Ratha saptami : రథసప్తమి వేడుకలకు సిద్ధమవుతున్న తిరుమల తిరుపతి దేవస్థానం
Ratha saptami in Tirumala : తిరుమలలో రథసప్తమి వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) అధికారులు విస్తృతమైన ఏర్పాట్లు చేస్తున్నారు. భక్తుల రద్దీ అధికంగా ఉండే అవకాశం దృష్ట్యా భద్రత, సౌకర్యాల విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఫిబ్రవరి 4న జరిగే ఈ వేడుక భక్తులకు కనులవిందు చేయనుంది.
Ratha saptami : రథసప్తమి విశిష్టత
సూర్యారాధనకు హిందూ సంప్రదాయంలో అత్యంత ప్రాధాన్యం ఉంటుంది. ముఖ్యంగా భక్తులు సూర్య జయంతి రోజు ఎక్కువగా ఈ పూజను చేస్తారు. మాఘ మాస శుక్ల పక్షం సప్తమి తిథి నాడు ఈ వేడుక వస్తుంది. దీనిని రథ సప్తమి (Ratha saptami) అని కూడా అంటారు. సూర్యుడు ఏడు గుర్రాలపై రథంపై ప్రయాణించి దక్షిణాయనం ముగించి పూర్వోత్తర దిశగా ప్రయాణం సాగిస్తుందని భక్తుల విశ్వసం. మాఘ సప్తమి నుంచి రానున్న ఆరు మాసాలను ఉత్తరాయణ పుణ్యకాలంగా పరిగణిస్తారు.
భక్తుల రద్దీ దృష్ట్యా ప్రత్యేక...




