Sarkar Live

Privacy Policy

Vikarabad | వికారాబాద్ జిల్లాలో దారుణం – భార్య, వదిన, కూతురిపై కత్తితో దాడి చేసి ఆత్మహత్య
Crime

Vikarabad | వికారాబాద్ జిల్లాలో దారుణం – భార్య, వదిన, కూతురిపై కత్తితో దాడి చేసి ఆత్మహత్య

Vikarabad Tragic Incident | వికారాబాద్ జిల్లా కులకచర్ల మండల కేంద్రంలో దారుణ ఘ‌ట‌న‌ చోటుచేసుకుంది. కుటుంబ కలహాలతో ఓ వ్యక్తి త‌న‌ భార్య, వదిన, కూతురిని హత్య చేసి, తానూ ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వివరాల్లోకెళితే కులకచర్లకు చెందిన వేపూరి యాదయ్య ఆదివారం తెల్లవారు జామున ఇంట్లో నిద్రిస్తున్న భార్య అలివేలు (32), కుమార్తెలు అపర్ణ (13), శ్రావణి (10), వదిన హనుమమ్మ (40)ల పై కత్తితో కిరాతకంగా దాడి చేసి బ‌లిగొన్నాడు. ఆపై అత‌డూ ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ దాడితో గాయాలపాలై ప్రాణాలతో బయటపడిన‌ యాదయ్య పెద్ద కూతురు అపర్ణ త‌రుకొని ఇరుగుపొరుగువారికి చెప్పింది. స్థానికులు వచ్చి చూసేసరికి భార్య, వదిన, చిన్న కుమార్తెతో పాటు యాదయ్య మృతదేహాలు క‌నిపించాయి. స్థానికులు కులకచర్ల పోలీసుల‌కు సమాచారమిచ్చారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్న గాయాలతో విల‌విల‌లాడుతున్న అపర్ణను ఆస్పత్రికి తరలించారు. ప...
Colleges Bandh | 3 నుంచి ప్రైవేట్‌ కాలేజీల నిరవధిక బంద్‌
State, Hyderabad

Colleges Bandh | 3 నుంచి ప్రైవేట్‌ కాలేజీల నిరవధిక బంద్‌

ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై యాజమాన్యాల అల్టిమేటం హైదరాబాద్‌ : రాష్ట్ర ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిల చెల్లింపులపై వెంట‌నే నిర్ణయం తీసుకోకపోతే నవంబర్‌ 3 నుంచి రాష్ట్రవ్యాప్తంగా ప్రైవేట్‌ కాలేజీలు నిరవధికంగా బంద్ (Colleges Bandh ) చేస్తామ‌ని ఉన్నత విద్యాసంస్థల సమాఖ్య ఛైర్మన్‌ రమేష్‌ బాబు ప్రకటించారు. హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, “గత ఆరు నెలలుగా ప్రభుత్వంతో చర్చలు జరిపినా ఎటువంటి స్పష్టమైన నిర్ణయం రాలేద‌ని తెలిపారు. మొత్తం రూ.1,200 కోట్ల బకాయిల్లో ప్రభుత్వం ఇప్పటివరకు కేవలం రూ.300 కోట్లు మాత్రమే చెల్లించింద‌ని చెప్పారు. మిగిలిన రూ.900 కోట్లు దీపావళికి ముందు ఇవ్వాలని కోరామ‌ని కానీ, ఇప్ప‌టివ‌ర‌కు చెల్లించ‌లేద‌ని ఆయ‌న పేర్కొన్నారు.కాగా నవంబర్‌ 2 లోపు ప్రభుత్వం చెల్లింపులపై స్పష్టమైన నిర్ణయం ప్రకటించకపోతే, నవంబర్‌ 3 నుంచి రాష్ట్రంలోని అన్ని వృత్తి విద్యా...
కాశీబుగ్గ తొక్కిస‌లాట‌ ఘటనకు కార‌ణాలివే.. – Kasibugga temple stampede
State, AndhraPradesh

