Sarkar Live

Privacy Policy

Tariffs War | ట్రంప్ 50% సుంకాల రికవరీ నేటి నుండి ప్రారంభం.. ఏ రంగం ఎక్కువగా దెబ్బతింటుంది?
World

Tariffs War | ట్రంప్ 50% సుంకాల రికవరీ నేటి నుండి ప్రారంభం.. ఏ రంగం ఎక్కువగా దెబ్బతింటుంది?

న్యూఢిల్లీ : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) భారత వస్తువులపై 50% సుంకం (Tariffs) విధించారు. ఇది నేటి నుంచి అమల్లోకి వస్తుంది. అమెరికా ఇప్పటికే భారత వస్తువులపై 25% సుంకం విధిస్తోంది. రష్యా నుంచి చమురు కొనుగోలు చేసినందుకు భారతదేశంపై అదనంగా 25% సుంకం విధించింది. వీటి సేకరణ నేటి నుంచి ప్రారంభమవుతుంది. ఇది భారతదేశ దాదాపు $48.2 బిలియన్ల ఎగుమతులను ప్రభావితం చేస్తుంది. ఎక్కువ మందికి ఉపాధి కల్పించే పరిశ్రమలు ఎక్కువగా దెబ్బ‌తినే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి. వీటిలో వస్త్రాలు (Textile Industry), రొయ్యలు, తోలు, వజ్రాలు, ఆభరణాలు, తివాచీలు, ఫర్నిచర్ త‌యారీ ప‌రిశ్ర‌మ‌లు ఉన్నాయి. ఈ వస్తువుల ఎగుమతి (Indian Exports) ఎక్కువగా ప్రభావితమయ్యే అవకాశం ఉంది. మరోవైపు, ఈ సుంకం మందులు, ఎలక్ట్రానిక్స్, పెట్రోలియం ఉత్పత్తులపై ఎటువంటి ప్రభావం చూపదు. ట్రంప్ సుంకం కారణంగా, అమెరికాకు ఎగుమతుల విలువ గత సంవ...
Landslide | జమ్మూలో కొండచరియలు విరిగిపడి 30 మంది మృతి
National

Landslide | జమ్మూలో కొండచరియలు విరిగిపడి 30 మంది మృతి

Landslide in Jammu Kashmir | జమ్మూ కాశ్మీర్‌లోని కాట్రాలో మాతా వైష్ణో దేవి యాత్ర ట్రాక్‌పై కొండచరియలు విరిగిపడటం (Landslide) తో బుధ‌వారం ఉద‌యం 30 మంది మృతి చెందగా, 23 మంది గాయపడ్డారు. శిథిలాల కింద మరింత మంది చిక్కుకుని ఉండవచ్చని అధికారులు ఆందోళ‌న చెందుతున్నారు. జమ్మూ కాశ్మీర్ అంతటా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు వరదలు ఉదృత‌మ‌వ‌డంతో కొండచరియలు విరిగిపడిపోతున్నాయి. జమ్మూలో, కీలకమైన మౌలిక సదుపాయాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి, వంతెనలు కూలిపోయాయి, విద్యుత్ లైన్లు మొబైల్ టవర్లు కూలిపోయాయి. మంగళవారం ఉదయం 11.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల మధ్య జమ్మూలో అత్యధిక వర్షపాతం నమోదైంది, అధికారిక సమాచారం ప్రకారం కేవలం ఆరు గంటల్లోనే 22 సెం.మీ. వర్షపాతం నమోదైంది. అయితే, అర్ధరాత్రి తర్వాత వర్షపాతం తగ్గడంతో కొంత ఉపశమనం కలిగించింది. అంతకుముందు, మంగళవారం మధ్యాహ్నం పుణ్యక్షేత్ర మార్గంలో కొండచరియలు విరిగిపడ్...
Rabies Fear | కూతురిని హ‌త్య చేసి ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డిన తల్లి.. మ‌హ‌బూబ్‌న‌గ‌ర్‌లో విషాదం
Crime, Mahaboobnagar

Rabies Fear | కూతురిని హ‌త్య చేసి ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డిన తల్లి.. మ‌హ‌బూబ్‌న‌గ‌ర్‌లో విషాదం

