Sarkar Live

Privacy Policy

Raja Singh : ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా అసెంబ్లీ స‌మావేశాల‌కు వ‌స్తా..
State

Raja Singh : ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా అసెంబ్లీ స‌మావేశాల‌కు వ‌స్తా..

Hyderabad : స్వతంత్ర ఎమ్మెల్యేగా అసెంబ్లీకి సమావేశాలకు హాజరవుతానని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ (Raja Singh) స్పష్టం చేశారు. ‘ఒకప్పుడు అసెంబ్లీలో ఏం మాట్లాడాలన్నా పార్టీ అగ్ర నాయకత్వం నుంచి ఆదేశాలు రావాల్సి ఉండేది. బీజేపీ సభలో మాట్లాడే అవకాశమే ఇచ్చేది కాదని ఆయన తెలిపారు.. ఇప్పుడు నాకు స్వేచ్ఛ ఎక్కువ. నాలాగే చాలా మంది బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు అసంతృప్తితో ఉన్నారు. దీనికి తాజా ఉదాహరణ చేవెళ్ల ఎంపీ వ్యవహరమే’ అని తెలిపారు. కాగా ఇటీవలే రాజా సింగ్ బీజేపీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా ఇటీవల చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి (Konda Vishweshwar Reddy) పార్టీ అగ్ర నాయకత్వానికి ఫుట్‌బాల్‌ను బహుమతిగా పంపిన విషయంపై రెండురోజుల క్రితం రాజా సింగ్ స్పందించారు. భారీ మెజారిటీతో గెలిచిన ఒక ఎంపీ ఎంతగా మనస్తాపానికి గురైతే అలాంటి పని చేస్తారని ప్రశ్నించారు. రానున్న రోజుల్లో మరింత మంది ఎంప...
Holidays | వర్షాల ఎఫెక్ట్..  13 జిల్లాల్లో విద్యా సంస్థలకు సెలవులు
State, Hyderabad

Holidays | వర్షాల ఎఫెక్ట్.. 13 జిల్లాల్లో విద్యా సంస్థలకు సెలవులు

వ‌రంగ‌ల్‌ : తెలంగాణలో కురుస్తున్న కుండపోత వర్షాల నేపథ్యంలో విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. మొత్తం 13 జిల్లాల్లో ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలకు సెలవులు (Holidays) ప్రకటించింది. ‌అందులో నల్లగొండ, యాదాద్రి భువనగిరి, కరీంనగర్‌, ‌సిద్దిపేట, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కామారెడ్డి, మెదక్‌, ‌నిర్మల్‌, ఆదిలాబాద్‌, ‌ఆసిఫాబాద్‌, ‌నిజామాబాద్‌, ‌ఖమ్మం జిల్లాల్లో ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలకు అధికారులు సెలవు ప్రకటించారు. భారీ వర్షాల నేపథ్యంలో అత్యవసరమైతే తప్ప ప్రజలు బయకు రాకూడదని అధికారులు సూచించారు. వర్ష ప్రభావం కారణంగా కామారెడ్డి జిల్లాలోని అన్ని విద్యాసంస్థలకు ఆగస్ట్ 29, 30 ‌వరకు సెలవులు ప్రకటించినట్లు ప్రభుత్వం తెలిపింది. భారీ వర్షాల పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం సెలవులను మరో రెండు రోజులు పొడిగించింది. అందువల్ల  పాఠశాలలు, కళాశాలలు బంద్‌ ‌కానున్నాయి.సిద్దిపేట జిల్లాలో గత రెండు ...
Weather News | నాలుగు జిల్లాల్లో భారీ వ‌ర్షాలు
Districts, State

Weather News | నాలుగు జిల్లాల్లో భారీ వ‌ర్షాలు

Weather News | రాష్ట్రంలో కుండ‌పోత‌ వర్షాలు బీభ‌త్సాన్ని సృష్టిస్తున్నాయి. కామారెడ్డి, మెదక్‌ జిల్లాల్లో భారీ వ‌ర్షాల‌తో జన జీవనం పూర్తిగా స్తంభించిపోయింది. కాల‌నీలు చెరువుల‌ను త‌ల‌పిస్తున్నాయి. అయితే మరోసారి భారీ వర్షాలు (Heavy Rains) కురుస్తాయన్న వాతావరణ శాఖ (IMD) హెచ్చరించ‌డంతో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. తెలంగాణ‌లోని మెదక్‌, కామారెడ్డి, నిజామాబాద్‌, నిర్మల్‌ జిల్లాల్లో గురువారం అతి భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని హైదరాబాద్ వాతావరణ కేంద్ర హెచ్చరించింది. అదేవిధంగా జగిత్యాల, కుమ్రంభీం ఆసిఫాబాద్, సిరిసిల్ల, ఆదిలాబాద్‌, కరీంనగర్‌, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్‌, వరంగల్‌, హనుమకొండ, జనగామ, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, సంగారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడా భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే చాన్స్ ఉంద‌ని తెలిపింది. తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ...
Cash RainViral Video | డ‌బ్బుల వ‌ర్షం కురిపించిన‌ కోతి..
Viral

Cash RainViral Video | డ‌బ్బుల వ‌ర్షం కురిపించిన‌ కోతి..

