Sarkar Live

Privacy Policy

మేడిగడ్డ పునరుద్ధరణే లక్ష్యం: క్షేత్రస్థాయిలో సీఎం రేవంత్ రెడ్డి పరిశీలన
warangal

మేడిగడ్డ పునరుద్ధరణే లక్ష్యం: క్షేత్రస్థాయిలో సీఎం రేవంత్ రెడ్డి పరిశీలన

​●కాళేశ్వరం ప్రాజెక్టు వైఫల్యాలపై సమగ్ర విచారణ.. NDSA మార్గదర్శకాలతోనే ముందుకు ​●లోతుగా పరిశీలన... సాంకేతిక పరీక్షల సమీక్ష కుంగిపోయిన మేడిగడ్డ బ్యారేజీకి పూర్వవైభవం తీసుకురావడమే ధ్యేయంగా ముఖ్యమంత్రి రేవంత్ క్షేత్రస్థాయిలో పర్యటించారు. కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలోని కీలకమైన మేడిగడ్డ బ్యారేజీని సోమవారం మంత్రులు, ఉన్నతాధికారుల బృందంతో కలిసి ఆయన సందర్శించారు. కుంగిన పిల్లర్ర్స్ (స్తంభాల) వద్ద జరుగుతున్న జియోఫిజికల్, జియోటెక్నికల్ పరీక్షలను స్వయంగా పరిశీలించి, పునరుద్ధరణ చర్యలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. ​లోతుగా పరిశీలన.. సాంకేతిక పరీక్షల సమీక్ష ​బ్యారేజీ వద్ద పిల్లర్స్ 20, 21, 22 లో బోర్ రిగ్స్ ద్వారా జరుగుతున్న శాంపిల్స్ సేకరణను ముఖ్యమంత్రి నిశితంగా గమనించారు. దాదాపు 520 బోర్ రిగ్స్ ద్వారా సేకరించిన నమూనాలను సెంట్రల్ వాటర్ అండ్ రీసెర్చ్ స్టేషన్ (CWPRS) కు పంపనున్నట్లు అధికారుల...
జగిత్యాల గడ్డపై నేడు ‘కేసీఆర్’ రణగర్జన! గులాబీమయమైన పట్టణం! ‌‌ – KCR Jagtial Sabha
State, Karimnagar

జగిత్యాల గడ్డపై నేడు ‘కేసీఆర్’ రణగర్జన! గులాబీమయమైన పట్టణం! ‌‌ – KCR Jagtial Sabha

KCR Jagtial Sabha | తెలంగాణ రాజకీయాల్లో మరో కీలక ఘట్టానికి జగిత్యాల వేదికవుతోంది. కాంగ్రెస్‌ దుష్టపాలనకు చరమగీతం పాడేందుకు, ప్రజా ఆశీర్వాద సభ పేరిట బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్ నేడు జగిత్యాల మినీ స్టేడియంలో సమరశంఖం పూరించబోతున్నారు. ఐదు దశాబ్దాల క్రితం రైతుకూలీల జైత్రయాత్రతో జంగ్ నడిపిన ఈ గడ్డపై, ఇప్పుడు మరో రాజకీయ యుద్ధానికి రంగం సిద్ధమైంది. సభా వేదికగా కేసీఆర్ చేసే ప్రసంగం కోసం రాష్ట్ర ప్రజానీకం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. జగిత్యాల ఖిల్లా: కలిసొచ్చిన సెంటిమెంట్ జగిత్యాల గడ్డకు మరియు కేసీఆర్‌కు విడదీయలేని అనుబంధం ఉంది. ఈ మినీ స్టేడియంలో సభ (KCR Jagtial Sabha) జరిగినప్పుడల్లా ఉద్యమంలో లేదా రాజకీయాల్లో సంచలనాత్మక మార్పులు వచ్చాయి. 2001: పార్టీ ఆవిర్భావం తర్వాత జరిగిన తొలి సభతో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ ప్రభంజనం సృష్టించింది. 2003: ధర్మపురి సింహగర్జనతో గోదావరి పుష్కరాలకు న...
పేకాట శిబిరంపై పోలీసుల దాడి: నలుగురి అరెస్ట్
warangal

