Sarkar Live

Privacy Policy

ACB Trap | ఏసీబీకి చిక్కిన పంచాయతీ కార్యదర్శి..
Crime

ACB Trap | ఏసీబీకి చిక్కిన పంచాయతీ కార్యదర్శి..

ACB Raids | ఇంటి నెంబర్, వాటర్ సర్వీసింగ్ షెడ్ ఏర్పాటు కోసం డ‌బ్బులు డిమాండ్ చేసిన సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలం బుదేరా గ్రామ పంచాయతీ కార్య‌ద‌ర్శిని ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. బుదేరా జీపీలో గ్రామానికి చెందిన వారు వాటర్ సర్వీసింగ్ షెడ్ నిర్మాణానికి అనుమ‌తి, కొత్త ఇంటికి నంబర్ కేటాయింపు కోసం గ్రామ కార్యదర్శి పి.నాగలక్ష్మి రూ.8వేలు లంచం (Bribe) డిమాండ్ చేశార‌ని ఏసీబీ అధికారులు తెలిపారు. దీంతో బాధితులు ఏసీబీ అధికారులను సంప్రదించ‌గా వారు రంగంలోకి దిగారు. సోమవారం బుదేరాలోని జీపీ కార్యాలయంలో రూ.8 వేల లంచం ఇస్తుండగా ఏసీబీ అధికారులు జీపీ కార్యదర్శిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఆమెను అరెస్టు చేసిన ఏసీబీ (ACB) అధికారులు నాంపల్లిలోని కోర్టులో ప్రవేశపెట్టగా 14 రోజుల రిమాండ్ విధించారు. ఎవరైనా ప్రభుత్వ అధికారి లేదా సిబ్బంది లంచం అడిగితే ప్రజలు తెలంగాణ #అవినీతినిరోధకశాఖ వారి...
India Census | దేశంలో జనాభా గణన తేదీలు ఖరారు
National

India Census | దేశంలో జనాభా గణన తేదీలు ఖరారు

India Census 2026 | భారతదేశంలో తదుపరి జనాభా గణన రెండు దశల్లో నిర్వహించబడుతుందని కేంద్ర‌ ప్రభుత్వం ప్రకటించింది. ఇది అక్టోబర్ 1, 2026 నుంచి ప్రారంభమై మార్చి 1, 2027 వరకు కొనసాగుతుంది.లడఖ్, జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్ ఉత్తరాఖండ్‌లోని మంచుతో కప్పబడిన ప్రాంతాలలో జనాభా గణన 2026 అక్టోబర్ 1 నుండి ప్రారంభమవుతుంది. అలాగే దేశంలోని మిగిలిన ప్రాంతాలలో 2027 మార్చి 1 నుండి చేపట్టనున్నారు. ఈరోజు హోం మంత్రిత్వ శాఖ (Ministry of Home Affairs) జారీ చేసిన నోటిఫికేషన్ ద్వారా దీనిని ప్రకటించారు. భారతదేశ 16వ జనాభా లెక్కల అధికారిక నోటిఫికేషన్‌ను భారత రిజిస్ట్రార్ జనరల్, సెన్సస్ కమిషనర్ కార్యాలయం ద్వారా హోం మంత్రిత్వ శాఖ జారీ చేసింది. నోటిఫికేషన్ ప్రకారం, దేశంలోని చాలా ప్రాంతాలకు మార్చి 1, 2027న 00:00 గంటలుగా ఉంటుంది. అయితే, కఠినమైన వాతావరణ పరిస్థితులు, క్లిష్ట భూభాగం కారణంగా, లడఖ్, జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ...
Vemulawada | వేముల‌వాడ‌లో ముమ్మ‌రంగా కూల్చివేత‌లు
State, Karimnagar

Vemulawada | వేముల‌వాడ‌లో ముమ్మ‌రంగా కూల్చివేత‌లు

Rajanna Siricilla News | రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ప్ర‌ముఖ పుణ్య‌క్షేత్ర‌మైన‌ వేములవాడలో (Vemulawada) బుల్డోజ‌ర్లు (Bulldozers) కూల్చివేత‌లు ప్రారంభించాయి. సోమ‌వారం ఉద‌యం నుంచే అధికారులు ప్ర‌దాన‌ రోడ్ల వెంట‌ భవనాలను కూల్చివేస్తున్నారు. వేముల‌వాడ‌ పట్టణంలోని ప్రధాన రహదారి విస్తరణ (Vemulawada Road expansion ) పనులలో భాగంగా రోడ్డుకు ఇరువైపులా బిల్డింగ్‌లను నేలమట్టం చేస్తున్నారు. మొత్తం 10 జేసీబీలతో పది బృందాలు నిర్విరామంగా కూల్చివేత‌లు చేప‌డుతున్నాయి. అధికారుల‌ను ఈ పనులను క్షేత్ర‌స్థాయిలో పర్యవేక్షిస్తున్నారు. ఇండ్లు, దుకాణాలను య‌జ‌మానులు దీనిపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. కూలీలలో సామాన్లు తొలగిస్తున్నారు. ఈ సందర్భంగా పెద్ద సంఖ్య‌లో పోలీసులను మోహరించారు. అయితే ప్రధాన రోడ్డు వైపు వాహనాలు రాకుండా అమరవీరుల స్తూపం వద్ద బారికేడ్లు ఏర్పాటుచేశారు Vemulawada : రోడ్ల విస్తరణకు రూ.47కోట్లు.. ...
Helicopter Crashes | కూలిన హెలీకాప్ట‌ర్‌.. ఐదుగురు మృతి
Crime

