Sarkar Live

Privacy Policy

Vaikunta Ekadasi 2025 : వైకుంఠ ఏకాదశి.. విశిష్టత ఏమిటంటే
Trending

Vaikunta Ekadasi 2025 : వైకుంఠ ఏకాదశి.. విశిష్టత ఏమిటంటే

Vaikunta Ekadasi 2025 : వైకుంఠ ఏకాదశి హిందూ సంప్రదాయంలో అత్యంత పవిత్రమైన పర్వదినం. ఇది ప్రతి సంవత్సరం ధనుర్మాసంలో (డిసెంబర్-జనవరి మధ్య) వ‌స్తుంది. తెలుగు రాష్ట్రాల్లో దీన్ని ముక్కోటి ఏకాదశి అని పిలుస్తారు. ఈ పర్వదినం సాధారణంగా మోక్షదా ఏకాదశి లేదా పుత్రదా ఏకాదశికు సమాంతరంగా వస్తుంది. వైకుంఠ ఏకాదశి అంటే.. ప్రతి నెలా చంద్రమాసంలో కృష్ణ పక్షం, శుక్ల పక్షం రెండింటిలోనూ వచ్చే ఏకాదశి తిథులు విశేషంగా భావించబడతాయి. ఏడాదికి 24 ఏకాదశులు వస్తాయి. వీటిలో అత్యంత పవిత్రమైన నాలుగు ఏకాదశుల్లో వైకుంఠ ఏకాదశి ఒకటి. ఈ సంవత్సరంలో వైకుంఠ ఏకాదశి ఈ సంవత్సరం జనవరి 10 (శుక్రవారం) వైకుంఠ ఏకాదశిని జరుపుకుంటున్నారు. ఈ రోజు శ్రీమహావిష్ణువు భక్తులు విశేష పూజలు, ఉపవాసం ద్వారా భగవంతుని ఆశీర్వాదం పొందుతారు. పౌరాణిక ప్రాముఖ్యత. రాసురుని కథ కృతయుగంలో మురాసురుడు అనే రాక్షసుడు దేవతలు, సాధువులను హింసిస్తూ భయాందో...
ACB | ఏసీబీ ఎదుట కేటీఆర్‌… విచార‌ణ‌కు హాజ‌రు
State

ACB | ఏసీబీ ఎదుట కేటీఆర్‌… విచార‌ణ‌కు హాజ‌రు

భారతీయ రాష్ట్రీయ సమితి (BRS) కార్య‌నిర్వాహ‌క అధ్య‌క్షుడు, మాజీ మంత్రి కేటీ రామారావు (KTR) అవినీతి నిరోధక సంస్థ‌ (ACB) ఎదుట హాజ‌ర‌య్యారు. ఫార్ములా -ఈ అక్రమాల కేసులో ఆయ‌న్ను ఏసీబీ ప్ర‌శ్నించ‌నుంది. అవినీతి నిరోధక చట్టం, క్రిమినల్ మిసాప్రోప్రియేషన్, క్రిమినల్ మిస్‌కండక్ట్, క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్, క్రిమినల్ కన్‌స్పిరసీకి సంబంధించిన IPC సెక్షన్ల కింద కేసుల‌ను కేటీఆర్ (KT Rama Rao) ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వ ఖజానాకు సుమారు ₹55 కోట్ల నష్టం కలిగించాయని ప్ర‌ధాన ఆరోప‌ణ‌ల నేప‌థ్యంలో ఆయ‌న‌పై ఈ కేసులు న‌మోద‌య్యాయి. న్యాయవాది తోడుగా రాగా.. విచార‌ణ స‌మ‌యంలో కేటీఆర్ తరఫు న్యాయవాదిని హైకోర్టు అనుమతించింది. అయితే.. ఏసీబీ ప్ర‌శ్నించే స‌మ‌యంలో న్యాయవాది జోక్యం అవ‌స‌రం లేద‌ని కోర్టు స్పష్టం చేసింది. దూరం నుంచి చూసేందుకు మాత్ర‌మే అనుమతి ఉంటుంది. ఈ నేప‌థ్యంలో కేటీఆర్ త‌ర‌ఫున ఏసీబీ కార్యాల‌యానికి ప్ర‌...
Tirumala Stampede : తిరుమలలో తీవ్ర విషాదం.. క్యూ లైన్లో తొక్కిసలాట, నలుగురు మృతి
State

