Rythu Bharosa | రైతు కూలీలకు రూ.12వేల ఆర్థికసాయం.. ప్రభుత్వం కీలక ప్రకటన
Telangana Rythu Bharosa | నిరుపేద కూలీలకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్న్యూస్ చెప్పింది. భూమి లేని నిరుపేద కూలీలకు ఏటా 12వేలు ఇస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చిన విషయం తెలిసిందే.. ఈ పథకాన్ని ఈ నెల నుంచి అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క ప్రకటించారు. డిసెంబర్ 28న కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని భూమి లేని నిరుపేదకు రూ. 12వేలు ఇస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క (Bhatti vikramarka Mallu ) ఖమ్మం జిల్లాలో జరిగిన ప్రెస్ మీట్ లో ప్రకటించారు. ప్రతి సంవత్సరం ఇచ్చే 12వేల రూపాయలను రెండు విడతల్లో నిరుపేదల బ్యాంకు ఖాతాల్లో వేస్తామని పేర్కొన్నారు. ఈ తొలి విడతగా ఆరు వేలు ఖాతాల్లో వేస్తామని పేర్కొన్నారు.
రైతు భరోసాపై కూడా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పష్టత ఇచ్చారు. సంక్రాంతి నుంచి రైతుల ఖాతాల్లో రైతు భరోసా డబ్బులు జమ చేస్త...




