫస్ట్ టైమ్ చేస్తున్న ప్రభాస్ కడుపుబ్బ నవ్వించబోతున్నాడు. లాస్ట్ లో ప్రభాస్ చెప్పిన డైలాగ్ మూవీపై హొప్స్ ని పెంచేసింది. ఆ ఒక్క డైలాగ్ చాలు మూవీ ఎంత ఎంటర్టైనర్ గా ఉండబోతుందో తెలువడానికి అని ఫ్యాన్స్ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.
RajaSaab | డిసెంబర్ 5న గ్రాండ్ రిలీజ్…
మారుతి తన కెరీర్ మొదట్లో తీసిన ప్రేమ కథా చిత్రం మూవీ అప్పట్లో ఎంత సెన్సేషన్ క్రియేట్ చేసిందో మనకు తెలుసు. హర్రర్ మూవీని కామెడీ ఎంటర్టైనర్ గా చేసి బిగ్గెస్ట్ హిట్టు కొట్టాడు. ఇప్పుడు రాజసాబ్ మూవీ ని కూడా హర్రర్ కామెడీ జానర్ లో తీస్తున్నాడు. ఇది కూడా సెన్సేషన్ క్రియేట్ చేస్తుందని నమ్మకంతో ఉన్నారు. ఓవరాల్ గా టీజర్ లో మాత్రం మారుతి మార్క్ స్పష్టంగా కనబడుతుంది. తమన్ (thaman)తన బిజీఎం తో అదరగొట్టాడు.దాదాపు 250 కోట్ల భారీ బడ్జెట్ తో పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ (peoples Media factory) బ్యానర్ పై టీజీ విశ్వ ప్రసాద్ తెరకెక్కిస్తున్న ఈ మూవీలో సంజయ్ దత్ (Sanjay dath)ఇంపార్టెంట్ క్యారెక్టర్ లో, నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్దీ కుమార్, హీరోయిన్ లుగా యాక్ట్ చేస్తున్నారు.కాగా మూవీ డిసెంబర్ 5న (December 5th) వరల్డ్ వైడ్ గా గ్రాండ్ గా రిలీజ్ అవుతోంది.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.