Sarkar Live

Revanth Reddy | చైన్నైకి సీఎం రేవంత్‌రెడ్డి.. ఎందుకో తెలుసా?

Revanth Reddy Chennai visit : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Telangana Chief Minister Revanth Reddy) ఈ రోజు సాయంత్రం చెన్నై పర్యటన (Chennai visit)కు బయల్దేరనున్నారు. ఈ పర్యటనలో టీపీసీసీ చీఫ్ మ‌హేష్‌ గౌడ్ (Mahesh Goud)

CM Revanth Reddy

Revanth Reddy Chennai visit : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Telangana Chief Minister Revanth Reddy) ఈ రోజు సాయంత్రం చెన్నై పర్యటన (Chennai visit)కు బయల్దేరనున్నారు. ఈ పర్యటనలో టీపీసీసీ చీఫ్ మ‌హేష్‌ గౌడ్ (Mahesh Goud) కూడా ఆయనతో పాటు వెళ్లనున్నారు. రేపు చెన్నైలో తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ (Tamil Nadu Chief Minister M.K. Stalin) అధ్యక్షతన అఖిలపక్ష సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో ముఖ్యంగా నియోజకవర్గాల పునర్విభజన (Delimitation)) అంశంపై చర్చించనున్నారు.

Revanth Reddy : కీల‌కాంశంగా నియోజ‌క‌వ‌ర్గాల పున‌ర్విభ‌జ‌న‌

భారతదేశంలో నియోజకవర్గాల పునర్విభజన (Delimitation) ఒక కీల‌క‌ రాజకీయ అంశంగా మారింది. ఎన్నికల నియోజకవర్గాల పరిమాణాన్ని, భౌగోళిక పరిమితులను, ఓటర్ల విభజనను ఇది ప్రభావితం చేస్తుంది. ఈ మార్పులు రాజకీయ పార్టీల భవిష్యత్తుపై ప్రత్యక్ష ప్రభావం చూపే అవకాశం ఉంది. నియోజకవర్గాల పునర్విభ‌జ‌న చేప‌ట్ట‌డం వల్ల ప్రజాప్రతినిధుల సంఖ్య మారే అవకాశముంది. కొన్ని ప్రాంతాల్లో కొత్త నియోజకవర్గాలు ఏర్పాట‌వుతాయి. మ‌రికొన్ని రాష్ట్రాల్లో రాజకీయ పార్టీలు తమ వ్యూహాలను మార్చుకునేందుకు ఇది దోహ‌ద‌ప‌డుతుంది.

రాజకీయ పార్టీలు ఏం అంటున్నాయి?

పలు రాజకీయ పార్టీలు పునర్విభజనకు అనుకూలంగా ఉన్నా, మరికొన్ని దీన్ని వ్య‌తిరేకిస్తున్నాయి. పున‌ర్విభ‌జ‌న వ‌ల్ల తాము న‌ష్ట‌పోతామ‌ని అవి భావిస్తున్నాయి. ఈ క్రమంలో సీఎం రేవంత్‌రెడ్డి పర్యటన (Revanth Reddy Chennai visit) తెలంగాణకు ఎంతో కీలక అంశంగా మారింది. తెలంగాణలో నియోజకవర్గాల సంఖ్య పెరిగితే రాష్ట్రానికి ప్రయోజనం కలుగుతుందని అధికార‌ కాంగ్రెస్ భావిస్తోంది. పునర్విభజన ద్వారా దక్షిణాది రాష్ట్రాలకు అనుకూల మార్పులు రావాలని త‌మిళనాఆడు ప్ర‌భుత్వం కోరుకుంటోంది.

నియోజకవర్గాల పునర్విభజన… ప్రభావం

పున‌ర్విభ‌జ‌న (Delimitation)తో జనాభా ఆధారంగా రాజకీయ సమీకరణాలు మారొచ్చు. కొన్ని రాష్ట్రాల్లో జనాభా పెరుగుదల అధికంగా ఉండటంతో పాత నియోజకవర్గాలను పునర్వ్యవస్థీకరించాల్సిన అవసరం వ‌స్తుంది. అంటే, కొన్ని ప్రాంతాల్లో నియోజకవర్గాలు పెరుగుతాయి, మరికొన్ని చోట్ల తగ్గే అవకాశం ఉంది. అలాగే పున‌ర్విభ‌జ‌న ద్వారా ఓటర్ల మార్పిడి జ‌రిగి రాజకీయ లెక్కలు మారొచ్చు. కొన్ని నియోజకవర్గాల్లో ఓటర్ల సంఖ్య పెరిగితే ప్రత్యర్థి పార్టీల ఓటు బ్యాంక్ దెబ్బతింటుందా? అనే అనుమానాలు వ్య‌క్త‌మ‌వుతోంది.


తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం  సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి.  అలాగే మా  ఫేస్ బుక్,వాట్సప్ చానల్ఎక్స్(ట్విట్టర్)  ను  ఫాలో అవండి.  మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

More Posts

error: Content is protected !!