Tirumala Stampede : తిరుమలలో తీవ్ర విషాదం.. క్యూ లైన్లో తొక్కిసలాట, నలుగురు మృతి

Tirumala Stampede : తిరుమలలో వేంకటేశ్వరస్వామిని వైకుంఠద్వార దర్శనం చేసుకునేందుకు టోకెన్ల కోసం భక్తులు పోటెత్తారు. క్యూ లైన్లు రద్దీగా మార‌డంతో పద్మావతిపురం టోకెన్ల జారీ కేంద్రం దగ్గర తొక్కిసలాట జరిగింది. ఈఘటనలో మల్లిక అనే మహిళా భక్తురాలితో పాటు మరో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. మరో నలుగురు గాయపడ్డారు. గాయపడిన వారిని రుయా ఆసుపత్రికి తరలించారు. చనిపోయిన భక్తురాలు సేలంకు చెందిన మహిళగా పోలీసులు గుర్తించారు. Tirumala Stampede : దర్శనం కోసం వచ్చి.. వైకుంఠ ద్వార దర్శనం టికెట్లు కోసం తిరుపతిలో పలుచోట్ల టికెట్ల కేంద్రాల వద్ద పెద్ద‌ సంఖ్యలో భక్తులు ఉదయం నుంచి నిరీక్షిస్తున్నారు. అయితే బైరాగి పట్టిడ పార్కు వద్ద క్యూలోకి భక్తులను అనుమతించిన వెంటనే భక్తుల మధ్య‌ తోపులాట జ‌రిగింది. ఈ క్ర‌మంలో కొంద‌రు అస్వస్థతకు గురయ్యారు. శ్రీనివాసం వద్ద తొక్కిసలాట జరిగగా అక్క‌డ‌ మల్లిక అనే మహిళతో పాటు మరో ముగ్గురు...
Sankranti Festival : సంక్రాంతికి హన్మకొండ-ఉప్పల్ మధ్య 660 ప్రత్యేక బస్సులు
State

Sankranti Festival : సంక్రాంతికి హన్మకొండ-ఉప్పల్ మధ్య 660 ప్రత్యేక బస్సులు

Hanamkonda : సంక్రాంతి సెల‌వులను (Sankranti Festival ) సంద‌ర్భంగా ప్ర‌యాణికుల ర‌ద్దీని దృష్టిలో ఉంచుకొని తెలంగాణ ఆర్టీసీ ప్ర‌త్యేక‌ చ‌ర్య‌లు చేపట్టింది. పండుగల సందర్భంగా స్వగ్రామాలకు వెళ్లే ప్రజలకు సురక్షితమైన ప్రయాణాన్ని అందించేందుకు టీజీఎస్‌ఆర్‌టీసీ హన్మకొండ-ఉప్పల్ మధ్య 660 ప్రత్యేక బస్సులను నడపనుంది. అందుబాటులోకి ఎల‌క్ట్రిక్ బ‌స్సులు వరంగల్ రీజినల్ మేనేజర్ (Warangal RTC RM) డి.విజయభాను తెలిపిన వివరాల ప్రకారం.. కొత్తగా ప్రవేశపెట్టిన ఎలక్ట్రిక్ బస్సులను ప్రయాణికుల సౌకర్యార్థం ఉప్పల్-హన్మకొండ మార్గంలో కూడా నడుపుతామని వెల్ల‌డించారు. ప్రయాణికుల సౌకర్యార్థం అన్ని ప్రధాన బస్ స్టేషన్లలో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసి ప్రయాణికులకు దిశానిర్దేశం చేసేందుకు సూపర్ వైజర్లను నియమించారు. Sankranti Festival : బస్ స్టాపుల వద్ద ప్రత్యేక ఏర్పాట్లు సంక్రాంతి పర్వదినం (Sankranti Festival) సందర్భంగ...
Telangana Jails : 2024లో తెలంగాణ జైళ్లలకు 41,138 మంది ఖైదీలు..
State

Telangana Jails : 2024లో తెలంగాణ జైళ్లలకు 41,138 మంది ఖైదీలు..

Telangana Jails : తెలంగాణలోని వివిధ జైళ్లలకు 2024వ సంవత్సరంలో రాష్ట్రవ్యాప్తంగా 2875 మంది మహిళలతో సహా 41,138 మంది ఖైదీలను తరలించారు. వివిధ జైళ్లలో చేరిన వారిలో 30,153 మంది అండర్‌ట్రయిల్‌లు ఉన్నారు. ఎన్‌డిపిఎస్ కేసుల్లో ప్రమేయం ఉన్నట్లు ఆరోపణలు వచ్చిన తర్వాత జైళ్లలో చేరిన ఖైదీల సంఖ్య దాదాపు రెట్టింపు అయింది. ఇందులో 312 మంది మహిళలు సహా 6311 మంది ఉన్నారు. Telangana Jails : ఖైదీల్లో పరివర్తనకు చర్యలు జైళ్ల శాఖ డైరెక్టర్ జనరల్ (జైళ్లు) సౌమ్య మిశ్రా మాట్లాడుతూ ఖైదీలను సంస్కరించి వారిని సమాజంతో కలిపేసేందుకు జైళ్ల శాఖ అన్ని చర్యలు తీసుకుంటోందన్నారు. జైళ్ల శాఖ చిన్న పరిశ్రమలను నడుపుతోందని, ఇక్కడ ఖైదీలు వివిధ వృత్తులలో శిక్షణ పొందుతున్నారని, తద్వారా విడుదలైన తర్వాత వారు కొంత పని పొంది జీవనోపాధి పొందుతారని ఆమె అన్నారు. తెలంగాణ జైళ్ల (Telangana Jails)లో మాజీ ఖైదీలు పనిచేస్తున్న రాష్ట్రంలోని వ...
error: Content is protected !!