Sarkar Live

Privacy Policy

Warangal Collectorate | 25 నెలలుగా నత్తనడకే!
warangal, State

Warangal Collectorate | 25 నెలలుగా నత్తనడకే!

వరంగల్ కలెక్టరేట్ నిర్మాణం పూర్తయ్యేదెన్నడు? Warangal Collectorate | వరంగల్ నగర ప్రజల అభివృద్ధికి మూలస్తంభంగా నిలవాల్సిన కలెక్టరేట్ భవనం ఇప్పటికీ పూర్తి కావడం లేదు. 2023 జూన్ 17న ఈ సమీకృత జిల్లా కార్యాలయ భవన నిర్మాణానికి శంకుస్థాపన జరిగింది. ఇప్పటికే 25 నెలలు గడుస్తున్నా, పనుల్లో స్పష్టమైన పురోగతి కనిపించడంలేదు. ప్రతిరోజూ పనులు జరిగినట్లుగా కనిపిస్తున్నప్పటికీ ఆశించినంత వేగం లేదు. దీంతో స్థానికుల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. ప్రజలకు అన్ని ప్రభుత్వ సేవలు ఒకే చోట అందించాలనే ఉద్దేశంతో నిర్మిస్తున్న ఈ సమీకృత భవన నిర్మాణ పనులు జాప్యం కావడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వరంగల్ జిల్లాలోని ప్రజల అభివృద్ధి కలలన్నీ కొలువుదీరే కేంద్రంగా ఆశించిన కొత్త కలెక్టరేట్ భవనం ఇప్పటికీ ‘పూర్తి’ రూపం దాల్చకపోవడం స్థానికులను కలవరపెడుతోంది.అధికారికంగా నిర్మాణం ప్రారంభించి 25 నెలలు గడుస్తున్నా పనుల పురో...
అన్న‌దాత‌ల‌తో ఆప్యాయంగా మంత్రి సీతక్క –  Minister Seethakka
Trending

అన్న‌దాత‌ల‌తో ఆప్యాయంగా మంత్రి సీతక్క – Minister Seethakka

కూలీలతో ఆత్మీయ ప‌ల‌క‌రింపు.. Mulugu News | తెలంగాణలో విస్తారంగా వ‌ర్షాలు కురుస్తున్నాయి. రైతులు వ్య‌వ‌సాయ ప‌నుల్లో బిజీగా మారిపోయారు. అయితే మంత్రి సీతక్క (Minister Seethakka) రైతుల‌కు స‌ర్‌ప్రైజ్ ఇచ్చారు. వరి నాట్లు వేసుకుంటున్న కూలీల వద్దకు స్వయంగా వెళ్లి, బురదమ‌య‌మైన‌ పొలంలోకి దిగారు. కూలీల ఆరోగ్యం, వ్య‌వ‌సాయ ప‌నుల గురించి అడిగి తెలుసుకున్నారు. వర్షం కారణంగా పని చేస్తూ తడిసిపోతున్న కూలీలకు రక్షణగా ఉండేలా ప్రత్యేకంగా తయారు చేసిన రెయిన్ క‌వ‌ర్స్‌ను పంపిణీ చేశారు. ఆమె స్వయంగా కూలీలకు కవర్లు తొడగడం ద్వారా తన ఆప్యాయ‌త‌ను చాటుకున్నారు. ఆ తర్వాత మంత్రి సీతక్క (Minister Seethakka) కూలీలతో మాట్లాడుతూ, వారికి అందుతున్న రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు, ఇతర సంక్షేమ పథకాల గురించి అడిగి తెలుసుకున్నారు. అర్హులందరికీ రెండు మూడు రోజుల్లో రేషన్ కార్డులు అందజేస్తామని హామీ ఇచ్చారు. మంత్రి వారి వద్దకు ...
IVF Scam | మాయా ‘సృష్టి’ .. 40లక్షలకు అక్రమంగా శిశువు అమ్మకం
Crime

