Minister Ponguleti : హామీలు అమలు చేయలేకపోతున్నాం… మంత్రి శ్రీనివాసరెడ్డి
Minister Ponguleti తన పదేళ్ల పాలనలో కేసీఆర్ చేసిన ఆర్థిక దోపిడీ వల్లే సంక్షేమ పథకాల అమల్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి కాస్త ఆలస్యమవుతోందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. కేసీఆర్ చేసిన అప్పులకు వడ్డీలు కట్టడమే సరిపోతోందని వ్యాఖ్యానించారు. ఖమ్మంలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు.
ఖజానాను ఖాళీ చేశారు..
ప్రజలకు ఇచ్చిన హామీల్లో కొన్ని అమలు చేయలేకపోయామనే విషయం వాస్తవమేనని మంత్రి శ్రీనివాసరెడ్డి (Minister Ponguleti Srinivas Reddy) అన్నారు. దీనికి గత ప్రభుత్వమే కారణమని ఆరోపించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే నాటికి బీఆర్ఎస్ ప్రభుత్వం ఏమీ మిగల్చలేదని విమర్శించారు. రాష్ట్ర ఖజానాను ఆ ప్రభుత్వం ఖాళీ చేసిందని, పైగా అప్పులు మిగిల్చిందని దుయ్యబట్టారు. ఆ అప్పులకు సంబంధించి వడ్డీలు కట్టేందుకే తెలంగాణ ఆర్థిక వనరులు సరిపోవడం లేదని ఆరోపించారు....




