Sarkar Live

Privacy Policy

Konda Sushmitha | మమ్మల్ని వదిలేయమని రేవంత్ కాళ్లు ప‌ట్టుకోవాలా? – కొండా సురేఖ కూతురు సుశ్మిత ఫైర్
State, warangal

Konda Sushmitha | మమ్మల్ని వదిలేయమని రేవంత్ కాళ్లు ప‌ట్టుకోవాలా? – కొండా సురేఖ కూతురు సుశ్మిత ఫైర్

Telangana : సీఎం రేవంత్ రెడ్డిపై మంత్రి కొండా సురేఖ (Konda Surekha) కూతురు సుశ్మిత (Konda Sushmitha) మ‌రోసారి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. మ‌మ్మ‌ల్ని వ‌దిలేయండ‌ని రేవంత్ రెడ్డి కాళ్లు ప‌ట్టుకొని మొక్కాలా..? అని ప్ర‌శ్నించారు. ముఖ్య‌మంత్రి మా అమ్మను ఇష్టమొచ్చినట్లు తిట్టేవాడు. దిల్లీలో ఖర్గేతో స‌మావేశంలో మా అమ్మను రేవంత్ రెడ్డి (CM Revanth Reddy ) తిడితే ఆరోజు మా అమ్మ ఎంతో ఏడ్చింద‌ని సుష్మిత తెలిపారు. తెలంగాణ‌లో రేవంత్ రెడ్డి సోద‌రులు మొత్తం భూములను ఆక్ర‌మిస్తున్నారు. మంచిరేవులలో విల్లాలు కట్టుకున్న కొందరు వ్యక్తులు దారి కోసం దేవాదాయ‌శాఖ భూమిని అడిగారు.. దీనిప ప్ర‌శ్నిస్తే దానికి బ‌దులుగా పక్కన ప్రైవేట్ భూమి ఇస్తామని అన్నారు. ఈ ఫైల్ మీద కొండా సురేఖ సంతకం చేస్తే, జపాన్‌లో ఉన్న రేవంత్ రెడ్డి ఆ ఫైల్‌ను ఆపించాడు. ఎందుకంటే రేవంత్ రెడ్డి తమ్ముళ్లు ఆ భూములను కబ్జా చేయాలని చూస్తున్నారు.. అందుకే మా...
Diwali Celebration | పర్యావరణహిత దీపావళి కోసం గ్రీన్ క్రాకర్స్‌ — మీ చిన్న నిర్ణయం.. పెద్ద మార్పు!
LifeStyle

Diwali Celebration | పర్యావరణహిత దీపావళి కోసం గ్రీన్ క్రాకర్స్‌ — మీ చిన్న నిర్ణయం.. పెద్ద మార్పు!

Diwali Celebration 2025 -Eco-friendly Fireworks | దీపావళి సందర్భంగా ఢిల్లీ-ఎన్‌సిఆర్ అంతటా గ్రీన్ క్రాక‌ర్స్‌ (Green Crackers) అమ్మకాలు, వినియోగానికి సంబంధించి గ‌త బుధవారం అనుమతిచ్చిన విష‌యం తెలిసిందే.. దేశ రాజధాని అంతటా ప్రజలు అక్టోబర్ 18 నుండి 21 వరకు ఈ బాణసంచా కాల్చవచ్చు. అంతేకాకుండా, అక్టోబర్ 18 నుండి వాయు నాణ్యత సూచికను పర్యవేక్షించాలని కేంద్ర కాలుష్య నియంత్రణ బోర్డు, ఎన్‌సిఆర్‌లోని రాష్ట్ర పిసిబిలను సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ చర్యపై ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖ గుప్తా హ‌ర్షం వ్యక్తం చేశారు మరియు ఈ విషయంలో ఢిల్లీ ప్రభుత్వం చేసిన విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకున్నందుకు సుప్రీంకోర్టుకు ధన్యవాదాలు తెలిపారు. Diwali Celebration : అస‌లు గ్రీన్ క్రాకర్స్ అంటే ఏమిటి? గ్రీన్ క్రాకర్స్ అనేవి సంప్రదాయ బాణసంచాకు పర్యావరణప‌రంగా అనుకూలమైన ప్రత్యామ్నాయాలు. ఇవి వాయు, శబ్ద కాలుష్యాన్ని తగ్గించడానికి ప...
HAM roads | హ్యామ్‌ రోడ్లకు నేడు టెండర్‌ నోటిఫికేషన్‌ విడుదల!
State

HAM roads | హ్యామ్‌ రోడ్లకు నేడు టెండర్‌ నోటిఫికేషన్‌ విడుదల!

