Sarkar Live

Privacy Policy

Rain Forecast | తెలంగాణలో 3 రోజులు వర్షాలు..ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్
State, warangal

Rain Forecast | తెలంగాణలో 3 రోజులు వర్షాలు..ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్

Rain Forecast | వ‌రంగ‌ల్ : తెలంగాణలో మూడు రోజుల పాటు మోస్త‌రు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ప‌లు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కుర‌నున్నాయ‌ని పేర్కొంటూఈ మేరకు వాతావరణశాఖ ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. శనివారం వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పింది. ఇక ఆదివారం భ‌ద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, వరంగల్, హనుమకొండ, జనగామ, మానుకోట‌, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, పాల‌మూరు, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో వర్షాలు పడే అవకాశం ఉందని చెప్పింది. సోమవారం నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, ...
Mamnoor Airport | మామునూరు ఎయిర్‌పోర్ట్‌పై కీల‌క ప‌రిణామం..
State, warangal

Mamnoor Airport | మామునూరు ఎయిర్‌పోర్ట్‌పై కీల‌క ప‌రిణామం..

Warangal Mamnoor Airport | హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో మరో భారీ విమానాశ్రయం రూపుదిద్దుకోనుంది. ప్రస్తుతం ఉన్న శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి సమానంగా, ఆధునిక సదుపాయాలతో వరంగల్ సమీపంలోని మామునూర్ వద్ద కొత్త‌ విమానాశ్రయ నిర్మాణం (Mamnoor Airport) జరగనుంది. ఇందుకోసం ప్రభుత్వం తాజాగా రూ.90 కోట్ల నిధుల‌ను అదనంగా మంజూరు చేసింది. ఈ మేరకు రవాణా, రోడ్లుచ‌ భవనాల (విమానాశ్రయాలు) శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికాస్ రాజ్ తాజాగా ఉత్తర్వులు జారీ చేశారు. రైతులకు న‌ష్ట‌పరిహారం గతంలోనే ప్రభుత్వం రూ.205 కోట్లు విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈసారి కొత్తగా విడుదలైన నిధులతో కలిపి భూసేకరణ కోసం మొత్తం 295 కోట్లను కేటాయింట్లు అయింది. భూములను కోల్పోతున్న రైతులు, యజమానులకు నష్టపరిహారం చెల్లించడానికి ఈ మొత్తాన్ని వినియోగించనున్నారు. వరంగల్ రెవెన్యూ డివిజనల్ అధికారికి ఈ నిధులు బదిలీ చేయనున్నట్టు తెలుస్...
Konda Surekha | నా సమస్యలను కాంగ్రెస్‌ ‌పెద్దలకు వివరించా
State, warangal

Konda Surekha | నా సమస్యలను కాంగ్రెస్‌ ‌పెద్దలకు వివరించా

Hyderabad | ఇటీవల తనపై జరుగుతున్న పరిణామాలపై మంత్రి కొండా సురేఖ (Konda Surekha) మరోసారి స్పందించారు. పార్టీ పెద్దలతో సమావేశమైన తర్వాత ఆమె చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా ఆసక్తి రేపుతున్నాయి. తాజా పరిణామాలపై కాంగ్రెస్‌ ‌పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి నాక్షి నటరాజన్‌ (Meenakshi Natarajan), ‌పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌ ‌గౌడ్‌ (Mahesh Kumar Goud) తో మంత్రి కొండా సురేఖ, ఆమె కుమార్తె సుస్మిత చర్చించారు. కొన్ని రోజులుగా జ‌రుగుతున్న‌ పరిణామాలను వివరించారు. బుధ‌వారం రాత్రి తన ఇంటి వద్దకు పోలీసులు వచ్చిన సమయంలో జ‌రిగిన విష‌యాల‌ను వారికి వివరించారు. భేటీ అనంతరం కొండా సురేఖ మీడియాతో మాట్లాడారు. త‌న‌ సమస్య పరిష్కరించేం దుకు ప్రయత్నిస్తామని వారు హామీ ఇచ్చారు. మిగిలిన విషయాలు వారే చూసుకుంటారని భరోసాతో వెళ్తున్నాన‌ని మంత్రి సురేఖ వెల్ల‌డించారు. గత కొన్ని రోజులుగా తనను, తన కుటుంబాన్ని టార్గెట్‌ ‌చేసు...
Konda Sushmitha | మమ్మల్ని వదిలేయమని రేవంత్ కాళ్లు ప‌ట్టుకోవాలా? – కొండా సురేఖ కూతురు సుశ్మిత ఫైర్
State, warangal

