Sarkar Live

Privacy Policy

Kazipet | కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీపై స్పష్టత: 2026లో ఉత్పత్తి ప్రారంభం
warangal, State

Kazipet | కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీపై స్పష్టత: 2026లో ఉత్పత్తి ప్రారంభం

Kazipet Coach Factory News | కాజీపేట రైల్వే కోచ్‌ పరిశ్రమ వరంగల్‌ జిల్లా ప్రజల ఎన్నో ఏళ్ల కల అని ఆ కలను ప్రధాని నరేంద్ర మోదీ నెరవేర్చారని రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ అన్నారు. కాజీపేటలో రైల్వే కోచ్‌ ఫ్యాక్టరీ, రైల్వే మాన్యుఫ్యాక్చరింగ్‌ యూనిట్‌ పనులను కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డితో కలిసి శనివారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా కోచ్​ ఫ్యాక్టరీ పనుల గురించి అధికారులు కేంద్ర మంత్రులకు వివరించారు. అనంతరం అశ్వినీ వైష్ణవ్‌ మీడియాతో మాట్లాడుతూ.. కాజీపేటలో మెగా రైల్వే కోచ్‌ ఫ్యాక్టరీని కేంద్రం నిర్మిస్తోందని.. పనులు వేగంగా సాగుతున్నాయని తెలిపారు. 2026లో కాజీపేటలో రైల్వే కోచ్‌ల ఉత్పత్తి ప్రారంభం అవుతుందన్నారు. ఈ ఫ్యాక్టరీతో 3వేల మందికి పైగా ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి కలుగుతుందని తెలిపారు. కాజీపేట నుంచి త్వరలోనే 150 లోకో మోటివ్‌లు కూడా ఎగుమతి అవుతాయని చెప్పారు. భవిష్యత్తులో కాజీపేట కోచ్...
Congress | సీఎం రేవంత్ “ప‌దేళ్ల ప‌ద‌వి” వ్యాఖ్య‌ల‌పై ప్ర‌కంప‌నలు
Hyderabad, State

Congress | సీఎం రేవంత్ “ప‌దేళ్ల ప‌ద‌వి” వ్యాఖ్య‌ల‌పై ప్ర‌కంప‌నలు

Hyderabad : : ముఖ్యమంత్రి ఎ రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) మరో ప‌దేళ్ల‌పాటు తానే సీఎంగా కొనసాగుతానని చేసిన ప్రకటన కాంగ్రెస్ పార్టీలో అంత‌ర్గ‌తంగా అల‌జ‌డి వ్య‌క్త‌మవుతోన్న‌ట్లు క‌నిపిస్తోంది. ఈ వ్యాఖ్య‌ల‌పై అనేక మంది ఎమ్మెల్యేలు బహిరంగంగా అభ్యంతరాలు వ్యక్తం చేశారు. Congress : సీఎం రేవంత్ ఏమన్నారు? శుక్రవారం కొల్లాపూర్ నియోజకవర్గంలో జరిగిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ, తాను 2034 వరకు పదవిలో ఉంటానని స్పష్టం చేశారు. 2034 వరకు ఈ పాలమూరు బిడ్డ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉంటాడ‌ని, పాలమూరు గడ్డ నుంచే ప్రభుత్వాన్ని నడిపిస్తాడని ఆయన స్పష్టం చేశారు. అయితే, ఆయన వ్యాఖ్యలు కాంగ్రెస్ శాసనసభ్యులకు మింగుడు పడలేదు, వారిలో కొందరు ఈ వ్యాఖ్యలు అనుచితమని విమర్శించారు.ముఖ్యమంత్రి వ్యాఖ్యలను మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి (Komatireddy Raj Gopal Reddy) విమ‌ర్శ‌లు గుప్పించారు. ఇటువ...
Adhar Cards | 1.17 కోట్ల ఆధార్ నంబర్లు బ్లాక్ ! UIDAI ఏం చెప్పింది?
Technology

Adhar Cards | 1.17 కోట్ల ఆధార్ నంబర్లు బ్లాక్ ! UIDAI ఏం చెప్పింది?

UIDAI | దేశంలో ఆధార్ కార్డు దుర్వినియోగాన్ని నిరోధించడానికి కేంద్రం కీల‌క అడుగు వేసింది. UIDAI (భారత ప్రత్యేక గుర్తింపు ప్రాధికార సంస్థ) ఇప్పటివరకు 1.17 కోట్ల ఆధార్ నంబర్లను బ్లాక్ చేసింది. ఈ ఆధార్ నంబర్లన్నీ మరణించిన వ్యక్తులకు చెందినవి. ఈ చర్య ఎందుకు తీసుకున్నారు..? చనిపోయిన వ్యక్తుల ఆధార్ కార్డులను దుర్వినియోగం చేసే అవకాశం ఉందని UIDAI చెబుతోంది. వాటి ద్వారా ఎలాంటి మోసం, స్కామ్ జరగవచ్చు. దీనిని నివారించడానికి, చనిపోయిన వ్యక్తుల ఆధార్ నంబర్లను డీయాక్టివేట్ చేసిన‌ట్లు తెలిపింది. ఈ విషయంలో అన్ని రాష్ట్రాలు , కేంద్రపాలిత ప్రాంతాలు చురుకైన పాత్ర పోషించాలని UIDAI కోరింది. ఇప్పుడు ప్రభుత్వం ఒక వ్యక్తి మరణించిన వెంటనే అతని ఆధార్ నంబర్‌ను రద్దు చేయాలని కోరుకుంటోంది. దీని కోసం, మరణ ధృవీకరణ పత్రం జారీ చేసేటప్పుడు దానిని ఆధార్‌తో లింక్ చేయడం తప్పనిసరి చేస్తున్నారు. దుర్వినియోగాన్ని ఎలా న...
ఐఫోన్ 17 సిరీస్ సెప్టెంబరులో విడుదల..? కొత్త డిజైన్, కెమెరా, iOS 26తో శక్తివంతమైన ప్రో మోడల్స్ ‌‌ – iPhone 17 series
Technology

