Sarkar Live

Privacy Policy

Sharon Raj murder case : ప్రియుడి హ‌త్య కేసులో ప్రియురాలికి ఉరి శిక్ష.. కోర్టు సంచ‌ల‌న తీర్పు
Crime

Sharon Raj murder case : ప్రియుడి హ‌త్య కేసులో ప్రియురాలికి ఉరి శిక్ష.. కోర్టు సంచ‌ల‌న తీర్పు

Kerala Sharon Raj murder case : కేర‌ళ‌లో మూడేళ్ల క్రితం చోటు చేసుకున్న హ‌త్య కేసులో తీర్పు వెలువ‌డింది. ప్రియుడిని అంతం చేసిన ప్రియురాలికి ఉరి శిక్ష ఖరారైంది. తిరువనంతపురం నెయ్యట్టికార అదనపు జిల్లా సెషన్స్ కోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎ.ఎం.బషీర్ ఈరోజు తీర్పును వెలువ‌రించారు. ప్రియుడు ష‌రోన్‌రాజ్‌ను హ‌త్య చేసిన గ్రీష్మ‌కు ఉరిశిక్ష విధించారు. మ‌రో ప్ర‌ధాన నిందితుడైన ఆమె మేన‌మామ నిర్మ‌ల్ కుమార‌న్‌కు మూడేళ్ల కఠిన కారాగార శిక్ష వేసింది. ముందు ప్రేమ.. ఆ త‌ర్వాత ప‌గ‌ షరోన్ రాజ్ బీఎస్సీ రేడియాలజీ చదువుకుంటున్నప్పుడు గ్రీష్మతో పరిచయం ఏర్పడింది. అది ప్రేమగా మారింది. దీంతో వీరిద్ద‌రి మ‌ధ్య‌ ఏడాది పాటు రిలేషన్‌షిప్ కొనసాగింది. అయితే.. గ్రీష్మ కుటుంబం వీరి పెళ్లికి అంగీకరించలేదు. దీంతో బ్రేకప్ చేసుకుందామ‌ని గ్రీష్మ కోర‌గా ష‌రోన్ అందుకు ఒప్పుకోలేదు. దీంతో తన తల్లి, మేనమామ సహ‌కారంతో అత‌డిని హత్య చేస...
Warangal : కొండాను ఢీ కొట్టగలరా…?
Special Stories

Warangal : కొండాను ఢీ కొట్టగలరా…?

ఫైర్ బ్రాండ్స్‌ను రాజకీయంగా డిస్టర్బ్ చేయడంలో అంతర్యమేమిటో? కొండాకు వ్య‌తిరేకంగా పావులు కదుపుతున్నదెవరు? ఎదురించేదిలేదు..? ఢీ కొట్టేది ఉండదు..? కానీ లాబీయింగ్ లో మాత్రం ముందుంటారు..? Warangal : అధికారంలో ఉన్నా లేకున్నా.. పదవులు వచ్చినా రాకపోయినా.. నిత్యం ప్రజల మధ్యనే ఉంటూ వారితో మమేకమవుతూ రాష్ట్ర రాజకీయాల్లో కొన్ని దశాబ్దాలుగా ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా దీటుగా ఎదుర్కొంటూ ప్రజల గుండెల్లో సుస్థిరంగా నిలిపోయారు కొండా దంపతులు.. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎంతో మంది అభిమానుల హృదయాల్లో చోటుసంపాదించుకున్నారు ఈ సీనియ‌ర్‌ మాస్ లీడర్లు.. రాజకీయ ప్రత్యర్థులు సైతం కొండాను ఢీ కొట్టాలంటే ఒకటికి వందసార్లు ఆలోచిస్తారంటే వారు ఎంతటి పవర్ ఫుల్ లీడర్లో అర్థం చేసుకోవచ్చు. అలాంటిది కొండా మురళి (Konda Murali) సతీమణి కొండా సురేఖ (Konda Surekha) ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న వరంగల్ తూర్పు నియోజకవర్గం(...
Metro Rail | బెంగళూరు మెట్రో ధరలు పెరిగాయి..  హైదరాబాద్ లోనూ పెంచుతారా?
State

Metro Rail | బెంగళూరు మెట్రో ధరలు పెరిగాయి.. హైదరాబాద్ లోనూ పెంచుతారా?

