Sarkar Live

Privacy Policy

GDP growth : వ‌రుస‌గా నాలుగో ఏడాది బ‌ల‌మైన‌ ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతున్నాం..
Business

GDP growth : వ‌రుస‌గా నాలుగో ఏడాది బ‌ల‌మైన‌ ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతున్నాం..

New Delhi : వరుసగా నాలుగో సంవత్సరం వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా భారతదేశం తన జిడిపి వృద్ధి (GDP growth) ని కొనసాగిస్తోందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitharman) అన్నారు, దీనికి చిన్న, మధ్య తరహా, భా పరిశ్రమలు, సేవారంగం, వ్యవసాయ రంగం తోడ్పడుతోంద‌ని పేర్కొన్నారు. . జిడిపి డేటా విడుద‌లైన త‌ర్వాత మంత్రి తాజాగా వ్యాఖ్యానించారు.దీనిలో Q4లో భారతదేశ ఆర్థిక వృద్ధి 7.4 శాతానికి పెరిగింది, కానీ ఆర్థిక సంవత్సరం 25లో కోవిడ్-యుగం తర్వాత ఆర్థిక వ్యవస్థ దాని నెమ్మదిగా వృద్ధిని నమోదు చేయకుండా కాపాడలేకపోయింది. GDP growth : వ్యవసాయ రంగమే కాపాడింది.. 2024-25 మార్చి త్రైమాసికంలో భారతదేశ తయారీ రంగం బాగుంది. ఇది పూర్తి ఆర్థిక సంవత్సరానికి 6.5 శాతం GDP వృద్ధిని సాధించడంలో సహాయపడింది. చిన్న, మధ్యతరహా, పెద్ద పరిశ్రమలు వస్తున్న కారణంగా, అలాగే మా తయారీ సామర్థ్యం, ​​మా సేవా సా...
దేశంలోనే డ్రీమ్ ప్రాజెక్టుగా కోహెడ ఇంటిగ్రేటెడ్ మార్కెట్ – Koheda Integrated Market
Hyderabad, State

దేశంలోనే డ్రీమ్ ప్రాజెక్టుగా కోహెడ ఇంటిగ్రేటెడ్ మార్కెట్ – Koheda Integrated Market

Koheda Integrated Market | ముఖ్యమంత్రి దేశంలోనే అత్యాధునిక హంగులతో ఒక డ్రీమ్ ప్రాజెక్టుగా ఇంటిగ్రేటెడ్ మార్కెట్ ను కోహెడ వద్ద నిర్మించేందుకు తెలంగాణ సర్కారు కసరత్తు ప్రారంభించింది. సూమారు 250 ఎకరాల విస్తీర్ణంలో ఒక పెద్ద మార్కెట్ ను నిర్మించనుంది. అందులో ఆధునిక వసతులతో కూడిన నిర్మాణాలు, కోల్డ్ స్టోరేజ్ లు, షెడ్లు, విశాలమైన రోడ్లు తదితర సౌకర్యాలతో మార్కెట్ ను నిర్మించేందుకు ప్రణాళికలు రూపొందించే పనుల్లో అధికారులు నిమగ్నమయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణా రావు శుక్రవారం డాక్టర్ బిఆర్.అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో కోహెడ మార్కెట్ పై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రత్యేక శ్రద్ధ వహించి దేశంలో ఒక రోల్ మోడల్ మార్కెట్ ను నిర్మించాలని నిర్ణయించారని సిఎస్ ఈసందర్భంగా తెలిపారు. వార...
OG Movie |  పవన్ ఓజీకి స్మాల్ బ్రేక్.. కారణమిదేనా..?
Cinema

OG Movie | పవన్ ఓజీకి స్మాల్ బ్రేక్.. కారణమిదేనా..?

