Rain Alert | తెలుగు రాష్ట్రాల్లో మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురవనున్నాయని ఐఎండీ (IMD) వెల్లడించింది. నవంబర్ 30 నుంచి డిసెంబర్ 2వ తేదీ వరకు ఉరుములు, మెరుపులతో కూడిన వానలు పడుతాయని అంచనా వేసింది. ఈమేరకు పలు జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ చేసింది. నైరుతి బంగాళాఖాతంలోని తీవ్రవాయుగుండం నెమ్మదిగా కదులుతోందని, గడిచిన 6 గంటల్లో గంటకు 2 కిమీ వేగంతో కదులుతుందని ఐఎండీ పేర్కొంది.
చెన్నైకి 480 కి.మీ. దూరంలో కేంద్రీకృతమై ఉందని తెలిపింది. వొచ్చే 12 గంటల్లో శ్రీలంక తీరాన్ని దాటి ఉత్తర-వాయువ్య దిశగా పయనమవుతుందని అంచనా వేసింది. ఉదయంలోపు తుపానుగా మారే చాన్స్ ఉందని ఐఎండీ వివరించింది.శనివారం (నవంబర్ 30వ తేదీ) ఉదయం ఉత్తర తమిళనాడు-పుదుచ్చేరి తీరాల సమీపంలో కారైకాల్, మహాబలిపురం మధ్య తీవ్ర వాయుగుండంగా తీరం దాటే అవకాశం ఉందని తాజా బులెటిన్ లో పేర్కొంది. ఈ ప్రభావంతో 3 రోజులు ఏపీలోని దక్షిణకోస్తాలో అక్కడక్కడా భారీ వర్షాలు,రాయలసీమలో శుక్ర, శనివారాల్లోఅక్కడక్కడా భారీవర్షాలు కురిసే అవకాశం ఉంది. మిగిలినచోట్ల విస్తారంగా తేలికపాటి-మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది.
శనివారం దక్షిణకోస్తా, ఏపీ(AP) రాయలసీమలో కొన్నిచోట్ల భారీ-అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. మరోవైపు తెలంగాణకు ఐఎండీ కీలక అలర్ట్ ఇచ్చింది. తుఫాన్ ప్రభావంతో శుక్రవారం నుంచి వర్షాలు కురిసే అవకాశం ఉంది. నేడు పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.
Telangana : ఇక నవంబర్ 30వ తేదీన కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, నాగర్ కర్నూల్, వనపర్తి, గద్వాల జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ అయ్యాయి. డిసెంబర్ 1వ తేదీన తెలంగాణలోని భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, నాగర్ కర్నూల్, వనపర్తి, గద్వాల జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ అయ్యాయి.డిసెంబర్ 2వ తేదీన తెలంగాణలోని భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, వరంగల్, హన్మకొండ, జగనాం, సిద్ధిపేట జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ అయ్యాయి. మళ్లీ డిసెంబర్ 3,4 తేదీల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఎలాంటి హెచ్చరికలు లేవని ఐఎండీ వివరించింది.