Hyderabad : రాష్ట్ర ప్రభుత్వం హైబ్రిడ్‌ యాన్యుటీ మోడ్‌ (హ్యామ్‌) ప్రాజెక్ట్‌ను అమలు చేస్తూ గ్రామీణ రహదారుల అభివృద్ధికి సిద్ద‌మైంది. ఈ ప్రాజెక్టు ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో రవాణా సౌకర్యాలు మెరుగుపడతాయని, దాంతో గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుందని పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క తెలిపారు. మంత్రి సీత‌క్క ప్ర‌కారం.. హ్యామ్‌ ప్రాజెక్టుల (HAM roads) కోసం టెండర్‌ నోటిఫికేషన్ శుక్ర‌వారం విడుదల చేయ‌నున్నారు. మొదటి దశలో 7,449.50 కిలోమీటర్ల పొడవుతో 2,162 రహదారులు నిర్మించనున్నట్లు మంత్రి సీత‌క్క‌ వెల్లడించారు. ఇవి మొత్తం 96 నియోజకవర్గాల పరిధిలో 17 ప్యాకేజీల కింద చేపట్టనున్నారు. ఈ సంద‌ర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ – “హ్యామ్‌ ప్రాజెక్టు ద్వారా తెలంగాణ గ్రామీణ రహదారులు కొత్త దశలోకి ప్రవేశిస్తాయి. జాతీయ, అంతర్జాతీయ రహదారి సంస్థలు ఈ టెండర్లలో పాల్గొనాలని కోరుతున్నాం” అని తెలిప...
మావోయిస్టు అగ్రనేత మల్లోజుల వేణుగోపాల్ లొంగుబాటు — 44 ఏళ్ల అజ్ఞాత జీవనానికి ముగింపు – Mallojula Venugopal Rao
Crime

మావోయిస్టు అగ్రనేత మల్లోజుల వేణుగోపాల్ లొంగుబాటు — 44 ఏళ్ల అజ్ఞాత జీవనానికి ముగింపు – Mallojula Venugopal Rao

Mallojula Venugopal Rao : మావోయిస్టు అగ్ర నేత మల్లోజుల వేణుగోపాల రావు అలియాస్ సోను అలియాస్ భూపతి అలియాస్ అభయ్ అడ‌వి బాట వీడి జనజీవన స్రవంతిలో కలిశారు. బుధవారం తన 60 మంది మావోయిస్టు సహచరులతో కలిసి మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ సమక్షంలో అధికారికంగా లొంగిపోయారు. సీఎం స‌మ‌క్షంలో వీరు తమ ఆయుధాలను పోలీసులకు అప్పగించారు. మల్లోజుల వేణుగోపాల్, ఆయన బృందాన్ని సీఎం ఫడ్నవీస్ జనజీవన స్రవంతిలోకి ఆహ్వానించారు. దాదాపు మావోయిస్టు పార్టీ రెండో అగ్రస్థానంలో ఉన్న మల్లోజుల లొంగుబాటుతో మావోయిస్టు పార్టీకి భారీ న‌ష్టంగా భావిస్తున్నారు. మరోవైపు మావోయిస్టు పార్టీ వైఖరితో అసంతృప్తి వ్య‌క్తంచేస్తూ కొన్ని రోజులుగా మల్లోజుల బహిరంగ లేఖలు రాస్తున్నారు. తాజాగా సంచలన నిర్ణయం తీసుకుని విప్ల‌వోద్య‌మాన్ని వదిలి జనజీవన స్రవంతిలో కలిసిపోయారు. మల్లోజులపై దాదాపు వందకు పైగా కేసులు కూడా ఉన్నాయి. మల్లోజులపై రూ.6 కోట్ల రివార్డ...
హర్యానా ఐపీఎస్ అధికారి ఆత్మహత్య కేసులో కీలక మలుపు.. కేసు దర్యాప్తు చేస్తున్న ఏఎస్ఐ ఆత్మహత్య
Crime

హర్యానా ఐపీఎస్ అధికారి ఆత్మహత్య కేసులో కీలక మలుపు.. కేసు దర్యాప్తు చేస్తున్న ఏఎస్ఐ ఆత్మహత్య

Haryana IPS officer suicide case | హర్యానా పోలీసు అధికారి వై. పురాణ్ కుమార్ మృతి కేసులో ఊహించ‌ని మలుపు తిరిగింది. ఈ కేసు దర్యాప్తు అధికారి రోహ్‌తక్ జిల్లాలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. మృతుడిని సందీప్ కుమార్‌గా గుర్తించారు. ఆయన అసిస్టెంట్ సబ్-ఇన్‌స్పెక్టర్‌గా పనిచేశారు. ఆయన సైబర్ సెల్‌లో విధులు నిర్వర్తిస్తున్నారు.లాధోట్ గ్రామంలోని అతని ఇంటి నుంచి మూడు పేజీల సూసైడ్ నోట్ తోపాటు ఒక వీడియోను స్వాధీనం చేసుకున్నారు. కుమార్ తనను తాను కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడని విశ్వ‌స‌నీయ వర్గాలు తెలిపాయి. ఆ నోట్‌లో, వై. పురాణ్ కుమార్ ఒక "అవినీతి అధికారి" అని, అతనిపై "తగినంత ఆధారాలు" ఉన్నాయని ఆరోపించారు. కుల వివక్ష సమస్యను ఉపయోగించి ఐపీఎస్ అధికారి వ్యవస్థను హైజాక్ చేశారని కూడా ఆయన ఆరోపించారు. "నేను ఎప్పుడూ సత్యం పక్షాన ఉంటాను. స్వాతంత్ర్య పోరాటంలో నా కుటుంబం పాల్గొంది. భగత్ సింగ్‌ను నా ఆదర్శంగా భావ...
error: Content is protected !!