Sarkar Live

Privacy Policy

Nobel Peace Prize 2025 :   వెనిజులా నాయకురాలు మరియా కొరినా మచాడోకు నోబెల్ శాంతి బహుమతి
World

Nobel Peace Prize 2025 : వెనిజులా నాయకురాలు మరియా కొరినా మచాడోకు నోబెల్ శాంతి బహుమతి

Nobel Peace Prize 2025 : 2025 సంవ‌త్స‌రానికి సంబంధించి నోబెల్ బహుమతి విజేతలను ప్రకటించారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కల చెదిరిపోయింది. వెనిజులాకు చెందిన మరియా కొరినా మచాడో (Maria Corina Machado) కు ఈ గౌరవం లభించింది. వెనిజులాలో ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించడానికి ఆమె అవిశ్రాంత పోరాటం చేసినందుకు మరియా కొరినా మచాడోకు నోబెల్ శాంతి పుర‌స్కారం లభించింది. వెనిజులాను నియంతృత్వం నుంచి ప్రజాస్వామ్యానికి మార‌డానికి ఆమె నాయకత్వం, పోరాటాన్ని నోబెల్ కమిటీ ప్రత్యేకంగా హైలైట్ చేసింది. ఆమె ప్రయత్నాలను "ప్రజాస్వామ్య విలువల ప్రపంచ రక్షణకు చిహ్నం"గా నోబెల్ కమిటీ అభివర్ణించింది. ఇది డోనాల్డ్ ట్రంప్ నోబెల్ బహుమతి గెలుచుకోవాలనే కలను చెదరగొట్టింది. నోబెల్ శాంతి బహుమతి గ్రహీత మరియా కొరినా మచాడో గత ఏడాది కాలంగా అజ్ఞాతంలో జీవించాల్సి వచ్చినప్పటికీ తన పోరాటాన్ని కొనసాగించారు. "ఆమె ప్రాణాలకు తీవ్రమైన బెద...
Heavy Rains | వ‌చ్చే నాలుగు రోజులు కుండ‌పోత‌ వ‌ర్షాలు..
State

Heavy Rains | వ‌చ్చే నాలుగు రోజులు కుండ‌పోత‌ వ‌ర్షాలు..

11న బంగాళాఖాతంలో మరో అల్పపీడనం Heavy Rains in Telangana | తెలంగాణ‌లో రాబోయే నాలుగు రోజులు ఉరుములు మెరుపుల‌తో కూడిన భారీ వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం ఒక ప్రకటనలో తెలిపింది. ప్రస్తుతం ఛత్తీస్‌గఢ్‌ నుంచి గల్ఫ్‌ ఆఫ్‌ మన్నార్‌ వరకు తెలంగాణ, ఏపీ మీదుగా ద్రోణి కొనసాగుతోంద‌ని.. దీనికి ఉపరితల ఆవర్తనం తోడైందని వెల్ల‌డించింది. అయితే బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం మరింత బలపడి ఈనెల 11నాటికి అల్పపీడనంగా మారే అవకాశం ఉన్నదని హెచ్చ‌రించింది. దీంతో వచ్చేవారం మళ్లీ కుండపోత వర్షాలు తప్పవని పేర్కొన్నది. ఈమేర‌కు శుక్రవారం భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట, మహబూబాబాద్‌ జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, గంటకు 30 నుంచి 40 కి.మీ వేగంతో ఈదురుగాలులతో కూడిన వర్షాలు (Heavy Rains) కురిసే ప్ర‌మాద‌ముంద‌ని తెలిపింది. ఇక శనివారం, ఆదివారాల్లో భద్రాద్రి-కొత్తగూడెం, ఖమ్మం, నల్లగొండ, సూర...
TG | స్థానిక సంస్థల ఎన్నికలకు బ్రేక్…
State, Hyderabad

TG | స్థానిక సంస్థల ఎన్నికలకు బ్రేక్…

ఎన్నికల నోటిఫికేషన్, జీవో నంబర్ 9పై స్టే విధించిన హైకోర్టు… TG News | తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు (Telangana Local Body Elections) బ్రేక్ పడింది. స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్‌పై స్టే విధిస్తూ హైకోర్టు ఈరోజు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అమలు కోసం ప్రభుత్వం జారీ చేసిన జీవో నంబర్ 9ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్ల‌పై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం సుదీర్ఘ విచారణ చేపట్టింది. బుధ, గురువారాల్లో బీసీ రిజర్వేషన్ల అంశంపై విచారణ చేపట్టిన హైకోర్టు ధర్మాసనం… స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేసేలా ప్రభుత్వం జారీ చేసిన జీవో నంబర్ 9పై స్టే విధించింది. స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్‌పై స్టే విధిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఇందుకు సంబంధించి ప్రభుత్వం నాలుగు వారాల్లో కౌంటర్ ద...
Nagarjuna | నాగ్ 100వ సినిమా టైటిల్ ఖరారు..
Cinema

Nagarjuna | నాగ్ 100వ సినిమా టైటిల్ ఖరారు..