Konda Sushmitha | మమ్మల్ని వదిలేయమని రేవంత్ కాళ్లు ప‌ట్టుకోవాలా? – కొండా సురేఖ కూతురు సుశ్మిత ఫైర్

Telangana : సీఎం రేవంత్ రెడ్డిపై మంత్రి కొండా సురేఖ (Konda Surekha) కూతురు సుశ్మిత (Konda Sushmitha) మ‌రోసారి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. మ‌మ్మ‌ల్ని వ‌దిలేయండ‌ని రేవంత్ రెడ్డి కాళ్లు ప‌ట్టుకొని మొక్కాలా..? అని ప్ర‌శ్నించారు. ముఖ్య‌మంత్రి మా అమ్మను ఇష్టమొచ్చినట్లు తిట్టేవాడు. దిల్లీలో ఖర్గేతో స‌మావేశంలో మా అమ్మను రేవంత్ రెడ్డి (CM Revanth Reddy ) తిడితే ఆరోజు మా అమ్మ ఎంతో ఏడ్చింద‌ని సుష్మిత తెలిపారు. తెలంగాణ‌లో రేవంత్ రెడ్డి సోద‌రులు మొత్తం భూములను ఆక్ర‌మిస్తున్నారు. మంచిరేవులలో విల్లాలు కట్టుకున్న కొందరు వ్యక్తులు దారి కోసం దేవాదాయ‌శాఖ భూమిని అడిగారు.. దీనిప ప్ర‌శ్నిస్తే దానికి బ‌దులుగా పక్కన ప్రైవేట్ భూమి ఇస్తామని అన్నారు. ఈ ఫైల్ మీద కొండా సురేఖ సంతకం చేస్తే, జపాన్‌లో ఉన్న రేవంత్ రెడ్డి ఆ ఫైల్‌ను ఆపించాడు. ఎందుకంటే రేవంత్ రెడ్డి తమ్ముళ్లు ఆ భూములను కబ్జా చేయాలని చూస్తున్నారు.. అందుకే మా...
Diwali Celebration | పర్యావరణహిత దీపావళి కోసం గ్రీన్ క్రాకర్స్‌ — మీ చిన్న నిర్ణయం.. పెద్ద మార్పు!
LifeStyle

Diwali Celebration | పర్యావరణహిత దీపావళి కోసం గ్రీన్ క్రాకర్స్‌ — మీ చిన్న నిర్ణయం.. పెద్ద మార్పు!

Diwali Celebration 2025 -Eco-friendly Fireworks | దీపావళి సందర్భంగా ఢిల్లీ-ఎన్‌సిఆర్ అంతటా గ్రీన్ క్రాక‌ర్స్‌ (Green Crackers) అమ్మకాలు, వినియోగానికి సంబంధించి గ‌త బుధవారం అనుమతిచ్చిన విష‌యం తెలిసిందే.. దేశ రాజధాని అంతటా ప్రజలు అక్టోబర్ 18 నుండి 21 వరకు ఈ బాణసంచా కాల్చవచ్చు. అంతేకాకుండా, అక్టోబర్ 18 నుండి వాయు నాణ్యత సూచికను పర్యవేక్షించాలని కేంద్ర కాలుష్య నియంత్రణ బోర్డు, ఎన్‌సిఆర్‌లోని రాష్ట్ర పిసిబిలను సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ చర్యపై ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖ గుప్తా హ‌ర్షం వ్యక్తం చేశారు మరియు ఈ విషయంలో ఢిల్లీ ప్రభుత్వం చేసిన విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకున్నందుకు సుప్రీంకోర్టుకు ధన్యవాదాలు తెలిపారు. Diwali Celebration : అస‌లు గ్రీన్ క్రాకర్స్ అంటే ఏమిటి? గ్రీన్ క్రాకర్స్ అనేవి సంప్రదాయ బాణసంచాకు పర్యావరణప‌రంగా అనుకూలమైన ప్రత్యామ్నాయాలు. ఇవి వాయు, శబ్ద కాలుష్యాన్ని తగ్గించడానికి ప...
error: Content is protected !!