IVF Scam | మాయా ‘సృష్టి’ .. 40లక్షలకు అక్రమంగా శిశువు అమ్మకం

డీఎన్‌ఏ టెస్టులతో బయటపడ్డ నిజాలు IVF Scam in Hyderabad | తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర సంచ‌ల‌నం రేపిన సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్‌ (Srushti Test Tube Baby Centre) కేసులో ఎన్నో షాకింగ్ విష‌యాలు వెలుగులోకి వ‌స్తున్నాయి.ఐవీఎఫ్‌ పేరుతో చైల్డ్‌ ట్రాఫికింగ్‌కు పాల్పడినట్లు పోలీసులు తాజాగా గుర్తించారు. జులై 27న‌ ఆదివారం మీడియా సమావేశంలో సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ దారుణాల‌ను ఉత్తర మండలం డీసీపీ రష్మీ పెరుమాళ్ డీసీపీ రష్మీ పెరుమాళ్ వెల్ల‌డించారు. ఈనెల 25న సృష్టి టెస్ట్‌ ట్యూబ్‌ బేబీ సెంటర్‌పై కేసు న‌మోదు కావ‌డంతో తెర‌వెనుక బాగోతాలు బ‌య‌ట‌కు వ‌చ్చాయి. రాజస్థాన్‌కు చెందిన బాధితురాలు సోనియా ఫిర్యాదుతో కేసు నమోదు చేశామ‌ని డీసీపీ వెల్ల‌డించారు.. గతేడాది ఆగస్టులో ఐవీఎఫ్‌ ప్రొసీజర్ కోసం డాక్టర్‌ నమ్రతను సోనియా దంపతులు కలిశారు. ఇక్కడి నుంచి దంపతులను వైజాగ్‌కు పంపించారు. ఐవీఎఫ్ తో కాదు.. సరోగసి ...
Salman Khan | సల్మాన్ రామాయణం అందుకే ఆగిందా..?
Cinema

Salman Khan | సల్మాన్ రామాయణం అందుకే ఆగిందా..?

Salman Khan Movie | ఇండియన్ సినీ చరిత్రలో ఇప్పటి వరకు మైథలాజికల్ మూవీస్ చాలానే వచ్చాయి.మహాభారతం(Maha bharatha), రామాయణం (Ramayanam) స్టోరీని తెరకెక్కించడానికి కొందరు డైరెక్టర్ లు ఇప్పటికీ స్క్రిప్ట్ లు రెడీ చేసుకుంటూనే ఉన్నారు. ఆడియన్స్ కూడా ఈ జానర్ లో ఎన్ని సినిమాలు వచ్చినా ఆదరిస్తూనే ఉంటారు. ఆడియన్స్ మెచ్చేలా మూవీ తీస్తే చాలు సినిమాను సూపర్ హిట్టు చేస్తూనే ఉన్నారు. టాలీవుడ్ లో ఒకప్పుడు మైథాలజికల్ జానర్లో మూవీ అంటే ముందు గుర్తుకు వచ్చేది సీనియర్ ఎన్టీఆరే. ఆయన వేయని క్యారెక్టర్ లేదంటే అతిశయోక్తి కాదు. రాముడిగా,కృష్ణుడిగా, అర్జునుడిగా ఇలా చాలా క్యారెక్టర్ లలో మెప్పించాడు. ఆయన తర్వాత ఆ రేంజ్ లో మెప్పించిన నటుడు లేడని చెప్పొచ్చు. తర్వాతి తరం డైరెక్టర్స్ మైథాలజికల్ జానర్ ని టచ్ చేయకుండా వేరే జానర్ లో మూవీస్ తీసారు. ఇక లేటెస్ట్ ట్రెండ్ మళ్ళీ కొందరు ఈతరం డైరెక్టర్లు అలాంటి మూవీస్ తీయడానికి మ...
Telangana ACB | రూ.లక్ష లంచం.. ఏసీబీ అధికారులు పట్టుకునేలోపే  పారిపోయిన పంచాయతీ కార్యదర్శి
Crime

Telangana ACB | రూ.లక్ష లంచం.. ఏసీబీ అధికారులు పట్టుకునేలోపే పారిపోయిన పంచాయతీ కార్యదర్శి

Telangana ACB Raids | రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండలంలోని ఇన్ములనర్వ గ్రామ పంచాయతీ (Panchayat Secretary) కార్యదర్శి సురేందర్‌ (Surendar)పై అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారులు కేసు నమోదు చేశారు. ఓ నిర్మాణంపై ఇచ్చిన నోటీసును పట్టించుకోకుండా ఉండేందుకు ఫిర్యాదుదారుడి నుంచి రూ.లక్ష డిమాండ్ చేశాడు. ఈ క్రమంలో రూ.50 వేలు లంచం తీసుకున్నారని ఆయనపై ఆరోపణలు వచ్చాయి. దీంతో ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకునే యత్నించగా నిందితుడు సురేందర్ పరారయ్యాడు. శుక్రవారం సాయంత్రం శంషాబాద్‌లోని ఇండియానా హోటల్ సమీపంలో ఫిర్యాదుదారుడి నుంచి రూ.50 వేల మొత్తాన్ని సురేందర్ స్వీకరించి తన ఎస్‌యూవీ కారులో సంఘటనా స్థలం నుంచి చందానగర్ లోని తన అపార్ట్మెంట్ వెళ్లాడు. తన కారు తన ఇంటి వద్ద నిలిపి తన బావమరిది కారు తీసుకొని అతనికి లంచం డబ్బులు ఇచ్చి అక్కడి నుంచి పారిపోయాడు. అయితే, ఏసీబీ అధికారులు కారును, లంచం తాలుకు నగదు ...
error: Content is protected !!