టాలీవుడ్ మన్మథుడు కింగ్ నాగార్జున (King Nagarjuna)సినిమాల ఎంపికలో చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. అక్కినేని వారసుడిగా టాలీవుడ్ కి ఇంట్రడ్యూస్ అయి యువ సామ్రాట్ గా తన యాక్టింగ్ తో ఫ్యాన్స్ ను సంపాదించుకున్నాడు. తనెంత కంప్లీట్ యాక్టర్ అని చెప్పడానికి ఒక్క అన్నమయ్య మూవీ చాలు. ఇప్పటికీ యువ హీరోలతో పోటీ పడి సినిమాలను చేస్తూ ఆడియన్స్ ను అలరిస్తున్నారు. రీసెంట్ గా ధనుష్ కాంబోలో కుబేర(kubara), రజినీకాంత్ కాంబోలో కూలీ(kooli) మూవీస్ లో నాగ్ తన యాక్టింగ్ తో అదరగొట్టాడు. కొంతకాలంగా తన100 వ సినిమాపై రకరకాల వార్తలు వస్తున్నాయి. తమ అభిమాన హీరో మైల్ స్టోన్ మూవీ కావడంతో అక్కినేని ఫ్యాన్స్ ఈ మూవీపై భారీ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు. వారి అంచనాలకు తగ్గట్టుగానే ఆ మూవీకి సంబంధించిన పనులు చకచకా పూర్తవుతున్నాయి. లాటరీ కింగ్ గా నాగ్.. ఇప్పటికే ఈ మూవీ ని డైరెక్ట్ చేసే అవకాశం తమిళ టాలెంటెడ్ డైరెక్టర్ రా కార...
KTR | హైదరాబాద్‌లో బీఆర్‌ఎస్‌ ‘చలో బస్‌భవన్‌’ ఆందోళన.. కేటీఆర్‌, హరీష్‌ రావు హౌస్‌ అరెస్ట్‌
State, Hyderabad

KTR | హైదరాబాద్‌లో బీఆర్‌ఎస్‌ ‘చలో బస్‌భవన్‌’ ఆందోళన.. కేటీఆర్‌, హరీష్‌ రావు హౌస్‌ అరెస్ట్‌

హైదరాబాద్‌: హైదరాబాద్‌లో ఆర్టీసీ చార్జీల పెంపు నిర్ణయాన్ని తక్షణమే ర‌ద్దు చేసుకోవాల‌ని డిమాండ్‌ చేస్తూ బీఆర్‌ఎస్‌గురువారం 'చలో బస్‌భవన్‌' కార్యక్రమాన్ని చేపట్టనుంది. ఈ నేపథ్యంలో పోలీసులు వెంట‌నే రంగంలోకి దిగి. బీఆర్‌ఎస్‌ నేతలను హౌస్‌ అరెస్ట్ చేశారు. గురువారం ఉదయమే బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ (KTR ), మాజీ మంత్రి హరీష్‌ రావు(Harish Rao)ను పోలీసులు గృహ‌నిర్బంధం చేశారు. ఈ క్రమంలో కోకాపేటలోని వారి నివాసాల వద్ద పెద్ద సంఖ్యలో పోలీసులు మోహరించారు. ఇక, చలో బస్‌భవన్‌ కార్యక్రమంలో భాగంగా బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌(KTR), మాజీ మంత్రులు తలసాని శ్రీనివాస్‌యాదవ్‌, పద్మారావు, సబితా ఇంద్రారెడ్డి తదితరులు ఉదయం 9 గంటలకు రేతిఫైల్‌ బస్టాండ్‌కు చేరుకుని అక్కడి నుంచి ఆర్టీసీ బస్సులో ఆర్టీసీ బస్‌భవన్‌ వరకు వెళ్లాలని నిర్ణ‌యించుకున్నారు. అనంతరం టీజీఆర్టీసీ మేనేజింగ్‌ డైరెక్టర్‌కు వ...
error: Content is protected !!