Sarkar Live

Privacy Policy

BSNL 5G | బిఎస్ఎన్ఎల్‌ 5G వస్తోంది, ఈ రెండు మ‌హా నగరాల నుంచే ప్రారంభం
Technology

BSNL 5G | బిఎస్ఎన్ఎల్‌ 5G వస్తోంది, ఈ రెండు మ‌హా నగరాల నుంచే ప్రారంభం

ప్రభుత్వ రంగ‌ టెలికాం సంస్థ BSNL నుంచి బిగ్ న్యూస్ వ‌స్తోంది. డిసెంబర్ నాటికి దేశంలోని రెండు ప్ర‌ధాన న‌గ‌రాలైన దిల్లీ. ముంబైలలో BSNL 5G సేవలను ప్రారంభించనున్న‌ట్లు తెలుస్తోంది. BSNL 4G, 5G సేవల కోసం ప్రజలు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్నారు. కొంతకాలం క్రితం దిల్లీలో BSNL 4G సేవలను కూడా ప్రారంభించిన త‌ర్వాత ఈ అప్‌డేట్ వచ్చింది. గత సంవత్సరం జూలైలో ప్రైవేట్ టెలికాం కంపెనీలు తమ రీఛార్జ్ ప్లాన్‌ల ధ‌ర‌ల‌ను పెంచిన‌పుడు, దేశ‌వ్యాప్తంగా పెద్ద సంఖ్యలో ప్రజలు BSNL కు మారిపోయారు. దీని తరువాత, BSNL వరుసగా రెండు త్రైమాసికాలకు లాభాలను నమోదు చేసింది. అయితే, BSNL 5G, 4G సేవల కోసం చాలా కాలంగా నెమ్మ‌దిగా విస్త‌రించ‌డం వల్ల, BSNL గత కొన్ని నెలలుగా వినియోగదారులను కోల్పోతోంది. అటువంటి పరిస్థితిలో, డిసెంబర్ నుండి 5G సేవ ప్రారంభమవుతుందనే వార్తలు ప్రజలకు ఊర‌ట క‌లిగిస్తోంది. BSNL 5G ప్ర‌యోగాత్మ‌క ప‌రీక్ష‌లు స‌క్సెస్‌...
Jatadhara Movie : జటాధర రిలీజ్ డేట్ ఫిక్స్..!
Cinema

Jatadhara Movie : జటాధర రిలీజ్ డేట్ ఫిక్స్..!

Jatadhara Release Date : టాలీవుడ్ హీరో సుధీర్ బాబు, సూపర్ స్టార్ మహేష్ బాబు బావగానే కాకుండా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. SMS, శివ మనసులో శృతి సినిమాలతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన ఆయన, మారుతి దర్శకత్వం వహించిన ప్రేమ కథా చిత్రంతో భారీ విజయం సాధించాడు. ఆ తర్వాత సమ్మోహనం, భలే మంచి రోజు వంటి సినిమాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. అయితే గత కొన్ని సినిమాలు ఆశించిన స్థాయిలో విజయాలు అందుకోలేదు. ఇప్పుడు కొంత గ్యాప్ తర్వాత, భారీ మైథలాజికల్ జానర్ మూవీ జటాధరతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఈ సినిమాను వెంకట్ కల్యాణ్, అభిషేక్ జైస్వాల్ దర్శకత్వం వహిస్తుండగా, జీ స్టూడియోస్, ప్రేరణ అరోరా సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో సుధీర్ బాబుతో పాటు బాలీవుడ్ స్టార్ సోనాక్షి సిన్హా కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇప్పటికే ప్రభాస్ విడుదల చేసిన పోస్టర్, తర్వాత విడుదలైన టీజర్‌కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన...
Security Jobs | ట్రాన్స్‌జెండర్లకు మెట్రో రైళ్ల‌లో సెక్యూరిటీగా విధులు
State, Hyderabad

