Sarkar Live

Privacy Policy

Accident | మ‌రో  ఘోర రోడ్డు ప్ర‌మాదం.. 19 మంది దుర్మ‌ర‌ణం
National, Crime

Accident | మ‌రో ఘోర రోడ్డు ప్ర‌మాదం.. 19 మంది దుర్మ‌ర‌ణం

Jaipur road Accident | జైపూర్‌లోని హర్మాడలో సోమవారం మధ్యాహ్నం ఒక డంపర్ ట్రక్కు బీభత్సం సృష్టించింది. మద్యం మత్తులో ఉన్న ట్రక్కు డ్రైవర్​ అతివేగంగా నడుపుతూ ముందున్న అనేక వాహనాలను ఢీకొట్టుకుంటూ వెళ్లాడు. ఈ ఘటనలో సుమారు 19 మంది మృతిచెందినట్లు తెలుస్తోంది. ఇంకా అనేక మంది గాయపడ్డారు. ఖాళీ డంపర్ రోడ్ నంబర్ 14 నుండి లోహా మండి పెట్రోల్ పంప్ వైపు వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. దాదాపు 300 మీటర్ల విస్తీర్ణంలో ఒకదాని తర్వాత ఒకటి వాహనాలను ఢీకొట్టడం ప్రారంభించింది. గాయపడిన వారిని చికిత్స కోసం స్థానిక‌ ఆసుపత్రికి తరలించారు వారిలో చాలా మంది పరిస్థితి విషమంగా ఉంది. ప్రమాదం జరిగిన సమయంలో రోడ్డుపై సాధారణ ట్రాఫిక్ ఉందని, కానీ అకస్మాత్తుగా ఒక డంపర్ మితిమీరిన వేగంతో వచ్చి కారును ఢీకొట్టిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. వ‌రుస‌గా మూడు కిలోమీట‌ర్ల మేర ముందున్న వాహనాల‌ను ఢీకొట్టుకుంటూ వెళ్లింద‌ని.తెలిపారు. ర...
చేవెళ్లలో ఘోర రోడ్డు ప్రమాదం – ఆర్టీసీ బస్సును టిప్పర్ ఢీకొట్టి 21 మంది మృతి – Chevella Road Accident
Crime

చేవెళ్లలో ఘోర రోడ్డు ప్రమాదం – ఆర్టీసీ బస్సును టిప్పర్ ఢీకొట్టి 21 మంది మృతి – Chevella Road Accident

Chevella Road Accident | హైద‌రాబాద్‌, బీజాపూర్ జాతీయ ర‌హ‌దారిలో రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. సోమవారం ఉదయం చేవెళ్ల మండలం మీర్జాగూడ సమీపంలో తాండూరు నుంచి హైదరాబాద్‌ వెళ్తున్న ఆర్టీసీ బస్సును కంకర లోడుతో వెళ్తున్న టిప్పర్ బలంగా ఢీకొట్టింది. ఈ ప్ర‌మాదంలోఇద్దరు డ్రైవర్లు సహా 21 మంది ప్రాణాలు కోల్పోయారు. మరికొందరు ప్రయాణికులు తీవ్రంగా గాయాల పాల‌య్యారు. బస్సుపై కంకర లోడు పడిపోవడంతో పలువురు ప్రయాణికులు అందులోనే కూరుకుపోయారు. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని మూడు జేసీబీలతో సహాయక చర్యలు చేప‌ట్టారు. కంకరలో కూరుకుపోయిన వారిని జాగ్ర‌త్త‌గా బయటకు తీస్తున్నారు. ఇప్పటివరకు 15 మందిని బస్సులో నుంచి బయటకు తీశారు. క్షతగాత్రులను చేవెళ్ల ప్రభుత్వ ఆస్ప‌త్రికి తరలించారు. వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. తాండూరు డిపోకు చెందిన ఎక్స్‌ప్రెస్‌ బస్సు తాండూరు నుంచి ...
Paddy Scam | ధాన్యమేది మల్లిఖార్జునా…!
Special Stories

Paddy Scam | ధాన్యమేది మల్లిఖార్జునా…!