OG Movie update | పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (power Star Pawan Kalyan)కొంత విరామం తరవాత మళ్ళీ సినిమాల్లో బిజీ అయ్యాడు. తను వరుసగా సైన్ చేసిన మూవీలను కంప్లీట్ చేసే పనిలో ఉన్నాడు.దాదాపు 5 సంవత్సరాలుగా ఫాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్న హరిహర వీరమల్లు (Harihara veeramallu) ఫస్ట్ పార్ట్ షూటింగ్ ను ఇటీవలే కంప్లీట్ చేసుకున్న పవర్ స్టార్ దానికి సంబంధించిన డబ్బింగ్ ను కూడా కంప్లీట్ చేశాడు. ఈ మూవీ నెక్స్ట్ మంత్ రిలీజ్ కు రెడీ గా ఉంది. ఆ మూవీ టీం ప్రమోషన్స్ లో బిజీ అయ్యారు. వరుసగా సాంగ్స్ ని రిలీజ్ చేస్తూ ఫ్యాన్స్ లో జోష్ నింపుతున్నారు. ఇక పవన్ కళ్యాణ్ సైన్ చేసిన మూవీల్లో ఓజీ(OG) కూడా ఉంది. సగానికి పైనే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ మూవీ పవన్ రాజకీయాల్లో బిజీ అవ్వడం వల్ల బ్రేక్ పడింది. ప్రజెంట్ పవన్ ఈ మూవీని కంప్లీట్ చేయడానికి డేట్స్ ఇచ్చాడు. ముంబాయిలో OG Movie షూటింగ్.. ముంబాయిలో ప్లాన్ చేసుకున్న ...
Gaddar film awards | 2014 నుంచి 2023 వరకు గద్దర్ ఉత్తమ చిత్రాలు ఇవే..
Cinema

Gaddar film awards | 2014 నుంచి 2023 వరకు గద్దర్ ఉత్తమ చిత్రాలు ఇవే..

Gaddar film awards | టాలీవుడ్‌లో 2014 నుంచి 2023 వరకు విడుదలైన సినిమాలకు గద్దర్ అవార్డులనుప్రముఖ సినీనటుడు, జ్యూరీ ఛైర్మన్‌ మురళీమోహన్ ప్ర‌క‌టించారు. రాష్ట్ర‌ ప్రభుత్వం అందించనున్న గద్దర్ అవార్డులపై మురళీమోహన్ ఎఫ్‌డీసీ ఛైర్మన్‌, నిర్మాత దిల్‌రాజుతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. ఏడాదికి మూడు చిత్రాల చొప్పున ఉత్తమ సినిమాలకు అవార్డులను వెల్లడించారు. 2014 జూన్‌ 2 నుంచి సెన్సార్‌ అయిన సినిమాలను పరిగణనలోకి తీసుకున్నట్లు చెప్పారు. వీటితోపాటు సినీ రంగానికి సేవలందించిన వారికి ఆరు ప్రత్యేక అవార్డులు ప్ర‌దానం చేయ‌నున్న‌ట్లు తెలిపారు. ప్రజాకవి, కాళోజీ నారాయ‌ణ‌రావుకు స్పెషల్‌ జ్యూరీ అవార్డును ప్రకటించారు. Gaddar film awards | సంవత్సరాల వారీగా ఉత్తమ చిత్రాలివే.. 2014ప్రథమ ఉత్తమ చిత్రం: రన్‌ రాజా రన్‌రెండో ఉత్తమ చిత్రం: పాఠశాలమూడో ఉత్తమ చిత్రం : అల్లుడు శీను 2015ప్రథమ ఉత్తమ చిత్రం: రుద్రమదేవిరె...
Bhdradri kothagudem | కొత్తగూడెంలో 17 మంది మావోయిస్టుల లొంగుబాటు
Crime

Bhdradri kothagudem | కొత్తగూడెంలో 17 మంది మావోయిస్టుల లొంగుబాటు

Bhdradri kothagudem : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ బి.రోహిత్ రాజు ఎదుట వివిధ హోదాలకు చెందిన 17 మంది సిపిఐ (మావోయిస్ట్) కార్యకర్తలు శుక్రవారం లొంగిపోయారు. నక్సలిజం పేరుతో హింస మార్గాన్ని విడిచిపెట్టి, వారి కుటుంబ సభ్యులతో ప్రశాంతమైన జీవితాన్ని గడిపిన తర్వాతే ఆ కార్యకర్తలు లొంగిపోయారు. లొంగిపోయిన వారిలో ఇద్దరు ఏరియా కమిటీ సభ్యులు (ACMలు), నలుగురు పార్టీ సభ్యులు (PMలు) మరియు మిలీషియా క్యాడర్లు ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వాలు లొంగిపోయిన మావోయిస్టులకు ఆపరేషన్ చేయూత పేరుతో తక్షణ ఆర్థిక సాయంతోపాటు ఉపాధి అవకాశాలు కల్పిస్తామని హామీ ఇస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే పెద్ద ఎత్తున మావోయిస్టులు హింసామార్గం నుంచి బయటకు వస్తున్నారు.ఈక్రమంలోనే కొత్తగూడెంలో మొత్తం 17 మంది దళ సభ్యులు ఎస్పీ రోహిత్ రాజు ఎదుట లొంగిపోయారు. ఇందులో ఆరుగురు మహిళలు ఉన్నారు. అయితే, లొంగిపోయిన వారంతా బీజీపూర్, సుక్మా జిల్లాకు చెందిన మా...
error: Content is protected !!