Sarkar Live

Privacy Policy

పసుపుబోర్డు ప్రారంభం..  రైతులకు గుడ్ న్యూస్ చెప్పిన అమిత్‌ షా  Turmeric Board
Nizamabad

పసుపుబోర్డు ప్రారంభం.. రైతులకు గుడ్ న్యూస్ చెప్పిన అమిత్‌ షా Turmeric Board

National Turmeric Board Nizamabad | నిజామాబాద్‌ జిల్లా వాసుల నాలుగు దశాబ్దాల కల నేటితో నెరవేరింది. కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌ షా (Amit Shah) ఆదివారం నిజామాబాద్‌లో పసుపు బోర్డు (Turmeric Board ) జాతీయ కార్యాలయాన్ని అధికారికంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన కిసాన్ సమ్మేళన్ సభలో అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ రైతులకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారని తెలిపారు. " జాతీయ పసుపు బోర్డు ద్వారా తెలంగాణ రాష్ట్ర రైతులకు పెద్ద బహుమతిని ప్రధాని మోదీ అందించారని తెలిపారు. టెర్మరిక్ బోర్డు ద్వారా ప్యాకింగ్, బ్రాండింగ్, మార్కెటింగ్, ఎగుమతులకు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారని, నిజామాబాద్‌ పసుపుకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు లభిస్తుందని అమిత్‌ షా స్పష్టం చేశారు. పురాతన కాలం నుంచి భారత జీవనవిధానంలో పసుపు భాగమైందని, ఇది యాంటీ సెప్టిక్‌, యాంటీవైరల్‌ గుణాలు కలిగి ఉందని అమిత్ షా గుర్తుచ...
Odisha Stampede : పూరీ జ‌గ‌న్నాథ‌యాత్ర‌లో తొక్కిసలాట, ముగ్గురు మృతి
Crime, National

Odisha Stampede : పూరీ జ‌గ‌న్నాథ‌యాత్ర‌లో తొక్కిసలాట, ముగ్గురు మృతి

Odisha Stampede : ఒడిశాలోని చారిత్రాత్మక నగరం పూరీలో జగన్నాథ స్వామి రథయాత్ర సందర్భంగా దురదృష్టకర ఘటన చోటుచేసుకుంది. ఆదివారం తెల్లవారుజామున గుండిచా ఆలయం వద్ద భక్తులు పెద్దఎత్తున గుమిగూడడంతో జరిగిన తొక్కిసలాటలో ముగ్గురు భక్తులు ప్రాణాలు కోల్పోగా, 50 మందికి పైగా గాయపడ్డారు. ఒడిశాలోని పూరిలో రథయాత్ర సందర్భంగా గుండిచా ఆలయం సమీపంలో జరిగిన తొక్కిసలాట (Puri Stampede ) కారణంగా పెద్ద ప్రమాదం సంభవించింది. ఈ తొక్కిసలాటలో ముగ్గురు మరణించగా, 50 మందికి పైగా గాయపడ్డారు. ఒడిశాలోని పూరిలో జరిగిన రథయాత్రలో ఈ ప్రమాదం ఆదివారం ఉదయం తెల్లవారుజామున 4 గంటలకు జరిగింది. పూరి జిల్లా కలెక్టర్ సిద్ధార్థ్ ఎస్ స్వైన్ మాట్లాడుతూ, తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో వందలాది మంది భక్తులు ఆలయం సమీపంలో గుమిగూడినప్పుడు ఈ సంఘటన జరిగిందని చెప్పారు. గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించామని, ఆరుగురి పరిస్థితి విషమంగా ఉం...
Hanumakonda | హనుమకొండలో అమానవీయ ఘటన: వివస్త్ర చేసి మహిళపై చిత్రహింసలు
Crime

Hanumakonda | హనుమకొండలో అమానవీయ ఘటన: వివస్త్ర చేసి మహిళపై చిత్రహింసలు

మహిళను వివస్త్రను చేసి చిత్రహింసలు హనుమకొండ జిల్లా తాటికాయ గ్రామంలో ఆలస్యంగా వెలుగు చూసిన ఘటన Hanumakonda | హనుమకొండ జిల్లాలో అత్యంత ఘోరమైన అమానవీయ ఘటన చోటుచేసుకుంది. ఓ మహిళను వివస్త్రను చేసి చిత్రవధ చేసిన ఘటన ఆల‌స్యంగా వెలుగులోకి వ‌చ్చింది. ధర్మసాగర్‌ ‌మండలం తాటికాయల(Thatikayala) గ్రామంలో ఈ ఘ‌ట‌న జరిగింది. వివాహేతర సంబంధం పెట్టుకుందనే అనుమానంతో ఓ మహిళను ఇనుప గ్రిల్స్ ‌కట్టి, వివస్త్రను చేసి జననాంగాలపై జీడి పోసి చిత్రహింస‌ల‌కు గురిచేశారు. తప్పు చేశాన‌ని క్షమించమ‌ని వేడుకున్నా వినకుండా దాడికి పాల్ప‌డ్డారు. కాగా ఈ ఘటనపై పోలీసులు సుమోటోగా కేసు నమోదు విచారణ చేపట్టారు. గ్రామానికి చెందిన యువతితో మునుగు మండలం బోలోలుపల్లికి చెందిన రాజుకు పదేళ్ల క్రితం వివాహమైంది. వీరికి ముగ్గురు సంతానం. అయితే ఇటీవల కాలంలో రాజు.. మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. 10 రోజుల క్రితం ఇద్దరూ కలిసి గ్...
ACB Raids | ఏసీబీ ఆకస్మిక దాడులతో అవినీతి అధికారుల గుండెల్లో హడల్..
Crime