Helicopter Crashes | కూలిన హెలీకాప్ట‌ర్‌.. ఐదుగురు మృతి

కేదార్‌నాథ్‌కు వెళ్తున్న హెలికాప్టర్ ఉత్తరాఖండ్‌లో కూలిపోయింది. డెహ్రాడూన్ నుంచి కేదార్‌నాథ్‌కు వెళ్తున్న ఈ ప్ర‌మాదం (Helicopter Crashes) లో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు ఆర్యన్‌ ఏవియేషన్‌కు చెందిన హెలికాప్టర్‌.. కేదార్‌నాథ్ ఆలయం నుంచి గుప్తకాశీకి బ‌యలుదేరింది. ఈ క్రమంలో వాతావరణం అనుకూలించకపోవడంతో అదుపు తప్పిన హెలికాప్టర్‌ గౌరీకుండ్‌లోని దట్టమైన అటవీ ప్రాంతంలో కూలిపోయింది. దీంతో హెలికాప్ట‌ర్ లో ఉన్న ఐదుగురు అక్కడికక్కడే మృతిచెందారు. మృతుల్లో పైలట్‌తో పాటు ఓ చిన్నారి కూడా ఉన్నట్లు స‌మాచారం. ప్రమాద సమయంలో హెలికాప్టర్‌లో ఆరుగురు ప్రయాణికులు ఉన్నారు. కాగా ఘటనా స్థలానికి రెస్క్యూ సిబ్బందిని పంపామని, అయితే హెలికాప్టర్‌ దట్టమైన అటవీ ప్రాంతంలో పడిపోవడంతో అక్కడికి చేరుకోవడం కొంత జాప్య‌మ‌వుతోంద‌ని అధికారులు వెల్లడించారు. తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం  సర్కార్ లైవ్ ...
Galwan | గాల్వన్ ఘర్షణకు ఐదేళ్లు.. భారత ప్రాతినిధ్యం ఎలా మారింది?
World

Galwan | గాల్వన్ ఘర్షణకు ఐదేళ్లు.. భారత ప్రాతినిధ్యం ఎలా మారింది?

Galwan | ఐదేళ్ల క్రితం 2020 జూన్ 15న, తూర్పు లడఖ్‌లో చైనాతో జరిగిన గాల్వన్ లోయ ఘర్షణలో భారతదేశం 20 మంది సైనికులను కోల్పోయింది. ఈ సంఘటన భారతదేశం-చైనా సంబంధాలను పూర్తిగా మార్చివేసింది. వాస్తవ నియంత్రణ రేఖ (LAC) వెంబడి భారతదేశ రక్షణ ప‌రిస్థితులు, వ్యూహాత్మక ప్రణాళికలో సంస్కరణలకు దారితీసింది. ప్రస్తుత ప్రోటోకాల్‌ల ప్రకారం భారత దళాలు తుపాకీలు లేకుండానే ప్రతీకారం తీర్చుకున్న గాల్వన్ ఘర్షణ చైనా వైపు కూడా గణనీయమైన ప్రాణనష్టానికి కారణమైంది, రెండు పొరుగు దేశాల‌ మధ్య నమ్మకం పూర్తిగా దెబ్బతింది. ఆ తరువాత సంవత్సరాల్లో, భారతదేశం తన సైనిక సంసిద్ధతను గణనీయంగా పునర్నిర్మించింది, సరిహద్దు మౌలిక సదుపాయాలను బలోపేతం చేసింది మరియు దౌత్య కార్యకలాపాలను తీవ్రతరం చేసింది. భారత సాయుధ దళాలు LAC అంతటా, ముఖ్యంగా తూర్పు లడఖ్‌లో తమ ఉనికిని పెంచుకున్నాయి, దళాలను, అధిక ఎత్తులో యుద్ధ పరికరాలను వేగంగా మోహరించాయి. Galwa...
error: Content is protected !!