Mahbubnagar | కూతురికి రేబిస్ (Rabies) సోకిందన్న అనుమానంతో ఓ మ‌హిళ త‌న‌ కూతురిని చంపి, ఆపై ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డింది. ఈ షాకింగ్ ఘ‌ట‌న మ‌హ‌బూబ్ న‌గ‌ర్ జిల్లా కేంద్రంలో మంగ‌ళ‌వారం చోటుచేసుకుంది. వివ‌రాల్లోకి వెళితే.. యశోద అనే గృహిణికి భర్త, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఆమె గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధ‌ప‌డుతోంది. ఈ క్ర‌మంలో రేబిస్‌ వ్యాధి సోకుతుందేమోనన్న అనుమానంతో మానసికంగా కుంగిపోయి తన కూతురిని చంపి, తానూ ఆత్మహత్యకు పాల్ప‌డింది. ఆమె ఆత్మ‌హ‌త్య చేసుకోవ‌డానికి ముందు.. కుమారుడు లక్కీ, భర్త జాగ్రత్త..! అంటూ యశోద చాక్ బోర్డు, డోర్ల మీద రాసింది. రేబిస్ వాక్సిన్ (Rabies Vaccine) తీసుకున్నప్పటికీ.. అది వ్యాక్సిన్‌తో తగ్గదు, చెట్ల మందు తీసుకోవాలి, పత్యం చేయాలని భర్త నరేష్‌కు పలు రకాలుగా విన్నవించింది. తనకు, తన కూతురుకి రేబిస్ వ్యాధి సోకింద‌ని అందోళన చెందింది. అదే అనుమానంతో వ్యాక్సిన్ సైతం తీసుకుంది....
Heavy Rains | రేపు ప‌లు జిల్లాల్లో భారీ వ‌ర్షాలు
State, Hyderabad

Heavy Rains | రేపు ప‌లు జిల్లాల్లో భారీ వ‌ర్షాలు

Hyderabad : తెలంగాణలోని పలు జిల్లాల్లో బుధవారం భారీ వర్షాలు (Heavy Rains) కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం హెచ్చ‌రించింది. వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడినట్లు వాతావరణ కేంద్రం పేర్కొంది. ఉపరితల ఆవర్తనం పశ్చిమ వాయువ్య దిశలో కదిలి ఉత్తర ఒడిశా దాని సమీపంలోని చత్తీస్‌గఢ్‌ల మీదుగా కదిలే అవకాశం ఉందని పేర్కొంది. రాబోయే రెండు రోజుల్లో అల్పపీడనం మరింత బలపడే అవకాశం ఉందని వివరించింది. తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్ లో భారీ వర్షాలు కురువనున్నాయి. రుతుపవన ప్రభావంతో మంగళవారం భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జయశంకర్‌ భూపాలపల్లి, మహబూబాబాద్, ములుగు, వరంగల్‌ (Warangal) జిల్లాల్లో భారీ వానలు కురుస్తున్నాయి. ఇక బుధవారం భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, వరంగల్‌, భూపాలపల్లి, పెద్దపల్లి, మంచిర్యాల, ఆదిలాబాద్‌, కుమ్రం భీమ్‌ ఆసిఫాబాద్‌, నిర్మల్‌, జగిత్యాల, మెదక్‌, కామారెడ్డి, నిజామాబాద్‌ జిల్లాల్లో అక్...
Special Trains : ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ఈ మార్గాల్లో 22 ప్రత్యేక రైళ్లు..
State

Special Trains : ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ఈ మార్గాల్లో 22 ప్రత్యేక రైళ్లు..

South Central Railway Special Trains | తెలుగు రాష్ట్రాల్లోని రైల్వే ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే గుడ్ న్యూస్ చెప్పింది. దేశవ్యాప్తంగా ఎంతో ఘనంగా జరుపుకునే దసరా, దీపావళి పండుగలను పురస్కరించుకొని నగరాలు, పట్టణాల నుంచి తమ స్వగ్రామాలకు వెళ్లే ప్రజల కోసం దక్షిణమధ్య రైల్వే ప్రత్యేక రైళ్లు (Special Trains) నడపనున్నట్లు ప్రకటించింది. తెలుగు రాష్ట్రాల్లో మొత్తం 22 ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో శ్రీధర్ వెల్లడించారు. ఈ ప్రత్యేక రైళ్లు సెప్టెంబర్ 4 నుంచి 25వ తేదీ వరకు నడుస్తాయని తెలిపారు. ప్రత్యేక రైళ్లు నడిచే రూట్లు ఇవే.. సికింద్రాబాద్-తిరుపతి రూట్ సెప్టెంబర్ 4 నుంచి 25 వరకు సికింద్రాబాద్‌ -తిరుపతి మధ్య 4 ప్రత్యేక సర్వీసులు సెప్టెంబర్ 5 నుంచి 26 వరకు తిరుపతి -సికింద్రాబాద్ మధ్య 4 ప్రత్యేక సర్వీసులు కాచిగూడ - నాగర్‌సోల్ రూట్ సెప్టెంబర్ 4 నుంచి 25 వ...
error: Content is protected !!