ఐఫోన్ 17 సిరీస్ సెప్టెంబరులో విడుదల..? కొత్త డిజైన్, కెమెరా, iOS 26తో శక్తివంతమైన ప్రో మోడల్స్ ‌‌ – iPhone 17 series

ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఐఫోన్ 17 సిరీస్ (iPhone 17 series), సెప్టెంబర్ 2025లో ప్రపంచవ్యాప్తంగా లాంచ్ అవుతుందని భావిస్తున్నారు. ఐఫోన్ 17 ప్రోకు సంబంధించిన లీకైన ఒక ఇమేజ్​ ఆన్‌లైన్‌లో కనిపించింది. ఇది ప్రధానంగా డిజైన్ లో కొన్ని మార్పులను, శక్తివంతమైన కొత్త రంగు వేరియంట్‌లను వెల్లడిస్తోంది. రాబోయే లైనప్ భారీ ఉత్పత్తి త్వరలో ప్రారంభం కానుందని, కొత్త ప్రో మోడల్ డిస్​ప్లే , హార్డ్‌వేర్ రెండింటిలోనూ అప్‌గ్రేడ్ చేస్తారని భావిస్తున్నారు. ఈ సంవత్సరం ప్లస్ మోడల్ లేదు: దాని స్థానంలో ఐఫోన్ 17 ఎయిర్ రానుంది. ఆపిల్ ఈ సంవత్సరం 'ప్లస్' మోడల్‌ను దాటవేసే అవకాశం ఉంది. ఐఫోన్ 17, 17 ప్రో, 17 ప్రో మాక్స్‌లతో పాటు ఐఫోన్ 17 ఎయిర్ అనే కొత్త మోడల్‌ను పరిచయం చేయనుంది. X లో టిప్‌స్టర్ మాజిన్ బు షేర్ చేసిన లీక్‌లను పరిశీలిస్తే iPhone 17 Pro బ్లాక్​, డీప్​ బ్లూ, ఆరెంజ్​, సిల్వర్​ రంగులలో వస్తున్నట్లు తెలుస్తోంది...
Fish Venkat | టాలీవుడ్ లో విషాదం.. హాస్యనటుడు ఫిష్ వెంకట్ కన్నుమూత
Cinema

Fish Venkat | టాలీవుడ్ లో విషాదం.. హాస్యనటుడు ఫిష్ వెంకట్ కన్నుమూత

Fish Venkat : తెలుగు సినీ పరిశ్రమలో వ‌రుస‌గా విషాదాలు చోటుచేసుకుంటున్నాయి. ఇటీవ‌లే సీనియ‌ర్ న‌టులు కోట శ్రీనివాసరావు, నటి సరోజినీదేవి మృత్యువాత పడిన విష‌యం మ‌రిచిపోక‌ముందే సినీ పరిశ్రమలో మరో విషాదం నెలకొంది. సినీ నటుడు ఫిష్ వెంకట్ అనారోగ్యంతో కన్నుమూశారు. ఆయన తెలుగు సినిమాలలో విలన్ గ్యాంగ్‌లో ఎక్కువ కనిపించారు. సీరియస్‌గా కనిపిస్తూనే త‌న స్టైల్ లో తెలంగాణ యాస‌లో డైలాగ్స్ చెబుతూ.. న‌వ్వించ‌డం ఆయ‌న ప్రత్యేకత. కాగా ఫిష్ వెంకట్ వ‌య్సు 53 సంవత్సరాలు. గత కొంతకాలంగా ఆయన కిడ్నీ సంబంధిత సమస్యలతో ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతున్నాడు. కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్ చేయడం కోసం కుటుంబ సభ్యులు తీవ్రంగా కృషి చేశారు. ఆర్థికంగా ఇబ్బందులు పడుతూ ఉండడంతో సినీ పరిశ్రమలో కొంద‌రు ఆర్థిక సాయం అందించారు. ఈ క్రమంలోనే శుక్ర‌వారం రాత్రి చందానగర్‌లోని పీఆర్‌కే హాస్పిటల్‌లో ఆయన క‌న్నుమూశారు. ఫిష్ వెంకట్ తన ప్రత్యేకమైన తెలంగాణ...
error: Content is protected !!