Sarkar Live

Privacy Policy

సురక్షిత ప్రయాణం ఆటో డ్రైవర్ల బాధ్యత: వరంగల్ సీపీ సన్ ప్రీత్ సింగ్
warangal

సురక్షిత ప్రయాణం ఆటో డ్రైవర్ల బాధ్యత: వరంగల్ సీపీ సన్ ప్రీత్ సింగ్

ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చడం ఆటో డ్రైవర్ల ప్రధాన బాధ్యత అని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ అన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన “ఆరైవ్ అలైవ్” (Arrive Alive) కార్యక్రమంలో భాగంగా, నేడు కాజీపేట రైల్వే ఆడిటోరియంలో ఆటో డ్రైవర్లకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ.. ఈ నెల 31వ తేదీ వరకు ఈ ప్రత్యేక డ్రైవ్ కొనసాగుతుందని తెలిపారు. డ్రైవర్లు అతివేగం, నిర్లక్ష్యపు డ్రైవింగ్ వీడాలని, మద్యం సేవించి వాహనాలు నడపరాదని హెచ్చరించారు. మితిమీరిన ప్రయాణికులను ఎక్కించుకోవద్దని, ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ ప్రమాదాల నివారణకు సహకరించాలని కోరారు. అనంతరం రోడ్డు భద్రతా నియమాలను పాటిస్తామని డ్రైవర్లతో ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమంలో సెంట్రల్ జోన్ డిసిపి దార కవిత, ట్రాఫిక్ అదనపు డీసీపీ ప్రభాకర్ రావు, ఏసీపీలు సత్యనారాయణ, ప్రశాంత్ రెడ్...
ప్లాస్టిక్ రహిత సమాజం కోసం కృషి చేయాలి: ఎన్.ఎస్.ఎస్ కో ఆర్డినేటర్ ప్రొఫెసర్ ఈసం నారాయణ
warangal

ప్లాస్టిక్ రహిత సమాజం కోసం కృషి చేయాలి: ఎన్.ఎస్.ఎస్ కో ఆర్డినేటర్ ప్రొఫెసర్ ఈసం నారాయణ

సమాజాన్ని పట్టిపీడిస్తున్న ప్లాస్టిక్ మహమ్మారిని తరిమికొట్టడానికి ఎన్.ఎస్.ఎస్ వాలంటీర్లు నడుం బిగించాలని ఎన్.ఎస్.ఎస్ ప్రోగ్రాం కో ఆర్డినేటర్ ప్రొఫెసర్ ఈసం నారాయణ పిలుపునిచ్చారు. హన్మకొండ పరిధిలోని న్యూశాయంపేట పోచంపల్లిలో, తెలంగాణ సాంఘీక సంక్షేమ గురుకుల మహిళా డిగ్రీ కళాశాల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఎన్.ఎస్.ఎస్ ప్రత్యేక శిబిరం బుధవారం రెండో రోజుకు చేరుకుంది. ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ ఇనుగాల రాధిక నేతృత్వంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో 50 మంది వాలంటీర్లు ఉత్సాహంగా పాల్గొన్నారు. హోరెత్తిన నినాదాలు - అవగాహన ర్యాలీ శిబిరంలో భాగంగా వాలంటీర్లు గ్రామంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు ప్లాస్టిక్ వల్ల కలిగే నష్టాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. "ప్లాస్టిక్ భూతాన్ని నిర్మూలిద్దాం - పచ్చదనాన్ని పెంచుదాం" "ప్లాస్టిక్ వద్దు - ప్రాణాలు ముద్దు" "ప్లాస్టిక్ ను నిషేధిద్దాం - పర్యావర...
ప్రతి ఫోటోగ్రాఫర్ సంక్షేమమే లక్ష్యం: కుసుమ రమేష్
warangal