ACB Raids | ఏసీబీ ఆకస్మిక దాడులతో అవినీతి అధికారుల గుండెల్లో హడల్..

ఏసీబీ దాడుల్లో ఒకే రోజు ముగ్గురు లంచావతారుల అరెస్టు.. పెద్దపల్లిలో రూ.5వేలు లంచం తీసుకుంటూ ప‌ట్టుబ‌డిన ముసిసిప‌ల్ ఉద్యోగులు ACB Raids in Telangana | అవినీతి నిరోధ‌క శాఖ‌ లంచగొండి అధికారుల భ‌ర‌తం ప‌డుతోంది.. ప్ర‌తీరోజు బాధితుల నుంచి వ‌చ్చిన ఫిర్యాదుల‌తో ఆక‌స్మిక దాడులు చేస్తూ అవినీతి అధికారులకు ముచ్చ‌మ‌ట‌లు ప‌ట్టిస్తున్నారు. తాజాగాఇంటి నంబర్‌ కోసం రూ. 5000 లంచం డిమాండ్‌ చేసి బాధితుడిని నుండి తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు ఇద్దరు మున్సిపల్ అధికారులను అదుపులోకి తీసుకున్నారు. ఏసీబీ డీఎస్పీ విజయ్ కుమార్ తెలిపిన వివ‌రాల ప్రకారం.. పెద్ద‌ప‌ల్లిలోని ద్వారకా నగర్ కు చెందిన ఎ.ప్రసాద్ అనే వ్యక్తి కొత్త‌గా నిర్మించుకున్న ఇంటి నెంబర్ కోసం మున్సిపల్ సిబ్బందిని ఆశ్రయించాడు. కాగా బాధితుడిని ఏడాది పాటు ఆర్‌ఐ వినోద్‌, బిల్‌ కలెక్టర్‌ నాంపల్లి విజయ్‌కుమార్‌ రూ.10వేల డబ్బులు లంచంగా ఇవ్వాలని డిమాండ్ చేస...
Warangal Politics | గాంధీభవన్‌ లో కొండా మురళి రివర్స్ కౌంటర్..
Special Stories

Warangal Politics | గాంధీభవన్‌ లో కొండా మురళి రివర్స్ కౌంటర్..

క్రమశిక్షణా కమిటీ ముందు భేటీ.. ఉమ్మడి వరంగల్ జిల్లా నేతలపై 15పేజీలతో నివేదిక అందజేత జిల్లా పార్టీ నేతలకు రివర్స్ కౌంటర్! వరంగల్ కాంగ్రెస్‌లో కలకలం Warangal Politics : కొండా మురళి (Konda Murali) వివాదాస్పద వ్యాఖ్యల వ్యవహారంపై శనివారం గాంధీ భవన్‌ (Gandhi Bhavan) లో కాంగ్రెస్‌ క్రమశిక్షణా కమిటీ సమావేశమైంది. అయితే కమిటీ ఎదుట హాజరైన కొండా మురళి ఊహించ‌ని విధంగా ట్విస్ట్ ఇచ్చారు. ఆయ‌న చేసిన వ్యాఖ్య‌ల‌కు వివరణ ఇస్తారని.. పార్టీ ఆయనపై చర్యలు తీసుకుంటుంద‌ని అనుమానిస్తున్న త‌రుణంలో అనూహ్యంగా కొండా ముర‌ళి రివర్స్‌ కౌంటర్‌కు దిగారు. తనపై విమర్శలు గుప్పిస్తున్న వరంగల్‌ కీలక నేతలపైనే కమిటీ (Disciplinary Committee)కి 15 పేజీల‌తో కూడిన నివేదిక అందించిన‌ట్లు తెలుస్తోంది. అయితే ఇదే ఇప్పుడు రాష్ట్ర రాజ‌కీయాల్లో హాట్ హాట్ టాపిక్ గా మారింది. ఉమ్మ‌డి వ‌రంగ‌ల్ జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు కడియం శ్...
error: Content is protected !!