పేకాట శిబిరంపై పోలీసుల దాడి: నలుగురి అరెస్ట్

గీసుకొండ మండల పరిధిలోని కొమ్మాల గ్రామ శివారులో నిర్వహిస్తున్న పేకాట శిబిరంపై ఆదివారం గీసుకొండ పోలీసులు మరియు వరంగల్ టాస్క్ ఫోర్స్ పోలీసులు సంయుక్తంగా మెరుపు దాడి చేశారు. ఈ దాడిలో నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకోగా, మరో ఇద్దరు పరారయ్యారు. ​ఘటన వివరాలు.. ​గీసుకొండ మండలం కొమ్మాల గ్రామ శివారులోని కడారి రాజుకు చెందిన వ్యవసాయ భూమిలో కొందరు వ్యక్తులు పేకాట ఆడుతున్నట్లు పోలీసులకు విశ్వసనీయ సమాచారం అందింది. దీనిపై స్పందించిన గీసుకొండ ఇన్‌స్పెక్టర్ విశ్వేశ్వర్ నేతృత్వంలో పోలీసులు, టాస్క్ ఫోర్స్ బృందంతో కలిసి దాడి నిర్వహించారు. ​పట్టుబడిన నిందితులు: ​కడారి రాజు (40), కొమ్మాల ​దునికే కొమురయ్య (41), విశ్వనాధపురం ​బసికే ప్రభాకర్ (57), కొమ్మాల ​లకావత్ గణేష్ (24), విద్యార్థి, విశ్వనాధపురం ​పరారీలో ఉన్నవారు: వాంకుడోత్ రాజు, పల్లె నరేష్‌లు పోలీసుల నుండి తప్పించుకున్నారు. ​స్వాధ...
తెలంగాణలో సెగలు పుట్టిస్తున్న ఎండలు: మే, జూన్ నెలల్లో నిప్పుల కొలిమే! ‌‌‌‌– Heatwave
Special Stories

తెలంగాణలో సెగలు పుట్టిస్తున్న ఎండలు: మే, జూన్ నెలల్లో నిప్పుల కొలిమే! ‌‌‌‌– Heatwave

Telangana Heatwave Alert | తెలంగాణలో రోజురోజుకీ ఉష్ణోగ్రతలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఏప్రిల్ మొదటి వారంలోనే భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తుండటంతో జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ప్రస్తుతం సాధారణం కంటే 3 డిగ్రీల వరకు అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతుండగా, మున్ముందు ఈ తీవ్రత మరింత పెరగనుందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమై, వడదెబ్బ బాధితుల కోసం ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఎల్ నినో ఎఫెక్ట్: ఎందుకీ తీవ్రత? పసిఫిక్ మహాసముద్రంలో ఉష్ణోగ్రతలు 0.5 నుంచి 1 డిగ్రీ వరకు పెరగడంతో 'ఎల్ నినో' పరిస్థితులు నెలకొన్నాయి. దీని ప్రభావం దక్షిణ భారతదేశంపై తీవ్రంగా ఉండనుందని వాతావరణ శాఖ వెల్లడించింది. రుతుపవనాలపై ప్రభావం: ఎల్ నినో కారణంగా నైరుతి రుతుపవనాలు బలహీనపడే అవకాశం ఉంది, దీనివల్ల వర్షపాతం తగ్గి వేసవి కాలం సుదీర్ఘంగా కొనసాగవచ్చు. ముంచుకొస్తున్న ముప్పు: రానున్న మే, జ...
ప్రైవేట్ పాఠశాలకు ‘రైతుబంధు’.. విద్యాసంస్థ భూమికి వ్యవసాయ పట్టా! – Rythu Bandhu Scam
Special Stories

ప్రైవేట్ పాఠశాలకు ‘రైతుబంధు’.. విద్యాసంస్థ భూమికి వ్యవసాయ పట్టా! – Rythu Bandhu Scam

​రెవెన్యూ అధికారుల అండతో ఖజానాకు గండి.. వరంగల్ జిల్లా ధర్మారంలో వెలుగుచూసిన వైనం ​Private School Rythu Bandhu Scam | విద్యాబుద్ధులు నేర్పాల్సిన విద్యాసంస్థ అధినేతలే అక్రమ మార్గంలో ప్రభుత్వ ఖజానాను కొల్లగొడుతున్నారు. రెవెన్యూ నిబంధనలను తుంగలో తొక్కి, అధికారుల అండదండలతో వ్యవసాయేతర భూమిని వ్యవసాయ భూమిగా రికార్డుల్లో చూపిస్తూ.. ఏకంగా 'రైతుబంధు', 'రుణమాఫీ' వంటి ప్రభుత్వ పథకాలను అక్రమంగా పొందుతున్నారు. వరంగల్ జిల్లా గీసుగొండ మండలం ధర్మారం రెవెన్యూ శివారులో వెలుగుచూసిన ఈ ఘటన స్థానికంగా సంచలనం రేపుతోంది. ​నాలా (NALA) భూమికి పట్టా ఎలా? ​నిబంధనల ప్రకారం.. విద్యాసంస్థలు లేదా ఇతర వాణిజ్య అవసరాలకు వినియోగించే భూమిని వ్యవసాయేతర భూమి (నాలా) కింద మార్చాల్సి ఉంటుంది. గీసుగొండ మండలం ధర్మారం శివారులో సదరు పాఠశాల యజమాని ఒక ఎడ్యుకేషనల్ సొసైటీ పేరుతో ఇప్పటికే నాలా అనుమతులు కలిగి ఉన్నారు. అయితే, ఇక...
error: Content is protected !!