Hyderabad Metro Rail : కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఇటీవ‌లే ఆర్టీసీ బస్సు ఛార్జీలను 15 శాతం పెంచింది. మ‌రోవైపు బెంగళూరు మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ (BMRCL) పెరుగుతున్న నిర్వహణ వ్యయాలను దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు మెట్రో ఛార్జీలను కూడా దాదాపు 43 శాతం పెంచాలని క‌ర్ణాట‌క స‌ర్కారు యోచిస్తోంది. మెట్రో కార్యకలాపాలు ప్రారంభమైనప్పటి నుంచి ఛార్జీలను సవరించలేదని BMRCL అధికారులు పేర్కొన్నారు. పెరుగుతున్న నిర్వహణ ఖర్చులు, స్టేషన్లలో మౌలిక వ‌సతులు, రైళ్ల నిర్వహణ, మహిళల కోసం ప్రత్యేక కోచ్‌లను అందించడం, సీనియర్ సిటిజన్లు, ఇతరులకు ప్రత్యేక సేవలను అందించడం వంటి అవసరాలను పరిగణనలోకి తీసుకుని, మెట్రో ఛార్జీలను పెంచాల్సి వ‌స్తున్న‌ద‌ని BMRCL పేర్కొంది. ధ‌ర‌ల స‌వ‌ర‌ణ కమిటీ సిఫార్సుల ఆధారంగా ఛార్జీల పెంపుదలని బీఎంఆర్‌సీఎల్ ప్రతిపాదించింది. అయితే బీఎంఆర్‌సీఎల్ నిర్ణయం ప్రయాణికులకు ఏమాత్రం మింగుడు పడడం ...
Donald Trump : ట్రంప్ ప్ర‌మాణ స్వీకారోత్స‌వం.. భార‌త సంస్కృతికి అపూర్వ ఆద‌ర‌ణ
World

Donald Trump : ట్రంప్ ప్ర‌మాణ స్వీకారోత్స‌వం.. భార‌త సంస్కృతికి అపూర్వ ఆద‌ర‌ణ

Donald Trump's inauguration : భారతీయ సంస్కృతి అమెరికాలో ప్ర‌తిబింబించింది. ఆ దేశ అధ్య‌క్షుడిగా డోలాన్డ్ ట్రంప్ (Donald Trump) ప్ర‌మాణ స్వీకారం చేస్తున్న మ‌హోత్స‌వంలో శివం డోల్ తాషా గ్రూపు ప్ర‌ద‌ర్శ‌న ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల మ‌దిని దోచుకుంది. ఇది కేవలం సంగీత ప్రదర్శనే కాకుండా భారతీయ ఆధ్యాత్మికత, సామూహికతను ప్రపంచానికి పరిచయం చేసింది. 30 మంది సభ్యులు కలిగిన ఈ గ్రూప్ త‌న అద్భుతమైన ప్రదర్శన ద్వారా భారతీయ మూలాలను అమెరికన్ గడ్డమీద కొత్త పుంతలు తొక్కించారు. క్యాపిటల్ హిల్‌లో చారిత్రక వేడుక‌ క్యాపిటల్ హిల్ రోటుండా లోపల 1985 తర్వాత తొలిసారి జరిగిన డోనాల్డ్ ట్రంప్ ప్రమాణస్వీకార వేడుక చరిత్రలో కొత్త అధ్య‌యాన్ని లిఖించింది. అమెరికా (America) చట్టసభ భవనం వద్ద స్నోఫాల్ కారణంగా ఈ ప్రత్యేక ఏర్పాట్లు చేయాల్సి వచ్చింది. దీంతో మ‌రింత భారీ భద్రతా చ‌ర్య‌లు చేప‌ట్టాల్స...
Pod taxi : హైద‌రాబాద్ కు అత్యాధునిక పాడ్ టాక్సీలు?
State

Pod taxi : హైద‌రాబాద్ కు అత్యాధునిక పాడ్ టాక్సీలు?

Pod taxi in Hyderabad : రోజురోజుకు అభివృద్ధి చెందుతున్న హైద‌రాబాద్‌ ఐటీ కారిడార్‌లో తరచుగా ఏర్పడే ట్రాఫిక్ జామ్‌లకు స్వస్తి పలికేందుకు కొత్త ప్ర‌తిపాద‌న‌ల‌తో ప్ర‌భుత్వం ముందుసాగుతోంది. నాలెడ్జ్ సిటీ, హైటెక్ సిటీ, కొండాపూర్ వంటి ప్రాంతాల్లో చివరి మైలు కనెక్టివిటీని మెరుగుపరిచేందుకు పర్సనల్ రాపిడ్ ట్రాన్సిట్ (PRT) లేదా పాడ్ ట్యాక్సీ వ్యవస్థను (Pod taxi System) ప్రవేశపెట్టాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది. పీఆర్‌టీ వ్యవస్థ మొదట్లో రెండు కారిడార్‌లలో రానుంది. మెట్రో స్టేషన్‌లను కీలక కార్యాలయ కేంద్రాలు, బహుళజాతి కంపెనీలు, రాయదుర్గ్, మాదాపూర్, కొండాపూర్ సమీప ప్రాంతాల్లోని భారీ భవనాలతో కలుపుతుంది. 28 స్టాప్‌లతో 8.8 కి.మీ పొడవైన కారిడార్-I రాయదుర్గ్- ఐటీసీ కోహెనూర్-నాలెడ్జ్ సిటీని కవర్ చేస్తుంది దీనికి రూ. 880 కోట్ల వ్యయం అవుతుందని స‌ర్కారు అంచనా వేస్తోంది. మరోవైపు కారిడార్-IIలో 6 కి.మీ మేర 27...
error: Content is protected !!