మేడిగడ్డ పునరుద్ధరణే లక్ష్యం: క్షేత్రస్థాయిలో సీఎం రేవంత్ రెడ్డి పరిశీలన
●కాళేశ్వరం ప్రాజెక్టు వైఫల్యాలపై సమగ్ర విచారణ.. NDSA మార్గదర్శకాలతోనే ముందుకు
●లోతుగా పరిశీలన... సాంకేతిక పరీక్షల సమీక్ష
కుంగిపోయిన మేడిగడ్డ బ్యారేజీకి పూర్వవైభవం తీసుకురావడమే ధ్యేయంగా ముఖ్యమంత్రి రేవంత్ క్షేత్రస్థాయిలో పర్యటించారు. కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలోని కీలకమైన మేడిగడ్డ బ్యారేజీని సోమవారం మంత్రులు, ఉన్నతాధికారుల బృందంతో కలిసి ఆయన సందర్శించారు. కుంగిన పిల్లర్ర్స్ (స్తంభాల) వద్ద జరుగుతున్న జియోఫిజికల్, జియోటెక్నికల్ పరీక్షలను స్వయంగా పరిశీలించి, పునరుద్ధరణ చర్యలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు.
లోతుగా పరిశీలన.. సాంకేతిక పరీక్షల సమీక్ష
బ్యారేజీ వద్ద పిల్లర్స్ 20, 21, 22 లో బోర్ రిగ్స్ ద్వారా జరుగుతున్న శాంపిల్స్ సేకరణను ముఖ్యమంత్రి నిశితంగా గమనించారు. దాదాపు 520 బోర్ రిగ్స్ ద్వారా సేకరించిన నమూనాలను సెంట్రల్ వాటర్ అండ్ రీసెర్చ్ స్టేషన్ (CWPRS) కు పంపనున్నట్లు అధికారుల...




