Sarkar Live

Privacy Policy

MT Vasudevan Nair : లెజెండరీ మలయాళ రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత‌
Cinema

MT Vasudevan Nair : లెజెండరీ మలయాళ రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత‌

MT Vasudevan Nair | మలయాళ సాహిత్య రంగం ఒక దిగ్గ‌జ ర‌చ‌యిత‌ను కోల్పోయింది.. సుప్రసిద్ధ సాహితీవేత్త MT వాసుదేవన్ నాయర్ అనారోగ్య సమస్యలతో కోజికోడ్‌లోని ఒక ఆసుపత్రిలో గ‌త రాత్రి క‌న్నుమూశారు. ఏడు దశాబ్దాలకు పైగా, వాసుదేవన్ తన అసమానమైన సృజనతో సాహిత్య ప్రపంచాన్ని అలంకరించారు నాయర్. మలయాళ సాహిత్యంలో చెరగని ముద్ర వేసిన ఆయన..తను ప్రవేశించిన ప్రతి రంగంలో ఉన్నతంగా రాణించారు. అతని రచనలు మలయాళ భాష‌కు ప్రపంచ స్థాయి కీర్తి ప్రతిష్టలను తీసుకొచ్చాయి. రాండమూజం వంటి దిగ్గజ రచనల రచయిత, MT వాసుదేవన్ సాహిత్య ప్రపంచంలో ప్రతిష్టాత్మకంగా నిలిచిపోయే వారసత్వాన్ని మిగిల్చారు. "అలలు తీరాన్ని చేరుకుంటున్న‌ట్లు" ఆయన రచన తరతరాలకు స్ఫూర్తినిస్తూనే ఉంటుంది. MT వాసుదేవన్ నాయర్ (91) గత 11 రోజులుగా గుండె జబ్బులు, శ్వాసకోశ సమస్యల కారణంగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న‌రు. ఈక్ర‌మంలో మూత్రపిండాలు, గుండె పనితీరు క్షీణించ‌డంతో ...
India vs Australia | నాలుగో టెస్టులో ఓపెనర్ గా రోహిత్ శర్మ..!
Sports

India vs Australia | నాలుగో టెస్టులో ఓపెనర్ గా రోహిత్ శర్మ..!

India vs Australia Boxing Day Test | బాక్సింగ్ డే సందర్భంగా గురువారం నుంచి మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్ (ఎంసీజీ)లో ఆస్ట్రేలియాతో జరగనున్న నాలుగో టెస్టు (Ind vs Aus )లో భారత కెప్టెన్ రోహిత్ శర్మ ఓపెనర్‌గా బరిలోకి దిగే అవకాశం ఉందని సమాచారం. ఓపెనర్‌గా ఇప్పటివరకు సిరీస్‌లో స‌త్తా చాటిన కేఎల్ రాహుల్‌ను మూడో ర్యాంక్‌కు మార్చవచ్చని నివేదికలు చెబుతున్నాయి. రాహుల్ మూడు మ్యాచ్‌లు, ఆరు ఇన్నింగ్స్‌లలో 47.00 సగటుతో 235 పరుగులతో, రెండు అర్ధసెంచరీలు చేశారు. ఆరు ఇన్నింగ్స్‌ల తర్వాత 84 పరుగులతో అత్యుత్తమ స్కోరుతో సిరీస్‌లో భారతదేశం త‌ర‌పున ఎక్కువ ప‌రుగులు సాధించి రెండో స్థానంలో నిలిచాడు. స్వదేశంలో బంగ్లాదేశ్ సిరీస్‌తో ప్రారంభమైన టెస్ట్ సీజన్‌లో, రోహిత్ కేవలం ఒక 50తో, ఆశ్చర్యకరంగా 11.69 సగటుతో ఏడు గేమ్‌లలో కేవ‌లం 152 పరుగులు మాత్ర‌మే చేశాడు. ఈ సంవత్సరం, అతను 13 టెస్టులు, 24 ఇన్నింగ్స్‌లలో 26.39 స‌గ‌టుతో ...
Medak | టెంట్లు పీకేయడం కాదూ…వాళ్ల డిమాండ్లు తీర్చండి..
State

Medak | టెంట్లు పీకేయడం కాదూ…వాళ్ల డిమాండ్లు తీర్చండి..