Security Jobs | ట్రాన్స్‌జెండర్లకు మెట్రో రైళ్ల‌లో సెక్యూరిటీగా విధులు

Security Jobs in Hyderabad Metro | “ట్రాన్స్‌జెండర్లు (Transgenders) ఎందులోనూ తక్కువ వారు కాదు, తలెత్తుకుని బ‌తికే వారని సమాజానికి నిరూపించే దిశగా తెలంగాణ ప్రభుత్వం మరో గౌరవప్రదమైన అవకాశాన్ని కల్పించింది” అని ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, దివ్యాంగులు, ట్రాన్స్‌జెండర్‌ల శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. ట్రాఫిక్ సిగ్నల్‌ల వద్ద భిక్షాటన చేసిన వారికి ట్రాఫిక్ నియంత్రణలో అవకాశాలు కల్పించగా, ఇప్పుడు హైదరాబాద్ మెట్రో రైళ్ల‌లో 20 మందిని సెక్యూరిటీ గార్డులుగా నియమించడం చారిత్రాత్మక నిర్ణయంగా నిలిచిందన్నారు.మంగళవారం మంత్రి ఛాంబర్లో 20 మంది ట్రాన్స్‌జెండర్‌లకు హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ సెక్యూరిటీ వార్డులుగా నియామక పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, సెక్యూరిటీ గార్డు (Security Jobs) నియామకాల కోసం దాదాపు 300–400 మంది దరఖాస్తు చేసుకోగా, నైపుణ్యం కలిగిన వారిని ఎంపిక చేశామని తె...
Nalgonda | పోక్సో కోర్టు సంచ‌ల‌న తీర్పు
Crime

Nalgonda | పోక్సో కోర్టు సంచ‌ల‌న తీర్పు

ప‌దేళ్ల బాలికపై లైంగిక‌దాడికి పాల్ప‌డిన వృద్దుడికి 24 ఏళ్ల జైలు Nalgonda News | అభంశుభం తెలియ‌ని ప‌దేళ్ల బాలిక‌పై పాశ‌వికంగా లైంగిక దాడికి పాల్ప‌డిన కామాంధుడైన‌ వృద్ధుడు నల్లగొండ (Nalgonda ) మండలం అన్నెపర్తి గ్రామానికి చెందిన మర్రి ఊషయ్య (60)కు పోక్సో కోర్టు (POCSO Court) 24ఏళ్ల జైలు శిక్ష (24 Years Jail Sentence) విధించింది. ఈ కేసు పూర్వ‌ప‌రాల్లోకి వెళితే.. 2023 మార్చి 28న నాలుగో తరగతి చదువుతున్న 10 ఏళ్ల మైనర్ బాలిక బడికి వెళ్లి ఇంటికి వ‌చ్చి నిద్రపోతున్న సమయంలో ఊష‌య్య అక్రమంగా ఇంట్లోకి ప్రవేశించి బాలిక‌కు తిను బండారాలు ఇచ్చి అత్యాచారానికి పాల్ప‌డ్డాడు. ఎవరికైనా చెప్పితే చంపేస్తాన‌ని బాలిక‌ను బెదిరించారు. విషయం తెలుసుకున్న‌ బాధితురాలి తల్లి 2023 మార్చి 29న‌ నల్లగొండ రూరల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. అప్పటి స్టేష‌న్ హౌస్ ఆఫీస‌ర్ ( SHO) కంచర్ల భాస్కర్ రెడ్డి నిందితుడు ఊష‌య్య‌పై...
Indiramma Houses | ఇందిరమ్మ ఇళ్ల పథకంలో మరో శుభవార్త – లబ్ధిదారుల ఖాతాల్లోకి రూ.146.3 కోట్లు
State, Hyderabad

Indiramma Houses | ఇందిరమ్మ ఇళ్ల పథకంలో మరో శుభవార్త – లబ్ధిదారుల ఖాతాల్లోకి రూ.146.3 కోట్లు

Hyderabad : తెలంగాణలో అమలు అవుతున్న ఇందిరమ్మ ఇళ్ల పథకం (Indiramma Houses) కింద లబ్ధిదారులకు ప్రభుత్వం మరో శుభవార్త అందించింది. తాజా విడతలో 13,841 మంది లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాల్లోకి రూ.146.30 కోట్లు జమ చేసినట్టు అధికారులు ప్రకటించారు. ఇప్పటి వరకు ఈ పథకం కింద ప్రభుత్వం రూ.1435 కోట్ల నిధులను విడుదల చేసినట్లు గృహ నిర్మాణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ వీపీ గౌతమ్ తెలిపారు. ఇళ్ల నిర్మాణ పురోగతి రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే 2.15 లక్షల ఇళ్ల పనులు ప్రారంభమయ్యాయి. ఇందులో 1.29 లక్షల ఇళ్లు నిర్మాణంలో కొనసాగుతున్నాయి. సుమారు 20 వేల ఇళ్లు గోడల దశలో , 8,633 ఇళ్లు పైకప్పు దశలో ఉన్నాయని వెల్లడించారు. అలాగే, ఇప్పటికే పూర్తి అయిన ఇళ్లలో పలువురు లబ్ధిదారులు గృహప్రవేశం కూడా చేసినట్టు తెలిపారు. ప్రతి సోమవారం నగదు జమ విధానం ప్రతి సోమవారం, ఇళ్ల నిర్మాణ (Indiramma Houses ) పురోగతిని బట్టి లబ్ధిదారుల బ్యాంక్ ...
error: Content is protected !!