ప్రతి ఫోటోగ్రాఫర్ సంక్షేమమే లక్ష్యం: కుసుమ రమేష్

తెలంగాణ రాష్ట్ర ఫోటో & వీడియో గ్రాఫర్స్ సంక్షేమ సంఘం (TGPVWA) రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా కుసుమ రమేష్  బాధ్యతలు స్వీకరించారు. బుధవారం హన్మకొండ జిల్లా దామెర మండల కేంద్రంలోని రెడీన్ రిసార్ట్ & హోటల్‌లో నిర్వహించిన రాష్ట్ర స్థాయి విస్తృత సమావేశంలో ఆయన ఈ బాధ్యతలను చేపట్టారు. ఫోటోగ్రఫీ మరియు వీడియోగ్రఫీ రంగాల్లో ఆయన చేసిన కృషిని, సంఘం పట్ల ఆయనకు ఉన్న అంకితభావాన్ని గుర్తించి రాష్ట్ర కార్యవర్గం ఈ పదవిని అప్పగించింది. ఈ సందర్భంగా సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు ఎస్. వెంకట్ రెడ్డి, రాష్ట్ర అధ్యక్షులు ఎస్.కే. హుస్సేన్, ప్రధాన కార్యదర్శి లడే రవి మాట్లాడుతూ.. కుసుమ రమేష్ వంటి క్రియాశీలక నాయకుడు రాష్ట్ర కార్యవర్గంలో చేరడం వల్ల సంఘం మరింత బలోపేతం అవుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. ఫోటోగ్రాఫర్ల సమస్యల పరిష్కారంలో ఆయన ముందుంటారని వారు ఆశాభావం వ్యక్తం చేశారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం కుసుమ రమేష్ మాట్లాడుత...
“పార్టీ నీ ఒక్కడిదేనా?”: సీఎం రేవంత్‌పై నిప్పులు చెరుగుతూ కాంగ్రెస్‌కు జీవన్ రెడ్డి రాంరాం!
Hyderabad

“పార్టీ నీ ఒక్కడిదేనా?”: సీఎం రేవంత్‌పై నిప్పులు చెరుగుతూ కాంగ్రెస్‌కు జీవన్ రెడ్డి రాంరాం!

తెలంగాణ రాజకీయాల్లో పెను సంచలనం నమోదైంది. దశాబ్దాలుగా కాంగ్రెస్ జెండాను మోసిన సీనియర్ నేత, ఎమ్మెల్సీ టి. జీవన్ రెడ్డి ఆ పార్టీకి షాకింగ్ నిర్ణయం ప్రకటించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ, కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి మరియు తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ పరిణామం రాష్ట్ర రాజకీయాల్లో పెను దుమారం రేపుతోంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇక్కడ ఉన్నాయి:  కాంగ్రెస్ కు 'జీవన్' మరణశాసనం: రేవంత్ రెడ్డిపై నిప్పులు! జగిత్యాల కేంద్రంగా సాగిన ఈ రాజకీయ పరిణామాల్లో జీవన్ రెడ్డి అత్యంత ఘాటుగా స్పందించారు. పార్టీలో జరుగుతున్న పరిణామాలపై ఆయన తన అనుచరుల సమక్షంలో కన్నీటి పర్యంతమయ్యారు.  ప్రధాన అభ్యంతరాలు & విమర్శలు: పార్టీ నీ ఒక్కడిదే అనుకుంటున్నవా?ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఉద్దేశించి జీవన్ రెడ్డి సంచలన వ్యా...
సంక్షోభంలో ‘అన్నపూర్ణ’ వెన్నెముక–రైస్ మిల్లర్ల ఆవేదన!
Fatafat_with_pr

సంక్షోభంలో ‘అన్నపూర్ణ’ వెన్నెముక–రైస్ మిల్లర్ల ఆవేదన!

తెలంగాణ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా నిలిచే రైస్ మిల్లింగ్ పరిశ్రమ నేడు కుప్పకూలే స్థితికి చేరుకుంది. అన్నదాత పండించిన ప్రతి గింజను బియ్యంగా మార్చి కోట్లాది మంది ఆకలి తీర్చే ఈ పరిశ్రమ, ఇప్పుడు ప్రభుత్వ నిర్లక్ష్యానికి, అశాస్త్రీయ నిబంధనలకు బలైపోతోంది. ముఖ్యంగా వరంగల్ జిల్లాలో వేల కుటుంబాలకు ఉపాధి కల్పిస్తున్న ఈ రంగాన్ని '25 శాతం పెనాల్టీ' భూతం వెంటాడుతోంది. నిలువునా ముంచుతున్న పెనాల్టీలు: ఇది జరిమానా కాదు.. మరణశాసనం! ప్రకృతి వైపరీత్యాలు, సాంకేతిక లోపాలు లేదా ఎఫ్.సి.ఐ (FCI) వద్ద జరిగే జాప్యం వల్ల సీఎంఆర్ (CMR) డెలివరీలో స్వల్ప జాప్యం జరిగితే, ప్రభుత్వం విధిస్తున్న 25 శాతం భారీ పెనాల్టీ మిల్లర్ల పాలిట ఉరితాడుగా మారుతోంది. 2014 నుండి పేరుకుపోయిన కోట్ల రూపాయల బకాయిలు ఒకవైపు, పెరిగిన బ్యాంకు వడ్డీలు మరోవైపు మిల్లర్లను ఆత్మహత్యల దిశగా నెడుతున్నాయి. ప్రభుత్వం నుండి మాకు రావాల్సిన బకాయిలు చె...
error: Content is protected !!