కాశీబుగ్గ తొక్కిస‌లాట‌ ఘటనకు కార‌ణాలివే.. – Kasibugga temple stampede

Kasibugga temple stampede | శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలోని వెంకటేశ్వర స్వామి ఆలయంలో జరిగిన తొక్కిసలాట ఘటనతో తీవ్ర‌ విషాదం అలుముకుంది. శనివారం ఉదయం సుమారు 11.45 గంటల సమయంలో జరిగిన ఈ ప్రమాదంలో 9 మంది భక్తులు ప్రాణాలు కోల్పోగా, మరో 20 మంది తీవ్రంగా గాయపడ్డారు.క్షత‌గాత్రుల‌ను సమీపంలోని పలాస ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండటంతో వారిని టెక్కలిలోని హాస్పిట‌ల్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఘటనా స్థలంలో ఏడుగురు మరణించగా, హాస్పట‌ల్‌లో చికిత్స పొందుతున్న ఇద్దరు తర్వాత మరణించినట్లు అధికారులు తెలిపారు. ప్ర‌మాదానికి కార‌ణాలేంటి? ప్రాథమిక సమాచారం ప్రకారం, ఆలయంలోని రెయిలింగ్ ఒక్కసారిగా విరిగిపడటంతో తొక్కిసలాట జరిగిందని అధికారులు వెల్ల‌డంచారు. ఒక్క‌సారిగా పెద్దఎత్తున భక్తులు క్యూలోకి రావడంతో ఈ విషాదం చోటుచేసుకుంది. అనుమతుల్లేకుండా ఏర్పాట్లు ఈ ఘటనపై ఏపీ స‌ర్కారు త...
గురుకుల పాఠ‌శాల‌లో ఫుడ్‌పాయిజ‌న్‌.. ముగ్గురు విద్యార్థులు ఆసుపత్రి పాలు ‌‌ – Food Poisoning
State

గురుకుల పాఠ‌శాల‌లో ఫుడ్‌పాయిజ‌న్‌.. ముగ్గురు విద్యార్థులు ఆసుపత్రి పాలు ‌‌ – Food Poisoning

Jogulamba Gadwal : ఐజా మండలం షేక్‌పల్లిలోని ఎస్సీ రెసిడెన్షియల్ పాఠ‌శాల‌-క‌ళాశాల‌లో శనివారం ఫుడ్ పాయిజనింగ్ (Food Poisoning) తో పలువురు విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. శ్రీనివాస్ (ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం), అఖిలేష్‌ (ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం) భరత్ (ఇంటర్మీడియట్ రెండవ సంవత్సరం) ముగ్గురు విద్యార్థులను చికిత్స కోసం పట్టణంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి తరలించారు. వారికి ఉద‌యం అల్పాహారంగా జీరా రైస్ వడ్డించినట్లు సమాచారం. పాఠశాల సిబ్బంది, స్థానిక పోలీసులు వెంటనే బాధిత విద్యార్థులను ఆసుపత్రికి తరలించారు. యాదృచ్ఛికంగా, ఈ పాఠశాల ధర్మవరంలోని బీసీ హాస్టల్ నుండి కేవలం 15 కిలోమీటర్ల దూరంలో ఉంది, శుక్రవారం రాత్రి ఫుడ్ పాయిజనింగ్ కారణంగా 50 మందికి పైగా విద్యార్థులు ఆసుపత్రి పాలయ్యారు. తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి.  అలా...
IAS transfers | రాష్ట్రంలో పలువురు ఐఎఎఎస్‌ల బదిలీ
State, Hyderabad

IAS transfers | రాష్ట్రంలో పలువురు ఐఎఎఎస్‌ల బదిలీ

Hyderabad | తెలంగాణ రాష్ట్రంలో పలువురు ఐఏఎస్‌ అధికారులు బదిలీ (IAS transfers) అయ్యారు. ఎనిమిది మంది ఐఏఎస్‌ అధికారుల‌కు స్థాన‌చ‌న‌లం క‌ల్పిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు శుక్ర‌వారం ఉత్తర్వులు జారీ చేశారు. అభివృద్ధి సంక్షేమ పనుల అమలు విభాగం ప్రత్యేక కార్యదర్శిగా సైదులుకు అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ఉత్తర్వులు విడుదల చేశారు. ప్లాగ్‌షిప్‌ అభివృద్ధి, సంక్షేమ పనుల అమలు విభాగం ప్రత్యేక సీఎస్‌గా సవ్యసాచి ఘోష్‌ ‌నియమితులయ్యారు. సంక్షేమశాఖ ప్రత్యేక సీఎస్‌గానూ ఆయన కొనసాగనున్నారు. గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి, కమిషనర్‌గా అనితా రామచంద్రన్‌కు అదనపు బాధ్యతలను ప్రభుత్వం అప్పగించింది. రవాణాశాఖ కమిషనర్‌గా కె.ఇలంబర్తిని నియమించిన ప్రభుత్వం.. పశుసంవర్థక శాఖ కార్యదర్శిగా అదనపు బాధ్యతలను ఆయనకు కేటాయించింది. మెట్రోపాలిటన్‌ అర్బన్‌ ‌డెవలప్‌మెంట్‌ ‌కార్యదర్శి బాధ్యతలు సీఎస్‌ ‌వద్దే ఉంచింది.ఇక జీఏడ...
error: Content is protected !!