సుమారు 4 కోట్ల విలువైన ధాన్యం ఎటుపోయినట్లు? మాయం చేసారా? రికార్డుల్లో చూపించారా? Paddy Scam in Hanumakonda | సుమారు 4 కోట్ల విలువైన ధాన్యం ఆ మిల్లులో ఎందుకు కనిపించట్లేదు.నిజంగా ఆ మిల్లు యాజమాన్యం రికార్డుల్లో ఉన్నట్లుగా అంత ధాన్యం దింపుకుందా ?ఒకవేళ ఆ మిల్లుకు అంత ధాన్యం వస్తే సదరు మిల్లులో ఎందుకు లేదు? అసలు ధాన్యం మిల్లులోకి వచ్చిందా?లేదంటే మిల్లులోకి రాకున్నా రికార్డుల్లో చూపించారా?అసలు ఏంజరిగింది అని పౌరసరఫరాల శాఖ లొనే రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది.ఇదిలా ఉంటే ఇటీవలే హన్మకొండ జిల్లాలో సంచలనం సృష్టించిన "సాంబశివ" మిల్లు వ్యవహారంలో జరిగిన విధంగానే ఇక్కడ కూడా జరిగిందా ?అనే అనుమానాలు వ్యక్తమవుతుండడం గమనార్హం. Paddy Scam : మాయమైందా? రికార్డుల్లో చూపించారా? హన్మకొండ జిల్లా పోచారం గ్రామంలో ఉన్న మల్లిఖార్జున స్వామి రైస్ మిల్లుకు 2024-25రబీ సీజన్ లో పౌర...
Theft Gang | వింత దొంగల ముఠా  గుట్టు ర‌ట్టు – నకిలీ వాంతులతో నగలు దోచే మహిళా గ్యాంగ్
State

Theft Gang | వింత దొంగల ముఠా గుట్టు ర‌ట్టు – నకిలీ వాంతులతో నగలు దోచే మహిళా గ్యాంగ్

Women Theft Gang | విచిత్రమైన మహిళా దొంగల ముఠా సంచలనాన్ని రేపింది. బస్సులు, ఆటోలు వంటి పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్‌లో తోటి మహిళా ప్రయాణికులను నమ్మించి, "వాంతి" చేస్తున్నట్లు నటిస్తూ నగలు, డబ్బులు కాజేస్తున్న ఆరుగురు మహిళలను పోలీసులు అరెస్టు చేశారు. క‌నీవినీ ఎరుగుని రీతిలో కొత్త ర‌హాలో న‌మ్మించి న‌గ‌లు, డ‌బ్బులు కాజేస్తున్న ఆరుగురు సభ్యులతో కూడిన పూర్తిగా మహిళా ముఠా ఉందంతం ఇది. ఈ మ‌హిళ‌ల‌ గుంపు వాంతి చేసుకుంటున్నట్లు నటించి భయాందోళనలకు గురిచేస్తుంటారు. ఆ తర్వాత తోటి ప్ర‌యాణికులు ప‌ర‌ధ్యానంలో ఉండ‌గా వారి బంగారు ఆభరణాలను దొంగిలించి పారిపోతారని అధికారులు వెల్ల‌డించారు. DCP శశాంక్ సింగ్ మాట్లాడుతూ, "వారిలో ఒకరు ఆటోగానీ బ‌స్సుగానీ ప్ర‌యాణిస్తుండ‌గా ఎంతో క‌లివిడిగా ప్ర‌వ‌ర్తిస్తూ క‌లివిడిగా మాటల్లో దింపుతారు. అందులో ఒకరు వికారం వచ్చినట్లు నటించి దుపట్టా లేదా పాలిథిన్ బ్యాగ్‌లోకి 'వాంతి' చేయడం ప్ర...
Vikarabad | వికారాబాద్ జిల్లాలో దారుణం – భార్య, వదిన, కూతురిపై కత్తితో దాడి చేసి ఆత్మహత్య
Crime

Vikarabad | వికారాబాద్ జిల్లాలో దారుణం – భార్య, వదిన, కూతురిపై కత్తితో దాడి చేసి ఆత్మహత్య

Vikarabad Tragic Incident | వికారాబాద్ జిల్లా కులకచర్ల మండల కేంద్రంలో దారుణ ఘ‌ట‌న‌ చోటుచేసుకుంది. కుటుంబ కలహాలతో ఓ వ్యక్తి త‌న‌ భార్య, వదిన, కూతురిని హత్య చేసి, తానూ ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వివరాల్లోకెళితే కులకచర్లకు చెందిన వేపూరి యాదయ్య ఆదివారం తెల్లవారు జామున ఇంట్లో నిద్రిస్తున్న భార్య అలివేలు (32), కుమార్తెలు అపర్ణ (13), శ్రావణి (10), వదిన హనుమమ్మ (40)ల పై కత్తితో కిరాతకంగా దాడి చేసి బ‌లిగొన్నాడు. ఆపై అత‌డూ ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ దాడితో గాయాలపాలై ప్రాణాలతో బయటపడిన‌ యాదయ్య పెద్ద కూతురు అపర్ణ త‌రుకొని ఇరుగుపొరుగువారికి చెప్పింది. స్థానికులు వచ్చి చూసేసరికి భార్య, వదిన, చిన్న కుమార్తెతో పాటు యాదయ్య మృతదేహాలు క‌నిపించాయి. స్థానికులు కులకచర్ల పోలీసుల‌కు సమాచారమిచ్చారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్న గాయాలతో విల‌విల‌లాడుతున్న అపర్ణను ఆస్పత్రికి తరలించారు. ప...
error: Content is protected !!