Cash Rain | ఉత్తరప్రదేశ్‌లోని ఔరైయా జిల్లాలో బిధునా తహసీల్ ప్రాంగణంలో ఒక కోతి "డబ్బుల వర్షం కురిపించింది. దీనికి సంబంధించిన వీడియో ఇపుడు సోష‌ల్ మీడియాలో వైరల్‌గా మారింది. నివేదికల ప్రకారం, మంగళవారం మధ్యాహ్నం 1 గంటల ప్రాంతంలో దొండాపూర్ గ్రామానికి చెందిన రోహితాష్ చంద్ర తన భూమి పత్రాలను రిజిస్ట్రేష‌న్ చేసుకోవడానికి తహసీల్ కార్యాలయానికి వచ్చినప్పుడు ఈ సంఘటన చోటుచేసుకుంది. భూమి రిజిస్ట్రేషన్ పూర్తి చేయడానికి అనుజ్ కుమార్ తన తండ్రి రోహితాష్ చంద్రతో కలిసి వచ్చాడు. వారు మోపెడ్ లోని స్టోరేజ్‌ కంపార్ట్‌మెంట్ లోపల రూ.80,000 నగదును ఉంచారు. రోహితాష్ తన న్యాయవాదితో పేప‌ర్ వ‌ర్క్ లో నిమగ్నమై ఉండగా, ఒక కోతి వాహనంలో దాచిన నగదు బ్యాగ్ ను లాక్కొని పారిపోయింది. ఒక కోతి మోటార్ సైకిల్ నిల్వ కంపార్ట్‌మెంట్ తెరిచి, నగదు బ్యాగ్‌ను లాక్కొని, ఆ ప్రాంగణంలోని ఒక చెట్టుపైకి ఎక్కింది. కొద్దిసేపటి తర్వాత, కోతి కరెన్సీ...
Kamareddy | భారీ వ‌ర్షాలు.. కామారెడ్డిలో కొట్టుకుపోయిన వాహ‌నాలు
Nizamabad, State

Kamareddy | భారీ వ‌ర్షాలు.. కామారెడ్డిలో కొట్టుకుపోయిన వాహ‌నాలు

Kamareddy News | కామారెడ్డి : ఉమ్మ‌డి నిజామాబాద్ (Nizamabad) జిల్లాలో వ‌ర్షాలు దంచికొడుతున్నాయి. దీంతో చెరువులు, కుంటలు నిండిపోయి మ‌త్త‌డి పోస్తున్నాయి. వాగులు ఉధృతంగా ప్ర‌హిస్తున్నాయి. అనేక లోతట్టు ప్రాంతాలు నీట‌మునిగాయి. కాగా కామారెడ్డి జిల్లా కేంద్రంలోని హైదరాబాద్‌ రోడ్డులో ప్రధాన రహదారిపై వరదనీరు రావడంతో కార్లు కొట్టుకుపోయాయి. కామారెడ్డి పట్టణం అతి భారీ వర్షాలతో మునిగిపోయింది. జిల్లా కేంద్రంలో నలుమూలల వరద నీరుతో నిండిపోయింది. అనేక కాలనీలో జలమయమై కాలు బయటపెట్టే పరిస్థితి లేకుండా పోవ‌డంతో ప్ర‌జ‌లు నానా అవ‌స్థ‌లు ప‌డుతున్నారు. హౌసింగ్ బోర్డ్ కాలనీలో వరద నీరు చేరడంతో అక్క‌డివారిని పోలీసులు సురక్షిత ప్రాంతాలకు చేర్చుతున్నారు. కామారెడ్డి పెద్ద చెరువు ఉగ్ర రూపంలో ప్రవహిస్తోంది. గతంలో ఎన్నడు చూడ‌ని విధంగా భూమికి సమాంతరంగా పెద్ద చెరువు నీళ్లు పారుతుండడంతో స్థానిక ప్రజలు భయాందోళనకు గురవుతున్న...
error: Content is protected !!