Medak News | త‌మ డిమాండ్ల కోసం శాంతియుతంగా నిర‌స‌న తెలుపుతున్న సమగ్ర శిక్ష అభియాన్‌ (sarva shiksha abhiyan) ఉద్యోగుల డిమాండ్లు నెర‌వేర్చాల‌ని మాజీ మంత్రి హ‌రీష్ రావు (BRS MLA Harish Rao) అన్నారు. మెద‌క్ ప‌ర్య‌ట‌న‌లో భాగంగా దీక్ష శిబిరం ముందు నుంచే వెళ్లిన సిఎం రేవంత్‌రెడ్డి వాళ్ల ను ప‌ట్టించుకోలేద‌ని, అంతేకాకుండా ఉద్యోగుల టెంట్ ను పీకేసి వారిని నిర్బంధించడంపై హరీష్‌రావు ఫైర్‌ అయ్యారు. 15రోజులుగా ఆందోళన చేస్తున్న వారి ఆవేదన అర్థం చేసుకోవాలని హితువు పిలికారు. ఈ మేరకు హరీష్‌రావు బుధ‌వారం ఒక పత్రికా ప్రకటనను విడుదల చేశారు. గతఎన్నికల సమయంలో తమకిచ్చిన హామీని నిలబెట్టుకోవాలని డిమాండ్‌ ‌చేస్తూ మెదక్‌ ‌లో శాంతియుంతంగా దీక్ష‌లు చేస్తున్న సమగ్ర శిక్ష ఉద్యోగులను పోలీసుస్టేషన్‌ ‌తరలించడాన్ని,హ‌రీష్ రావు ఖండించారు. అధికారంలోకి వ‌చ్చిన వెంటనే చాయ్‌ ‌తాగినంత టైంలోనే సమగ్ర శిక్ష అభియాన్‌ ఉద్యోగుల సమస్యలు ప...
2024 Telecom Industry | టెలికాం ఆదాయం రెట్టింపు.. ఐదేళ్ల‌ల్లో గ‌ణ‌నీయ వృద్ధి
Business

2024 Telecom Industry | టెలికాం ఆదాయం రెట్టింపు.. ఐదేళ్ల‌ల్లో గ‌ణ‌నీయ వృద్ధి

Telecom News | భారత టెలికాం (Indian telecom industry) ఆదాయం గ‌ణీయంగా పెరిగింది. FY25 రెండో త్రైమాసికంలో 8 శాతం (త్రైమాసికం వారీగా) పెరిగి రూ.674 బిలియన్ (ఏటా 13 శాతం వృద్ధి) చేరింది. ఇది ప్రధానంగా టారిఫ్ పెంపుల వల్ల సాధ్య‌మైంద‌ని వెల్ల‌డైంది. మొబైల్ నెట్‌వర్క్‌ల‌ టారిఫ్‌లు విడత‌లుగా పెరగ‌డంతో దీంతో భారత టెలికాం త్రైమాసిక ఆదాయం సెప్టెంబర్ 2019 నుంచి ఇప్పటి వరకు 96 శాతం వృద్ధి చెందింది. అంటే.. ఐదేళ్ల వార్షిక వృద్ధి రేటు (CAGR) 14 శాతానికి చేరింది. మోతిలాల్ ఒస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్ సంస్థ చేప‌ట్టిన స‌ర్వేలో ఈ విష‌యాలు వెల్ల‌డ‌య్యాయి. Telecom Industry రెండింత‌ల వృద్ధి భారత టెలికాం పరిశ్రమలో సాంకేతికంగా సమీకృత మార్కెట్ నిర్మాణం, అధిక డేటా వినియోగం, తక్కువ ARPU (ప్రతి యూనిట్ ఆదాయం), టెలికాం కంపెనీలు తగినంత రాబడి పొందలేకపోవడం వంటి ప‌రిణామాల దృష్ట్యా టారిఫ్ (tariff)లు పెరిగాయ‌ని...
Shimla Snowfall | మంచు బీభ‌త్సం .. ప‌ర్యాట‌క ప్రాంతాలు అత‌లాకుత‌లం
Trending

Shimla Snowfall | మంచు బీభ‌త్సం .. ప‌ర్యాట‌క ప్రాంతాలు అత‌లాకుత‌లం

Snowfall in Himachal Pradesh News హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో మంచు బీభ‌త్సం సృష్టించింది. క్రిస్మ‌స్ వేడుక‌లు జ‌రుగుతున్న వేళ ఈ అప‌శ్రుతి చోటుచేసుకుంది. సిమ్లా, మ‌నాలి (Shimla, Manali)తోపాటు ఇతర హిల్ స్టేషన్లలో భారీగా మంచు (Snowfall ) కుర‌వ‌డంతో సుమారు 223 ర‌హ‌దారులు మూసుకుపోయాయి. దీంతో ఎక్క‌డి వాహ‌నాలు అక్క‌డే నిలిచిపోయాయి. గ‌త 24 గంట‌ల్లో అనేక వాహ‌నాలు ధ్వంస‌మయ్యాయి. న‌లుగురు మృతి చెందారు. అనేక మంది గాయప‌డ్డారు. మంచులో కూరుకుపోయిన వాహ‌నాలు క్రిస్మ‌స్ ( Christmas) సంబ‌రాల సంద‌ర్భంగా భారీ మంచు కుర‌వ‌డాన్ని ప‌ర్యాట‌కులు ఎంతో ఆనందంగా ఆస్వాదించారు. ఈ దృశ్యాన్ని చూసి కేరింత‌లు కొట్టారు.. ఎంతో ఎంజాయ్‌ చేశారు. అయితే.. మ‌రో వైపు సిమ్లా, మ‌నాలిలోని అనేక‌ ప్ర‌దేశాల్లో ద‌ట్ట‌మైన మంచు అతి భారీ స్థాయిలో కురిసింది. దీంతో ఆ ప్రాంత‌మంతా తెల్ల‌గా మారిపోయింది. దీంతో 223 రహదారుల్లో సుమారు 500 వాహ‌నాలు ...
error: Content is protected !!